వనిత (పత్రిక)
స్వరూపం
వనిత, మహిళల కోసం ప్రచురితమైన పక్షపత్రిక. ఈ పత్రిక 1975 జూన్లో మొదలైంది.[1] పిల్ల పత్రిక చందమామను ప్రచురించిన చందమామ పబ్లికేషన్స్ వారు బి. విశ్వనాథరెడ్డి సంపాదకత్వంలో మద్రాసు నుండి ఈ పత్రికను వెలువరించారు. 1978 జూలై నుండి ఇది మాసపత్రికగా మారింది.
కథలు, సీరియళ్ళు, వంటలు, సౌందర్య సలహాలు, రచయిత్రులతో ముఖాముఖీ వంటి శీర్షికలతో పాటు వనిత మాటల కొలువు పేరుతో గళ్ళనుడికట్టు శీర్షికను కూడా నిర్వహించేవారు. పాఠకుల లేఖలలో రెండు రకాలుగా చేసేవారు "అభిప్రాయాలు" శీర్షిక కింద ప్రచురించే ప్రతి లేఖకూ 5 రూపాయలు పారితోషికం ఇచ్చేవారు. ఉత్తరాలు శీర్షిక కింద ప్రచురించేవాటికి బహుమతి ఉండేది కాదు.[2]