రాయలసీమ జానపద కళారూపాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాయలసీమలో యక్షగానాల తరువాతి వీధి నాటకాలు, బుర్ర కథలు, విచిత్ర వేషాలు, తోలు బొమ్మలాటలు, హరికథలు మొదలైనవి విరివిగా ప్రదర్శిస్తూ వుండేవారు. వీటినే బయలాటలనీ, బయలు నాటకాలనీ అనే వారు. వీటిని మాలపల్లెలో వున్న దాసరులు అనే వారు ప్రదర్శిస్తూ వుండే వారు. వీరని దాసుళ్లనీ, దాసరులనీ, కొమ్మాయి దాసుళ్ళనీ, మాల దాసరులనీ పిలువబడుతూ వుండేవారు. హరిజనుల్లో ఒక తెగ గానూ వారిలో అతీతులుగానూ వుండేవారు. శూద్ర జాతులు బ్రాహ్మణులను కూడా గూడెపు ప్రజలు గౌరవిస్తారు. ఒక నాడు వీటిని దాసరులు ప్రదర్శించినా, ఈనాడు అనేక మంది వాటిని ప్రదర్శిస్తూ జీవయాత్ర చేస్తున్నారు.

కంఠస్థంగా వున్న కళారూపాలు[మార్చు]

వీరు ప్రదర్శించే నాటకాలు అన్నీ వ్రాత ప్రతులుగానో, లేక తాటి యాకుల గ్రంథాల్లోనో లేక ప్రత్యేక వ్వక్తుల కంఠస్థం గానో నిలచి ఉన్నాయి. ఒక్కొక్క దేశంలో వున్న ముఖ్య నాయకునికి అనేక నాటకాలు కంఠస్థం అయి వుంటాయి. అతను మరణిస్తే, అతిని తోపాటే ఆ నాటకాలు కూడా అంతరిస్తాయి. ఈ విధంగా మన ప్రాచీన యక్షగాన సాహిత్యం, బయలు నాటకాల సాహ్యిత్యం అంతా శిథిలమైంది. అయినా ఇప్పటికీ రాయలసీమ పల్లెల్లో అనేక బయలు నాటకాలు ప్రచారంలో ఉన్నాయి. అవి కూడా కొన్ని అచ్చులో లేవనే చెప్పవచ్చు. వాటిలో కొన్ని మచ్చుకు ఈ క్రింద ఉదహారిస్తాను.

నాటి మేటి నాటకాలు[మార్చు]

దొడ్డ కవి వ్రాసిన సుగ్రీవ విజయం కుమ్మారి బాలయ్య వ్రాసిన సారంగధర రుద్ర కవి వ్రాసిన శశిరేఖా పరిణయం బెడుదూరు రంగా చార్యులు రామాచారయులు వ్రాసిన హరిశ్చంద్ర వేముల పల్లి కృష్ణ మాచార్యుల విరాట పర్వం నరసింహా రెడ్డి వ్రాసిన చుక్కలూరు రామ నాటకం. యాదవ సాసు రచించిన గరుడాచల యక్షగానం. మొదలైన పైన వివరంచినిన నాటకాలన్నీ నేటి రాయలసీమలో ప్రచారంలో ఉన్నాయి. ఇవి అన్నీ కూడా పురాణ కథా వస్తువులతో కూడినవే. అయినా పల్లె ప్రజలకు అర్థ మయ్యే శైలిలో వ్రాయబడ్డాయి. అంతే గాక ప్రదర్శనా క్రమంలో ప్రతి మాటా అర్థ మయ్యేటట్లు విడమార్చి చెప్పేవారు. అందు వల్ల చదురువాని ప్రేక్షకుకునికి కూడా ఆర్థమయ్యేది. అందుకు ఉదారహరణ యాదవ దాసు రచించిన గరుడాచల యక్ష గానంలో...................

బాణమెయ్యగలా మృగముల
బట్టి త్రుంచ గలవా..

నాణెము తోడున్నత జారుడు బండల
మీది కెక్క గలవా
మృగముల బట్టెదనే నేన్
నమముల తిరిగెదనే

నలుగురు కూడె నడి నడి బజారులో నాటక ప్రదర్శన[మార్చు]

పై విధంగా పాత్రల మధ్య సంవాదం జరుగు తుంది. ప్రదర్శనాల పద్ధతి. ఊరు మధ్య పెద్ద బజారులో నలుగురూ సమకూడే ప్రదేశంలో పెద్ద గడలతో వందిరి వేసి చుట్టూ మామిడి తోరణాలు గట్టి పందిరిలో ఎత్తుగా దిబ్బ పోసి ప్రదర్శనానికి ముందు మద్దెల తాళాలతో కొంచెం సందడి చేసేవాళ్ళు. అంతకు ముందు ప్రదర్శన కారులు ఇంటింటికీ వెళ్ళి రాత్రి ప్రదర్శనానికి రమ్మనమని ఆహ్వానించే వారు. ప్రదర్శనానిని లైట్లు వుండేవి కావు. తెరలు వుండేవి కావు. తెరలకు బదులు దుప్పట్లు ఉపయోగించే వారు. లైట్లకు బదులు దివిటీలు వెలిగించే వారు. కొన్నాళ్ళు కిరసనాయిలు ఇలాయి కఱ్ఱలు వెలిగించే వారు. గ్యాసు లైట్లు వచ్చిన తరువాత పై విధానాలు పోయాయి.

మంగామాతో రంగస్థల హంగులు[మార్చు]

తబలా వాయిద్యం

ఈ యక్షగానాల్లో స్త్రీ పాత్రలు పురుషులే ధరించే వారు. భుజ కీర్తులు ధరించే వారు. కిరిటీలు పక్షుల రెక్కలతో సొంపుగా తయారు చేసేవారు. వేష ధారణలో ఆయా అరసాలకు తగిన ఎరుపు, పశుపు, పచ్చ రంగులను ఉపయోగించేవారు. ప్రతి పాత్ర ప్రవేశానికి ఒక హంగామా చేసేవారు. ఈ విధంగా ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాన్ని రేకెత్తించే వారు. ముఖ్యంగా ప్రధాన పాత్రలు యముడు, కంసుడు, రావణుడు మొదలైన పాఅత్ర ప్రవేశాల్లో నిప్పులు గ్రక్కుతూ పాత్రలు వచ్చేవి. రంగ స్థలం పైకి పాత్ర రాగానే తెర పట్తి, తెర వెనుక పాత్ర ధారుల నుంచి తెర ముందు విధూషకుడు వచ్చి పాత్ర ధారిని ప్రేక్షకులకు ఎరుక పర్చడానికి అహా, ఈ సభా రంగమునకు విచ్చేసిన అమాత్యు లెవరండీ? అని ప్రశ్నిస్తే మెంటనే లోపల వున్న పాత్రధారి ఏ వుద్దేశ్యంతో ప్రవేశించ నున్నాడో అంతా పూస గ్రుచ్చినట్లూ పాత్ర పరిచయం చేశేవారు. ఆ తరువాత నాటక ప్రారంభం. నటుడు వల్లించిన ప్రతి పాటకూ హంగు దార్లు వంత పాడుతూ నానా హంగామా చేస్తారు. ఈ విధంగా నాటకాన్ని రక్తికి తీసుకు వస్తారు. ఈ విధమైన బయలు నాటకాలు రాయలసీమలో అన్ని పల్లె ప్రాంతాల్లోనూ ప్రదర్శింప బడుతూ వుండేవి.

వెదురు చాపల వీధి నాటక రంగస్థలం[మార్చు]

ఆనాడు రాయలసీమలో నాటకాలు ప్రదర్శించ టానికి తగిన ప్రదర్శన శాలలు లేవు. వెదురు చాపలు, తడికెలూ, గోనె సంచుల కప్పులతో నాటక శాలలు నిర్మించే వారు. ప్రతి నాటక సమాజమూ మంచి క్రమశిక్షణతొ రంగ స్థలాన్ని పవిత్రంగా ఎంచేవారు. నాటకాలలో వాయిద్యాలుగా హర్మోనియం, తబలా, మృదంగం, పిడేలు ఉపయోగించే వారు. వేష ధారణలో సఫేదు, అర్థళం వుపయోగించే వారు. ఉత్తమ పాత్ర లన్నిటికీ విలువైన చెంకీ కోటులను, మంచి తల పాగాలను తురాయిలనూ ఉపయోగించే వారు. విగ్గులకు బదులుగా వారి వారి శిరోజాలనే విగ్గులుగా పెంచుకునేవారు.

బళ్ళారికి పేరు తెచ్చిన బయలాటలు[మార్చు]

పూర్వం నుంచీ బళ్ళారి ప్రాంతంలో బయలాట అనే జానపద కళారూపం బహుళ ప్రచారంలో వుండేది. ఆంధ్ర ప్రదేశపు వీధి నాటక ప్రదర్శనానికి, ఈ బయలాట ప్రదర్శనానికి ఎంతో సన్నిహిత సంబంధముంది. ఈ నాటికీ ఈ కళారూపం బళ్ళారి చుట్టు ప్రక్కల గ్రామాల్లో ప్రదర్శింప బడుతూ ఉంది. ఒకప్పుడు బళ్ళారిలో జనల్ ఘాట్, మేఘాట్ అనే రెండు పెద్ద బయలాట కంపెనీలను గరుడ చేడు హనుమంతప్ప సామసాగరంగం వెంకణ్ణ కురుగోడు దొడ్దకవి మొదలైన వారు నడుపుతూ వుండే వారు. వీరు కన్నడిగులు.

మూలం: [[తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు]].