Coordinates: 16°12′34″N 79°54′36″E / 16.209544°N 79.909938°E / 16.209544; 79.909938

రొంపిచర్ల

వికీపీడియా నుండి
(రొంపిచెర్ల నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రొంపిచర్ల
—  రెవిన్యూ గ్రామం  —
రొంపిచర్ల is located in Andhra Pradesh
రొంపిచర్ల
రొంపిచర్ల
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°12′34″N 79°54′36″E / 16.209544°N 79.909938°E / 16.209544; 79.909938
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం రొంపిచర్ల
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 10,131
 - పురుషులు 5,116
 - స్త్రీలు 5,015
 - గృహాల సంఖ్య 2,545
పిన్ కోడ్ 522617
ఎస్.టి.డి కోడ్ 08647

రొంపిచర్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండలం లోని గ్రామం, ఆ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన నరసరావుపేట నుండి 16 కి.మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2545 ఇళ్లతో, 10131 జనాభాతో 2811 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5116, ఆడవారి సంఖ్య 5015. షెడ్యూల్డ్ కులాల జనాభా 1891 కాగా షెడ్యూల్డ్ తెగల జనాభా 236. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590138.[1]

గ్రామ చరిత్ర[మార్చు]

ఈ గ్రామానికి 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది.అయినప్పటికి చరిత్ర గ్రంథాల్లో స్థానం సంపాదించుకోలేకపోయింది. సా.శ.1000లో ఈ గ్రామాన్ని సవాలేఖవరం అని పిలిచేవారని నరసరావుపేట చరిత్ర పుస్తకం తెలుపుతోంది. కుళోత్తుంగ చోళుని కాలంలో ఇది రత్నాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. నరసరావుపేటకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రొంపిచర్లను చోళ, ముసునూరు కాపులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు పాలించినట్లు చరిత్ర చెబుతోంది.మధ్యయుగాల కాలం నాటి త్రిపురసుందరీ సమేత పరమేశ్వరుని ఆలయం ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందింది. ఆనాటి శిలాశాసనాలు కూడా అక్కడ ఉన్నాయి. ఆంగ్లేయుల కాలంలో ఫిర్ఖా కేంద్రంగా ఉండేది. వారు నిర్మించిన బంగ్లా కూడా ఉంది.

గ్రామ జనాభా[మార్చు]

  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా 9451పురుషుల సంఖ్య 4843, మహిళలు 4608, నివాస గృహాలు 2102, విస్తీర్ణం 2811 హెక్టారులు

సమీప గ్రామాలు[మార్చు]

గోగులపాడు 7 కి.మీ, పాలపాడు 7 కి.మీ, ముత్తనపల్లి 7 కి.మీ.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల ముప్పాళ్ళ లోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు నరసరావుపేటలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు నరసరావుపేటలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం నరసరావుపేటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

రొంపిచర్లలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఐదుగురు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

రొంపిచర్లలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ట్రాక్టరు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ఈ ఊరికి గుంటూరు-వినుకొండ మార్గము లోని మునుమాక వద్ద రైల్వే స్టేషను సదుపాయం ఉంది.

ప్రధాన జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 9 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

రొంపిచర్లలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 235 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 188 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 73 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 38 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 41 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 99 హెక్టార్లు
  • బంజరు భూమి: 234 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1897 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 456 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1775 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

రొంపిచర్లలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 1775 హెక్టార్లు

రాజకీయాలు[మార్చు]

ఇది నరసరావుపేట శాసనసభ నియోజక వర్గ పరిధిలో ఉంది. ఇది మండల కేంద్రం కూడా. దాదాపు 1200 సంవత్సరాలకు పైగా చారిత్రక రుజువులు కలిగిన ఈ గ్రామం ప్రస్తుతం రాజకీయంగా ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. సుమారు 40 గ్రామాలకు రొంపిచర్ల కేంద్రంగా ఉంది. నార్కట్‌పల్లి- హైదరాబాద్ రహదారిపై ఉన్న ప్రధాన గ్రామాల్లో ఇదీ ఒకటి. గ్రామ జనాభా 10 వేలకు పైగానే ఉంటుంది.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 ఆగష్టు-8న, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో గెల్లి చిన్నకోటిరెడ్డి, 186 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ శంకరస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం[మార్చు]

రొంపిచర్ల గ్రామములోని పడమటిపాలెంలో వెలసిన ఈ ఆలయంలో, శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్సమేత శ్రీ కోదండరామస్వామివారి నూతన శిలా విగ్రహ, ధ్వజస్తంభ, ఆలయ శిఖర మహాప్రతిష్ఠా మహోత్సవాల ప్రత్యేక పూజా కార్యక్రమాలు, 2016, మార్చి-24వ తేదీ గురువారంనాడు అత్యంత వైభవంగా నిర్వహించారు.

శ్రీ చౌడేశ్వరీ అమ్మవారి ఆలయం[మార్చు]

గ్రామములో నూతనంగా నిర్మించుచున్న ఈ ఆలయ నిర్మాణానికి, 2017, జూన్-19వతేదీ సోమవారంనాడు, శంకుస్థాపన వైభవంగా నిర్వహించారు.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చందిన గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర వికలాంగుల కమిషన్ ఛైర్మనుగా నియమితులైనారు. ఇతను ఈ పదవినధిరోహించడం ఇది మూడవసారి. ఇతను 1994, 1998 లలో గూడా ఈ పదవిలో ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".