విజయవాడ మెట్రో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయవాడ మెట్రో
Vijayawada Metro
ముఖ్య వివరాలు
స్థానిక ప్రదేశంవిజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము
ట్రాన్సిట్ రకంరాపిడ్ రవాణా
లైన్ల సంఖ్య2 (ప్రణాళిక)
కార్యాచరణ ప్రారంభమయ్యేది2018 (అంచనా)
సాంకేతిక అంశాలు
వ్యవస్థ పొడవు26.03 కి.మీ.
System map

విజయవాడ మెట్రో రైలు భారత దేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో విజయవాడ నగరంలో ఒక ప్రతిపాదిత వేగవంతమైన రైలు రవాణా వ్యవస్థ. ఈ వ్యవస్థ ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి ప్రతిపాదించబడింది. అలాగే ప్రకటించిన ఆంధ్ర ప్రదేశ్ రాజధాని వంటిది దానికి సమీపంలో వస్తోంది. విజయవాడ మెట్రో మొదటి దశలో 30 కి.మీ. ఆవరించి ఉండే విధంగా రెండు కారిడార్లు కలిగి ఉంది. మొదటి కారిడార్ మహాత్మా గాంధీ రోడ్ ద్వారా వి.ఆర్. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ నుండి పండిట్ నెహ్రూ బస్ స్టేషను వరకు, రెండవది బిఆర్‌టిఎస్ రోడ్, రైల్వే స్టేషను ద్వారా రామవరప్పాడు రింగ్ నుండి పండిట్ నెహ్రూ బస్ స్టేషను వరకు ఉంటుంది.

చరిత్ర[మార్చు]

మెట్రో వ్యవస్థ ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాజధాని వంటిది దానికి సమీపంలో వస్తోంది అని ప్రకటించారు. ఢిల్లీ మెట్రో రైల్ ప్రాజెక్టును అమలు చేయడములో విజయవంతమైనది దృష్టిలో ఉంచుకుని, ప్రాజెక్ట్‌ను వీక్షించడానికి ఈ. శ్రీధరన్ నేతృత్వంలోని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్‌సి) కి ప్రదానం చేశారు. నిజమైన పనితీరును, అతని శైలిని, చూసి ఈ. శ్రీధరన్ ప్రముఖంగా "మెట్రో మాన్" అని పిలవబడతారు. కొద్దికాలం క్రితమే నగరాన్ని సందర్శించారు. ఆ పర్యటన తరువాత, ప్రాజెక్ట్ పని చురుకుగా జరుగుతున్నది.[1] డిఎంఆర్‌సిని విజయవాడ మెట్రో ఫేజ్-1 ప్రాజెక్టు డిసెంబరు,2018 నాటికి పూర్తి కావాలని నిర్ణయం చెయ్యబడింది.[2] డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పని సాగుతోంది.

వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్ట్[మార్చు]

ఆర్‌విఆర్ అసోసియేట్స్, ఒక సంస్థకు కేటాయించిన గృహ, ట్రాఫిక్ సర్వేలు బాధ్యతను నిర్వహిస్తున్నది, ఆ పని మీద యున్నది.[3]

ప్రణాళిక[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమునకు ఒక కొత్త రాజధాని కొరకు ప్రణాళికలో భాగంగా, ఆయన విజయవాడ స్మార్ట్ నగరంగా అభివృద్ధి ప్రణాళిక, విజయవాడలో మెట్రో కొరకు ప్రణాళికలు రూపొందించారు.[4]

నెట్వర్క్, మార్గం[మార్చు]

ప్రతిపాదించిన రెండు లైన్లు అంతరమార్పు విజయవాడ నగరం యొక్క దక్షిణ దిక్కున ఉన్న ఒక బస్ స్టేషను, కృష్ణానది పక్కన అయిన పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (పిఎన్‌బిఎస్) వద్ద ఉంది.

ప్రతిపాదిత మొదటి లైన్ బందరు రోడ్డును అనుసరించే మహాత్మా గాంధీ రోడ్ ద్వారా పండిట్ నెహ్రూ బస్ స్టేషను నుండి పెనమలూరు వరకు, రెండో లైన్ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను ద్వారా ఏలూరు రోడ్ వెంట పిఎన్‌బిఎస్ నుండి నిడమానూరు వరకు సాగుతుంది.[5] అమరావతి (రాష్ట్ర రాజధాని) వరకు పొడిగింపు తరువాత దశలో ప్రతిపాదించబడింది.[6] ప్రాజెక్ట్ వన్ టౌన్ ప్రాంతంలోని ప్రజల అవసరాలను తీర్చదు. ఇక్కడ కాళేశ్వర రావు మార్కెట్, వస్త్రలత, కనక దుర్గ ఆలయం వంటివి వాణిజ్య ప్రదేశాలలో నెలకొని ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. http://timesofindia.indiatimes.com/city/hyderabad/Metro-rail-will-be-confined-to-Vijayawada-Sreedharan/articleshow/43027451.cms
  2. "Sreedharan told to finish phase-I of Vijayawada Metro by 2018". Business Standard. 4 September 2015. Retrieved 26 September 2015.
  3. http://www.deccanchronicle.com/141107/nation-current-affairs/article/vijayawada-metro-rail-project-work-2017-track
  4. http://www.thehindu.com/news/national/andhra-pradesh/metro-rail-projects-for-vizag-vijayawada-approved/article6272969.ece
  5. "Vijayawada Metro Rail to cost Rs. 288 crore per km". Vijayawada. 17 March 2015. Retrieved 28 July 2015.
  6. New Indian Express 30 May 2015 Doubts Raised over Usefulness of Metro Rail Project in V'wada Archived 2015-10-31 at the Wayback Machine