విప్ర వినోదులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

;మాణిక్యాల పురం విప్ర వినోదుల[మార్చు]

తెలంగాణాలో ఈ విప్ర వినోదులు కరీంనగర్ జిల్లా మాణిక్యాల పురంలో వున్నట్లు తెలుస్తూంది. వీరి వృత్తి విప్రులను యాచించడమె. వీరి ప్రదర్శనం కూడా ఇంద్రజాలమే. వీరి దళ సభ్యులు నలుగురుంటారు. వీరి ప్రదర్శనం విప్రుల ఇండ్లలోనూ, విశాల బహిరంగ స్థలాల్లోనూ కూడా ప్రదర్సిస్తారు. వీరి ప్రదర్శనా సామాగ్రి...... అయిదు శాలువలు, ఒక కొయ్య అలమారా, ఒక తాళపత్ర గ్రంథం, రెండు జతల తాళాలు. ప్రదర్శంనం విశాల ప్రదేశంలో ఒక చిన్న పందిరిలో జరుగు తుంది. పందిరి చుట్టూ శాలువలు కడాతారు. ఆ తెరల మధ్య ఖాళీ అలమారా వుంచుతారు. ఇరువురు వ్వక్తులు చెరో ప్రక్క చేరి తాళాలతో భజన చేస్తారు. ఇంతలో ప్రెక్షకులు గుమి కూడతారు. తెరలన్నీ ఎత్తి ఖాళీ అలమారా చూపిస్తారు. తరువాత దళ సభ్యుడు ప్రాచీన తాటాకుల గ్రంధంతో తెరల మద్యకు వెళతాడు. ఒక పావు గంట వరకూ ఆయన బయటకు రాడు. ఈ లోగా భజన జరుగుతూనే వుంటుంది. లోపల ఏం జరుగుతూందో అనే ఆసక్తి ప్రేక్షకులలో రేకెత్తిస్తుంది. ఇంతలో తెరను తొలగిస్తారు. అదివరకు ఖాళీగా వున్న అలమారాలో దేవతా విగ్రహాలు, దీపారధన కుందులూ, పుష్పాలూ, ఫలాలూ, పిండివంటలూ, గంట, శంఖం వివిధ పూజా పాత్రలు అనేక రకాల పిండి వంటలు ప్రత్యక్షమౌతాయి. అలాగే ఒక మామిడి టెంకను పాతి పెట్టి పది నిమిషాల్లో అడుగు ఎత్తున పెరిగిన మామిడి మొక్కను చూపిస్తారు. ఈ ప్రదర్శనం ప్రేక్షకులను ఆశ్చర్య చికితుల్ని చేస్తుంది. ప్రదర్శనానికి ముందే అలమారాలను పరీక్షించ వచ్చు. అంతే కాక వీరు ఇంటింటికి తిరుగు నప్పుడు విగ్రహాలను, కప్పలను చిలకలను, విభూతిని అరచేతిలో సృష్టించి ఇంద్ర జాల మహేంద్ర జాల విద్యను ప్రదర్శిస్తారు.

;రాయలసీమ విప్రవినోదులు[మార్చు]

విప్రవినోదులు జాతర్ల లోనూ, తిరునాళ్ళలోనూ, గుడారాలను నిర్మిస్తారు. ఈ గుడారాల్లో రామాయణం మొదలైన కథలను అత్యద్భుతంగా చిత్రిస్తారు. వీరు గొప్ప మాటకారులు, హాస్య ప్రియులు. చెప్పింది చెప్పకుండా చెపుతారు. ప్రేక్షకులను తమ హాస్య ప్రసంగాలతో ఆనందంలో ముంచెత్తుతారు.{{Center|

వినోదాల విప్ర వినోదులు[మార్చు]

ఈనాటి ఆంధ్రదేశంలో ఎక్కడో చెదురు మదురుగా విప్రపినోదం ప్రచారంలో వుందని చెప్పలేం. కానీ 1600–1700 సంవత్సరాలలో ఈ వినోదాలు వ్వాప్తిలో వున్నాయి అంటే అది విజయనగర సాంమ్రాజ్య కాలం. విప్రులనగా బ్రాహ్మణులు. వారు వినోదం చేయడం వలన విప్రవి నోదమని పేరు వచ్చింది. బ్రాహ్మణులలో ఒక తెగ బ్రాహ్మణులు దేవతో పాసన వలననో, మంత్ర తంత్రాల వలనో, ఒక విచిత్రమైన గారడీలు చేస్తూ వుంటారు. అష్టావదానాన్ని కూడా చేస్తూ వుంట్ఘారు. ఆంధ్ర దేశంలో ఈ వినోదం చేసేవారు అక్కడక్కడా ఉన్నారు. గుంటుపల్లి ముత్తరాజనే విప్రవినోది గోలకొండ సుల్తానుల తుది కాలంలో వున్నట్ఘ్లు సురవరం ప్రతాప రెడ్డిగారు తెలియజేస్తున్నారు.

చాటువు

సంతత మారగించు నెడ సజ్జన కోటుల
పూజసేయు శ్రీ మంజంతుడు గుంటుపల్లి
కుల మంత్రి శిఖామణి ముత్త మంత్రి దౌ
బంతియె బంతి గాక కడుపంద గులా
ముల బంతులెల్ల దూల్ బంతులు దుక్కి
టెల్ల యెడ బంతులు విప్రవినోది
గారడీ బంతులు సుమ్ము ధరాతలంబునన్.

అని వర్ణించాడు. ఈ విధంగా ఆ కాలంలో విప్ర వినోదాలు జరుగుతూ వుండేవి. విప్రవినోదం చేసేవారు ఆంధ్ర దేశమంతటా వున్నట్లు మనకు ఆధారాలున్నాయి.

మూలాలు[మార్చు]