Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2025 26వ వారం

వికీపీడియా నుండి
సింధూ నది

సింధూ నది భారత ఉపఖండంలో ప్రసిద్ధమయిన నది. ఇది హిమాలయాలలోని మానస సరోవరం బోకర్చు వద్ద టిబెట్దేశంలో పుట్టి కాశ్మీర్, పంజాబ్, సింధు రాష్ట్రాలలో ప్రవహించి పాకిస్తాన్‍ లోని కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. పాకిస్థాన్లోని అతిపెద్ద, జాతీయ నది సింధు. సింధు నదికి జీలం, చీనాబ్, రావీ, బియాస్, సట్లెజ్ ఉపనదులుగా ఉన్నాయి. ఇది ప్రవహించే ప్రాంతం అంతా అత్యంత సారవంతమైన భూమి. ఈ నదుల మీద పాకిస్తాన్ ప్రభుత్వం మంగళా ఆనకట్ట, సుక్కూలారు వంతెన, భారతదేశంలోని పంజాబులో సట్లెజ్ నది మీద భాక్రానంగల్ ఆనకట్ట వంటి భారీ ఆనకట్టలు కట్టి వ్యవసాయక్షేత్రాలకు నీటిని అందించి గోధుమ, వరి, చెరకు విరివిగా పండించడమేకాక జలవిద్యుత్తును ఉత్పత్తి చేసి పరిశ్రమలకు సరఫరా చేస్తుంది. సింధు నది పొడవు 2880 కి.మీ. సింధు నదీ లోయలో సుమారు 5,000 సంవత్సరాల ఉజ్జ్వలమైన సింధు నాగరికత వెలసి వర్ధిల్లింది. సింధూ నది టిబెట్టులోని మానస సరోవరం, కైలాస పర్వతాలనుంచి జమ్ము కశ్మీరులోని లడాఖు మీదుగా- గిల్గిట్‌, బాల్టిస్థాను నుండి పాకిస్థానులోని పంజాబు రాష్ట్రం గుండా ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రవహించి కరాచీ ద్వారా అరేబియా మహా సముద్రంలో కలుస్తోంది. సింధూ నదికి సంబంధించిన అనేక ఉపనదులు భారతులోని జమ్ము కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌ల మీదుగా ప్రవహించి పాకిస్తాన్‌లో ప్రవేశిస్తాయి. 3,180 కిలోమీటర్ల పొడవునా ప్రవహించే సింధూనది వార్షిక నీటిప్రవాహం ప్రాతిపదికన ప్రపంచంలో 21వ అతి పెద్ద నదిగా గుర్తింపు పొందింది. చైనా, భారత్‌, ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌ల మీదుగా ప్రవహించే ఈ జీవనది పరీవాహక ప్రాంతం మొత్తం 11,65,000 చదరపు కిలోమీటర్లు. వార్షిక ప్రవాహ లెక్కల ప్రకారం సింధు నది ప్రపంచంలో కెల్లా 21వ అతిపెద్ద నదిగా రికార్డు నమోదు చేసింది. భారత పాకిస్తానులు సింధు నదీ జలాలను వినియోగించుకునేందుకు ఒక అంతర్జాతీయ నీటి పంపక ఒడంబడికను కుదుర్చుకున్నాయి.
(ఇంకా…)