Jump to content

లక్ష్మీ ఎన్. మీనన్

వికీపీడియా నుండి
లక్ష్మీ ఎన్. మీనన్
లక్ష్మీ ఎన్. మీనన్
జననం1899-03-29
త్రివేండ్రం
మరణం1994-11-30
జాతీయతభారతీయురాలు
వృత్తిరాజ్యసభ సభ్యురాలు
విదేశాంగ మంత్రిత్వ శాఖలో పార్లమెంటరీ కార్యదర్శి
ఉప మంత్రి, రాష్ట్ర మంత్రి,
Notable work(s)Women Pioneers in India's Renaissance
భార్య / భర్తఆచార్య వి.కె. నందన్
తండ్రిరామ వర్మ తంపన్
తల్లిమాధవికుట్టి
Honoursపద్మభూషణ్

లక్ష్మి ఎన్. మీనన్ (29 మార్చి 1899-30 నవంబర్ 1994) ఒక భారత స్వాతంత్ర సమర యోధురాలు, రాజకీయవేత్త, రాష్ట్ర మంత్రి[1]. ఈమె ఐక్యరాజ్యసమితి ప్రతినిథిగా డిసెంబర్ 1948లో జరిగిన మానవ హక్కుల సార్వత్రిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగించింది.[2]

ప్రారంభ జీవితం

[మార్చు]

త్రివేండ్రం లో రామ వర్మ తంపన్, మాధవికుట్టి అమ్మ దంపతులకు లక్ష్మి ఎన్. మీనన్ 1899 లో మార్చి 29న జన్మించింది. ఆమె ఆచార్య వి.కె. నందన్ మీనన్ ను 1930 లో వివాహం చేసుకుంది. తరువాత అయన ట్రావెన్కోర్ విశ్వవిద్యాలయం, పాట్నా విశ్వవిద్యాలయంలలో ఉపకులపతిగా పనిచేసారు. ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కు సంచాలకుడు (డైరెక్టర్) కూడా అయ్యారు.[3]

రాజకీయ జీవితం

[మార్చు]
మీనన్ (ముందు వరుస లో ఎడమ వైపు) 1963 జూన్ 3న వైట్ హౌస్, ప్రభుత్వ విందులో పాల్గొనింది

లక్ష్మి ఎన్. మీనన్ 1952 నుండి 1966 వరకు రాజ్యసభ సభ్యురాలిగా, 1952 నుండి 1957 వరకు విదేశాంగ మంత్రిత్వ శాఖలో పార్లమెంటరీ కార్యదర్శిగా, 1957 నుండి 1962 వరకు ఉప మంత్రిగా, 1966 లో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసింది. 1967లో రాజకీయ సేవ నుండి పదవీ విరమణ చేసింది. సామాజిక సేవ, రచన వైపు కూడా వెళ్లారు. ఆమె ఆక్సఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ ప్రచురించిన "ఆక్సఫర్డ్ పాంఫ్లెట్స్ ఆన్ ఇండియన్ అఫైర్స్" సిరీస్ కోసం భారతీయ మహిళలపై ఒక పుస్తకాన్ని రచించింది. భారతదేశంలో విశ్వవిద్యాలయ మహిళల సమాఖ్యను స్థాపించడానికి ఆమె సహాయపడింది.[4] ఆమె సేవలకు గుర్తింపుగా, 1957లో పద్మభూషణ్ లభించింది. ఆమె ఈ అవార్డును అందుకున్న రెండవ మలయాళీ వ్యక్తి .[5]

మీనన్ రాజకీయాల తర్వాత తన క్రియాశీల జీవితాన్ని దేశ ప్రయోజనం కోసం అంకితం చేసింది. ఆమె అఖిల భారత మహిళా సదస్సుకు అధ్యక్షురాలిగా, పోషకురాలిగా కూడా చాలా సంవత్సరాలు పనిచేసింది. మొరార్జీ దేశాయ్ తో పాటు ఆమె అఖిల భారత మద్యనిషేధ మండలికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. 1988లో, ఆమె ఎ.పి. ఉదయభాను, జాన్సన్ జె. ఎడారన్ములతో కలిసి "ఆల్కహాల్ & డ్రగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎ.డి.ఐ.సి.) ఇండియా"ను స్థాపించి, ఆమె మరణించే వరకు దాని అధ్యక్షురాలిగా పనిచేసింది. మహిళల్లో నిరక్షరాస్యత నిర్మూలన కోసం అఖిల భారత కమిటీ అధ్యక్షురాలిగా 1972 నుండి 1985 వరకు కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్ష్యురాలిగా (చైర్ పర్సన్) కూడా పనిచేసింది.

లక్ష్మీ మీనన్ నెహ్రు ప్రభుత్వంలో సహాయ మంత్రిగా తన పదవీ కాలంలో త్రివేండ్రం వద్ద "తుంబ ఈక్వటోరియల్ రాకెట్ లాంచ్ స్టేషన్" ఏర్పాటులో బ్యూరోక్రాటిక్ విధానాన్ని సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషించింది.[6]

గ్రంథ పట్టిక

[మార్చు]
  • Ranade, Shobana; Nayar, Sushila (2003). "Lakshmi N. Menon (1899–1994)". In Mankekar, Kamla (ed.). Women Pioneers in India's Renaissance. New Delhi: National Book Trust India. ISBN 9788123737669.

సూచనలు

[మార్చు]
  1. "Unsung Heroes Detail, Ministry of Culture". Retrieved 27 March 2023.
  2. Adami, Rebecca (2019). Women and the Universal Declaration of Human Rights. New York & London: Routledge. p. 146. ISBN 9780429437939.
  3. "University of Kerala, Thiruvananthapuram". way2universities.com. Archived from the original on 6 March 2016. Retrieved 6 March 2016.
  4. Bālā, U.; Sharma, A. (1986). Indian Women Freedom Fighters, 1857–1947 (in జర్మన్). Manohar. p. 74. ISBN 9788185054131. Retrieved 2020-07-31. She was the Founder – member of the All – India Women ' s Conference , and of the Federation of University Women .
  5. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.
  6. "Remembering the guiding light". Deccan Chronicle. Retrieved 2020-10-26.