వాడుకరి:Gogulapati Krishna Mohan
గోగులపాటి కృష్ణమోహన్, కవి, రచయిత, జర్నలిస్టు (స్వీయపరిచయం)
పేరు : గోగులపాటి కృష్ణమోహన్ పుట్టినరోజు: 13-08-1970 తల్లి దండ్రుల పేర్లు : కీ|| శే|| గోగులపాటి రుక్మిణిబాయి, కొండల్ రావు. భార్య పేరు: శ్రీమతి రేఖాజ్యోతి సంతానం ఇద్దరు : కూతురు అల్లుడు: నవ్యశ్రీ, పండరి ఆత్రేష్ కొడుకు: అఖిల్ శ్రీవాత్సవ్
జన్మస్థలం : గ్రా. కూనూరు, మం. భువనగిరి, జి. నల్లగొండ. (ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా)
నివాసం: ఇం. నం. 3-160, క్వార్టర్ నం. 918, సూరారం కాలని, జిల్లా : మేడ్చల్ మల్కాజ్ గిరి, గ్రేటర్ హైదరాబాద్.
వృత్తి : ఏజియం. ప్రవృత్తి : జర్నలిస్టు.
బిరుదులు : తెలుగు కవితా వైభవం వారిచే.. సహస్రకవిమిత్ర, 10-04-2016 సహస్రకవిరత్న, సహస్రవాణి శతపధ్య కంఠీరవ, (08-04-2017),సహస్రవాణి సహస్రపధ్య కంఠీరవ,సహస్రవాణి శతస్వీయ కవితాకోకిల. ప్రతిలిపికవిప్రవీణ, ప్రతిలిపి కథా భారతి
పురస్కారాలు:- తెలుగు రక్షణ వేదిక వారిచే జాతీయ స్థాయి "బతుకమ్మ" పురస్కారం - 23-10-2016
రైతు హార్వెస్టర్, కరీంనగర్ వారి కృషి కవిత పురస్కారం (వేయి మంది కవులతో రికార్డు కవిసమ్మేళనం తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్ నమోదు) - 10-09-2017
జాగృతి కవితాంజలి పురస్కారం (09-09-2017 న కాళోజీ జయంతి సందర్భంగా రవీంద్రభారతి, హైదరాబాద్ లో జరిగిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కవిసమ్మేళనం లో పాల్గొనడం) -
తెలుగు రక్షణ వేదిక ఆద్వర్యంలో అనంతపురంలో ప్రపంచ రికార్డు కవిసమ్మేళనం ( అనంతపురంలో 33 గంటల, 44 నిముషాల, 55 సెకన్ల పాటు ఏకదాటిగా నిర్వహించిన రికార్డు కవిసమ్మేళనంలో పాల్గొని ఐదు రికార్డులతో (తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆంద్ర బుక్ ఆఫ్ రికార్డ్స్, యన్.టి.ఆర్. బుక్ ఆఫ్ రికార్డ్స్, తానా బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్.) తో కూడిన సర్టిఫికెట్ జ్ఙాపిక. 15 - 10 - 2017
తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో తేది 17-12-2017న జరిగిన సమావేశంలో నేను "తేటతెనుగు భాష నా భాష" అనే కవితా పఠనము చేయడం జరిగింది, ఈ సందర్భంగా తెలంగాణా గ్రందాలయ చైర్మన్ అయాచితం శ్రీధర్, నాళేశ్వరం శంకరయ్య తదితరుల చేతులమీదుగా మెమొంటో, శాలువా, నగదు పురస్కరం తో సన్మానం.
తెలంగాణ వికాస సమితి, తెలంగాణ రచయుతల సంఘం ఆధ్వర్యంలో... వనపర్తిలో జరిగిన తెలంగాణ జల కవితోత్సవం పురస్కారం 06-05-2018
తెలంగాణ సాహిత్య అకాడమీ మరియు యాదాద్రి భువనగిరి జిల్లా రచయుతల సంఘం సంయుక్త ఆద్వర్యంలో నిర్వహించిన సాహితీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రశంసాపత్రము. 23-05-2018.
రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ నిర్వహించిన కవిసమ్మేళనం లో పాల్గొని జిల్లా కలెక్టర్ చేతులమీదుగా పురస్కారం... 02-06-2018.
ఉదయకళానిధి ఆధ్వర్యంలో యాదాద్రి దేవాలయ శిల్పులకు అక్షరనీరాజనం కార్యక్రమం నిర్వహణలో లో క్రియాశీలకపాత్ర..
09-09-2018 తెలంగాణ సాహిత్య అకాడమీ ఆద్వర్యంలో నిర్వహించిన కాళోజీ జయంతి వేడుకలో పాల్గొని కవితా గానం... సన్మానంతో పాటు నగదు పురస్కారం.
03-04-2021, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆధ్వర్యంలో స్వాతంత్ర్య భారత అమృత మహోత్సవాలో భాగంగా కవి సమ్మేళనంలో సన్మానంతో పాటు నగదు పురస్కారం.
11-06-2023, తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సమ్మేళనంలో సన్మానంతో పాటు నగదు పురస్కారం.
చేపట్టిన కార్యక్రమాలు ఆన్ లైన్లో శతాధిక అష్టావధానాల నిర్వహణ: తేది 31-01 2019 న విళంభి నామ సంవత్సర పుష్య బహుళ ఏకాదశి రోజు సాయంత్రం 7 గంటలకు మొదలు తేది 18-5-2019 శనవారం వరకు అనగా వికారి నామ సంవత్సర వైశాక శుద్ద పూర్ణిమ తో అమ్మవారి కృపాకటాక్షాలతో... ఆన్లైన్ అవధాన ప్రక్రియకు శ్రీకారం 108 రోజులపాటు నిరంతరాయంగా, నిర్విఘ్నంగా అవధాని శ్రీ గౌరిభట్ల బాలముకుంద శర్మ గారిచే నిత్యావధానం
భావితరాలకు అవధానప్రక్రియను, అవధానుల పరిచయం చేసే సదుద్దేశంతో వాట్సప్ వేదికగా దృశ్య శ్రవణ అష్టావధానాల నిర్వహణ, ఇందులో ప్రముఖ మరియు నవావధానులతో అష్టావధానమ్ నిర్వహించి, వాటిని యూట్యూబ్, బ్లాగులలో నిక్షిప్త పరచడం..
సాహితీసేవలో భాగంగా ఇప్పటి వరకు కవుల కవితలు బద్రంగా ఉండేందుకు దాదాపు నూటాయాబైకి పైగా బ్లాగుల నిర్వహణ
భావితరాలకు సాహితీ పరిమలాలు అందించాలనే ఉద్దేశంతో విద్యార్ధినీ విద్యార్ధులకు సృజనాత్మక రచనా కార్యశాలల ఏర్పాటు,
బాలోత్సవాల పేరిట పిల్లలలో ఉన్న సృజనాత్మకత వెలితీసే కార్యక్రమాలు
కొత్త కవుల పుస్తకాల ముద్రణకొరకు సహకారం
పలు అంశాలపై పుస్తక సంకలనాలు
మెతుకు సీమ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ సాహితి సంస్థ నిర్వాహకునిగా ఉగాది పురస్కారం
వ్యవస్థాపక అధ్యక్షుడు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రచయితల సంఘం.
సంఘాన్ని స్థాపించిన సంవత్సరకాలంలోనే సంస్థ తరపున మూడు సంకలనాలు తీయడం తో పాటు తనతో పాటు మరో నలుగురి కవుల ప్రథమ సంపుటీల ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు.
బాలోత్సవాల పేరుతో తొమ్మిది వందలకు పైగా బాలబాలికలకు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగేలా పలు కార్యక్రమాలు నిర్వహించి ప్రోత్సహించారు. ప్రతిభను కనబర్చిన వారికి కావ్యకానుకలతో పాటు ప్రశంసాపత్రాల అందజేత.
భావితరాలకు సాహితీ పరిమళాలు అందించాలనే ఉద్దేశంతో... సృజనాత్మక రచన కార్యశాలలు ఏర్పాటు చేశారు.
బాద్యతలు: సలహాదారుడు, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్, అల్వాల్ శాఖ.
వ్యవస్థాపకులు : తెలుగు కవన వేదిక... వ్యవస్థాపకులు: మరియు నా ఫౌండేషన్...
ముద్రితాలు ; కవి విశ్వంభరుడు సంకలనం (సినారె యాదిలో వారి 87వ జయంతి పురస్కరించుకొని ఎనుబైఏడు మంది కవనాలతో కేవలం ఇరువై రోజులలో కవితా సంకలనం ఆవిష్కరణ)
కృష్ణ కందాలు : కంద పద్యాల శతకం
వీరసైనికా వందనం (సంకలనం) సరిహద్దులో మన కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి అహర్నిశలు శ్రమిస్తున్న వీర సైనికులకు అంకితం ఇస్తూ జిల్లా లోని యాబై ఎనిమిది మంది కవులతో సంకలనం.
జలనిధి కాళేశ్వరం: తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలువనున్న మేడిగడ్డ వద్ద శరవేగంగా నిర్మితం అవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు రూపశిల్పులకు అక్షరనీరాజనం కోసం సుమారు మూడువందల మంది కవులతో సంకలనం.(విడుదలకు సిద్ధం)
అముద్రితాలు కృష్ణ చైతన్యం (భావ కవితలు)
కృష్ణ ఆటవెలదులు శతకం
కృష్ఞ కథలు మినీ (కార్డు) కథలు
రచనలు ఐదువందలకు పైగా వచన, భావ కవితలు. కార్డుకథలు, నానోలు, నానీలు, మణిపూసలు, ఇష్టపదులు, పద్యాలు మొదలగు ప్రక్రియలలో పలు రచనలు,
కార్డు కథలు... వ్యాసాలు.
అభిరుచులు : సామాజిక సేవ, క్రీడలు, కవనాలు, సినిమాలు, వార్తాసేకరణ, యాంకరింగ్, స్నేహం
సాహితీ సేవలు:-
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రచయితల సంఘం ద్వారా జిల్లా కవులందరినీ సమీకరించడం, ఔత్సాహిక కవులకు కవన రచనలో మెలుకువలు నేర్పడం, భావి తరాలకు సాహితీ పరిమళాలు అందించాలనే సత్సంకల్పంతో బాలకవులకు సృజనాత్మక రచనా కార్యశాలలు ఏర్పర్చడం...బాలోత్సవాల నిర్వహణ, ముఖ్యమైన అంశాలతో పాటు కవితా సంకలనాల ద్వారా కొత్త కవులకు సంకలనంలో అవకాశాలు కల్పించడం.
తెలుగు కవన వేదిక ద్వారా తెలుగు భాషాభివృద్దికోసం సత్ సంకల్పం తో వారం వారం ప్రత్యేక అంశాన్ని ఇస్తూ కవుల ద్వారా కవితలను సేకరించి వాటిని బద్రంగా బ్లాగులో పొందపరచడంతో పాటు వాటిని తెలుగు కవన వేదిక అనే పేరుతో అంతర్జాల సాహిత్య పత్రిక రూపంలో కూడా సంచికలను వెలువరిస్తున్నాను.
తేది 19-08-2019, సోమవారం రోజున సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో రెండువందలకు పైగా విద్యార్థులచే బాలసాహిత్యం పై సృజనాత్మక రచనా కార్యశాల ఏర్పాటు.
స్వగ్రామం యాదాద్రి జిల్లా, భువనగిరి మండలం కూనూరు గ్రామంలో గ్రంథాలయ ఏర్పాటు కోసం సన్నాహాలు.
పుస్తక రూపకల్పనలు
(డిటిపి, ముద్రణ భాద్యతలు)
ముద్రితాలు:-
కవి విశ్వంభరుడు (సంకలన కర్త)
కృష్ణకందాలు (స్వీయ సంపుటి)
రెప్పచాటు మౌనం
నేను సైతం
రవికిరణాలు
వీరసైనికా వందనం (సంకలన కర్త)
అమృతవాక్కులు (౧౩)
అమృతవాక్కులు (౧౪)
మల్లినాథసూరి (సంకలనం)
సైనికార్చన (సంకలనం)
జలమే జగతికి మూలం (సంకలనం)
కందాళై రచనలు
తొలకరి జల్లు
శతచ్ఛంద గణాధిపమ్ (సంకలనకర్త)
చిద్విలాస శతకం
ఊయల
కరుణించి కాపాడు భద్రకాళీ
వర్గలుగిరి విద్యాధరి (సంకలనం)
శ్రీభువనేశీ (సంకలనం)
అష్టకాల స్మృతి కవనం (సంకలనం)
సాయినాథ శతకం
అమృతమూర్తికి అక్షరాభిషేకం (సంకలనం)
అముద్రితాలు:- జలనిధి కాళేశ్వరం (సంకలనం) కృష్ణ చైతన్యం
NA FOUNDATION (నా ఫౌండేషన్)
సంస్కృతి, సమాజం, సాహిత్య సేవే లక్ష్యంగా నా ఫౌండేషన్ స్థాపించి ఆయా రంగాలలో విశేష ప్రతిభ కనబరుస్తున్న వారిని సేవా బంధు పురస్కారంతో ప్రోత్సహం...
నినాదం : కులరహిత సమాజం నిర్మిద్దాం.... ఆర్ధిక అసమానతలు తొలగిద్దాం....
చరవాణి నంబరు: 9700007653
ఇ.మెయిల్ : krishnamohan138@gmail.com
బ్లాగు : http://krishnamohan138.blogspot.com?
కేబుల్ రంగంలో.... గోగులపాటి కృష్ణమోహన్
వృత్తి:- కృష్ణమోహన్ గోగులపాటి: కేబుల్ రంగంలో అడుగిడి ఇరువై ఆరేళ్ళు యేళ్ళు పూర్తి చేసుకున్నారు.
1996 డిసెంబర్ లో సౌజన్య శాటిలైట్ నెట్వర్క్ లో రూపొందించిన వెల్కమ్ టు 97 కార్యక్రమం ద్వారా బుల్లితెరకు పరిచయమై... ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు.
కేబుల్ ఇండస్ట్రీ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన గోగులపాటి కృష్ణమోహన్ కేబుల్ రంగంలో అడుగిడి ఇరువై వసంతాలను పూర్తిచేసుకున్నాడు.
జీడిమెట్ల సిటీకేబుల్ లో, మార్కెటింగ్ మేనేజర్ గా, ప్రోగ్రామ్ ఇంచార్జ్ గా, న్యూస్ రీడర్ గా, యాంకర్ గా, న్యూస్ ఇంచార్జ్ గా పలు విభాగాలలో రాణించి సుమారు యాబైకి పైగా కార్యక్రమాలను రూపొందించి అందరిమెప్పు పొందాడు.
శుభోదయ కమ్యూనికేషన్ లో ఆపరేషన్ ఇంచార్జ్ గా మెదక్ జిల్లాలో పనిచేశాడు, హిందుజా హిట్స్ లో మెదక్, రంగారెడ్డి జిల్లాల టెరిటరీ మేనేజర్ గా కూడా పనిచేశాడు. డిజీకేబుల్ లో బిజినెస్ మేనేజర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియానెట్ లో పనిచేస్తున్నారు.
తనకు హాబీలైన వ్యాసాలు, కవితలు, పద్యాలు రెండు శతకాలు రాసి తెలుగువేదిక ఆధ్వర్యంలో 2016 లో "సహస్ర కవిమిత్ర" బిరుదును కూడా పొందాడు.
వీటితో పాటు సురారం కాలనీ లోని శ్రీ నల్లపోచమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శిగా ఉంటూ పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని సమాజసేవ లో సైతం తనవంతు పాత్రను పోషించాడు.
మరోవైపు తనకిష్టమైన వార్తా రంగంలో స్టింగర్ గా కూడా పనిచేస్తూ తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అసోసియేషన్, అల్వాల్ శాఖకు అడ్వైజర్ గా తన సేవలందిస్తున్నారు.
ప్రస్తుతం బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో-ఆర్డినేటర్ గా, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆర్గనైజింగ్ సెక్రటరీగా బ్రాహ్మణ కమ్యూనిటీ అభివృద్ది కోసం తనవంతు భాద్యతగా ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు.
ఈ సందర్భంగా కృష్ణమోహన్ తన అభిప్రాయం తెలియజేస్తూ కేబుల్ రంగానికి పరిచయం చేసి తనకు సమాజంలో మరో జన్మను ప్రసాదించిన తెలంగాణ ఎఫ్. టి. ఎమ్. అధ్యక్షుడు శ్రీ సుభాష్ రెడ్డికి తనెంతో ఋణపడి ఉంటానని తెలిపాడు.
కేబుల్ టీవీ రంగంలో సీనియర్లైన శ్రీకుమార్, ఇంతియాజ్ అహ్మద్, ఆర్కే సింగ్, మనీష్ మాథూర్, సత్య, కిషోర్, మనోజ్ దూబే, ప్రతాప్ రెడ్డి లాంటి వారితో, అలాగే ఇంటర్నెట్ రంగంలో హైరిచ్ బ్యాడ్ హుస్సేన్ నాయక్, జ్యేటెక్ రాజ్ కుమార్ రెడ్డి గారలతో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నాని... వారి నుండి కేబుల్, ఇంటర్నెట్ ఇండస్ట్రీకి సంబందించిన ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాని పేర్కొన్నాడు.
ఇంతకాలం తనకు అన్నివిధాల సహాయ సహకారాలందించిన కేబుల్ ఆపరేటర్లకు, తోటి సిబ్బందికి దన్యవాదాలు తెలియజేశాడు.
సేవా కార్యక్రమాలు:- ఆపద్బంధు అనే వాట్సాప్ సమూహం ద్వారా దాతలు సహకారంతో చనిపోయిన, చావుబతుకుల్లో ఉన్న పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు
శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉచిత ఆరోగ్య శిభిరాలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహణ
మహిళలచే ప్రతి చివరి ఆదివారం లలితా సహస్రనామ పారాయణం భజన కార్యక్రమాలు
విద్యార్ధిని విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాల వితరణ
సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో భాగంగా పలు పోరాటాలు
పేద బ్రాహ్మణ కుటుంబాలకు జరిగిన అన్యాయాలపై పోరాటాలు
నా ఫౌండేషన్ సామాజిక సాంస్కృతిక సాహిత్య సేవాసంస్థ ప్రారంభించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నా టీవి నా టీవి (ఎంటర్అటైన్మెంట్ మరియు న్యూస్ ఛానల్) యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు.
ఇలా విభిన్న రంగాలలో పనిచేస్తూ అందరి ఆదరాభిమానాలను చూరగొన్న గోగులపాటి కృష్ణమోహన్ ఈ ఆగస్టు 13న తన జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.... భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.