Coordinates: 17°07′00″N 82°16′00″E / 17.1167°N 82.2667°E / 17.1167; 82.2667

విరవ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విరవ
—  రెవెన్యూ గ్రామం  —
విరవ is located in Andhra Pradesh
విరవ
విరవ
అక్షాంశరేఖాంశాలు: 17°07′00″N 82°16′00″E / 17.1167°N 82.2667°E / 17.1167; 82.2667
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కాకినాడ
మండలం పిఠాపురం
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,192
 - పురుషులు 2,143
 - స్త్రీలు 2,049
 - గృహాల సంఖ్య 1,220
పిన్ కోడ్ 533 450
ఎస్.టి.డి కోడ్

విరవ, , కాకినాడ జిల్లా, పిఠాపురం మండలానికి చెందిన గ్రామం.[1] ఇది పిఠాపురం ఊరికి సుమారుగా 9 కిలోమీటర్ల దూరములో ఉంటుంది. పంచాయితి హోదా ఉంది.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1220 ఇళ్లతో, 4192 జనాభాతో 378 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2143, ఆడవారి సంఖ్య 2049. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 348 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 11. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 587462.[2] పిన్ కోడ్: 533450.

విద్యా సౌకర్యాలు[మార్చు]

ఎలిమంటరీ పాఠశాల

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల పిఠాపురంలోను, ఇంజనీరింగ్ కళాశాల కాకినాడలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ కాకినాడలో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కాకినాడలో ఉన్నాయి.గ్రామంలో మొత్తం రెండు ఎలిమేంటరి పాఠశాలలు ఉన్నాయి. ఒకటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (6వ-10వ తరగతి) కలదు . శారద విద్యాలయం (యల్.కె.జి- 7వ తరగతి) కాన్వేంట్ ఉంది.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల[మార్చు]

పని చేసిన ప్రధాన ఉపాధ్యాయుల వివరాలు

2012-2013 విద్యాసంవత్సరంలో విద్యార్థులు 538 కలరు. ఉపాధ్యాయ సిబ్బంది 14 ఉన్నారు. కంప్యూటర్ సిబ్బంది 2 కలరు. విద్యా వాలంటీర్ ఒకరు. చుట్టూ ప్రక్కల గ్రామాలైన మంగితుర్తి, కోలంక, లక్ష్మి నరసాపురం, విరవాడ నుంచి ఇక్కడకు వస్తారు . విరవాడలో 10 వ తరగతి వరకు స్కూల్ పెట్టిన తరువాత ఆ గ్రామం వారు అక్కడే చదువుకుంటున్నారు .

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

విరవలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో 3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

విరవలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ఆసుపత్రి[మార్చు]

చుట్టూప్రక్కల గ్రామాలకు విరవలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రే ఆధారం . చాల పేద్ద ఆసుపత్రి ఉంది. ఇప్పడికి మనం చూడవచ్చు . కాని చాలవరకు ఉపయొగించడం లేదు.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

విరవలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 47 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 330 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 330 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

విరవలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 292 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 38 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

విరవలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, చెరకు, కూరగాయలు

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

బియ్యం

శివాలయం

జీవన విధానం[మార్చు]

ఎక్కువశాతం ప్రజలు వ్యవసాయం, చిన్న చిన్న వ్యాపారాల పైన ఆధారపడి జీవిస్తారు. ఇటుక బట్టిలు ఎక్కువ అవడం చేత చాలమంది ఇటుక బట్టి పనులకు వెళ్తున్నారు. ఎండా కాలంలో అన్నిరకాల పచ్చళ్ళు (మామిడికాయ, అల్లం, ) తయారు చేసి పక్క రాష్ట్రాలకు తీస్కొనివెళ్ళి ఇక్కడ వారు అమ్ముతారు. గ్రామ ప్రజలు గొడవల జోలికి పెద్దగ వేళ్ళరు. ఊరు ప్రశాంతంగా ఉంటుంది. పండుగ రోజుల్లో ఊరంత సందడి వాతావరణం నెల్కొంటుంది. ముఖ్యంగా వినాయక చవితి, శ్రీరామ నవమి, సుబ్రహ్మణ్య షష్టి బాగా జరుపుకుందురు. దీపావళి నాడు రోడ్లపై బాణసంచ కాల్చడం, ఒక వీధివారు మరొక వీధిలో బాణసంచ కాల్చడంలో పందాలకు దిగి ఒకరిపై ఒకరు తారజువ్వలు వేస్కుంటుంటే అక్కడున్న పెద్దవారు కలుగచేస్కుని వారిని మన్పించడం ప్రతి యేట మామూలే. కార్తీక మాసంలో వనభోజనాలు సందడి కార్తీక మాసం అంత కనబడును. రాజకీయాలు ఏన్నికల సమయంలో తప్ప మిగిలిన సమయంలో రాజకీయ వేడి పెద్దగా కనిపించదు. భోగి రోజు ప్రతి వీధిలోను చిన్నదో పెద్దదో భోగి మంట కనిపిస్తుంది. విరవలో చాలా వరకు సిమెంట్ రోడ్లు ఉన్నాయి. శివాలయం వద్దగల కోనేటి దగ్గర వాటర్ ట్యాంక్ ఉంది. దాని ద్వారా గ్రామానికి వాటర్ సప్లయి జరుగుతుంది. మంచినీటికి కొదవలేదు. ఎక్కువ మంది త్రాగునీరు మంచినీటి నూతులు (బావులు) దగ్గరనుంచే తీస్కొనివేళ్ళి వాడుకుందురు. ఈ మధ్యకాలంలో బేల్ట్ షాపులు కూడా అధికమైయాయి.

పనిచేసిన సర్పంచులు[మార్చు]

2012 సం. నాటికి ఐదుగురు సర్పంచులుగా చేసారు. వీరిలో తమ్మనబోయిన బాపన్నదొర ఒక్కరే ఎక్కువ కాలం సర్పంచ్ గా పనిచేసారు.

సంఖ్య పేరు ఆరంభము అంతము
1 తమ్మనబోయిన బాపన్నదొర -- 1992
2 నడిగట్ల ఏగేశ్వర రావు 1992 1997
3 వీరవరపు సత్యవతి 1997 2002
4 నడిగట్ల చింతలరావు 2002 2007
5 గేదల కృష్ణ 2007 2012
6 నడిగట్ల వరలక్ష్మిసత్యన్నారాయణ 2014 -

పనిచేసిన యం.పి.టి.సి లు[మార్చు]

1997సం.లో తోలిసారిగ మొల్లేటి లక్ష్మి యం.పి.టి.సి.గా ఏన్నికైది. 2002, 2012 లోను విరవ గ్రామం నుంచి యం.పి.టి.సిగా ఎన్నికైన వారు యం.పి.పి అయ్యారు.

సంఖ్య పేరు పార్టీ ఆరంభము అంతము
1 మొల్లేటి లక్ష్మి తెలుగుదేశం 1997 2002
2 సఖుమళ్ళ నాగబాబు తెలుగుదేశం 2002 2007
3 కురుమళ్ళ రాంబాబు కాంగ్రెసు 2007 2012

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

విరవ గ్రామ ప్రజలకు దైవ భక్తి ఎక్కువ. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ప్రసిద్ధి.

  • శివాలయంలో శివుడుతో పాటు సుబ్రహ్మణ్యేశ్వరునకు ప్రత్యేక ఆలయం ఉంది. సాయిబాబా ఆలయం కూడా కొత్తగ నిర్మించారు. సాయిబాబా పుట్టిన రోజున ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తారు.
  • దుర్గమ్మ భక్తులు ఎక్కువనే చేప్పాలి. ప్రతి సంవత్సరం దుర్గ మాల వేసుకుని విజయవాడ దుర్గమ్మను దర్శించుకుని వస్తారు. విరవ గ్రామంలో గల కోనేటి వద్ద కోత్తగ దుర్గాలయం నిర్మించారు. విరవ గ్రామంలో మొత్తం రెండు దుర్గాలయలు ఉన్నాయి.
  • వినాయక గుడి.
  • షిర్డీ సాయిబాబా గుడి, విరవ నుంచి దివిలి వేళ్ళేదారిలో ఉంది.
  • శివాలయము ప్రసిద్ధి. ఆలయం బయట సువిశాలమైన కోనేరు ఉంది.
  • ఆంజనేయ స్వామి గుడి.
  • లక్ష్మిదేవి గుడి
  • చింతాలమ్మ గ్రామ దేవత, ప్రతి సంవత్సరం చింతాలమ్మ జాతర జరుగుతుంది.
  • అన్ని వీధులలో రామాలయాలు ఉన్నాయి.

యువభారత యువజన సంక్షేమ సంఘం[మార్చు]

యువభారత్ యువజన సంక్షేమ సంఘం
యువభారత్ యూత్ ద్వారా ఆర్థిక సహాయం
యువభారత్ యూత్ ద్వారా ఆర్థిక సహాయం

గ్రామంలో ఉన్న కొద్దిమంది యువకులు కలిసి యువభారత్ యువజన సంక్షేమ సంఘాన్ని స్ధాపించారు. వీరిలో చాలమంది విద్యార్థులే ఉన్నారు. వీరు గ్రామంలో యువభారత్ యూత్ ద్వారా ఇప్పడివరకూ చేసిన కార్యకమాలు వరుసగా ఉచిత హోమియో శిబిరము ఏర్పాటు చేసి స్వైన్ ప్లూవ్ మందులను పంపిణి చేసారు. గ్రామంలో వర్షకాల సమయంలో మంచినీటి బావుల దగ్గర శుభ్రం చేసి బావిలో బ్లిసింగ్ కలపడమే కాకుండా ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ బావిలో కూడా బ్లిసింగ్ ను కలపడం కొరకు వర్షంలో తడిచి మరీ యూత్ సభ్యులు ఆ కార్యక్రం చేసారు. గత సంవత్సరం యువభారత్ యూత్ ద్వారా ఓల్డ్ బుక్స్ సేకరించి సుమారుగా 21 మందికి ఇవ్వడం జరిగింది. ఆగస్టు 15వ (15-8-2011) కి 10వ క్లాసులో ప్రథమ, ద్వితీయ శ్రేణిలో వచ్చిన వాళ్ళకి గ్రామా సర్పంచ్, స్కూల్ ప్రధానోపాద్యాయుడు (హె.ఎమ్) గారి చేతులమీదుగా బహుమతిప్రధానం చేయబడింది.

వేంకటేశ్ యువభారత్ యూత్ కి ఇచ్చిన విరాళంలో 5000 రూ|| యేసు నాగేశ్వరావు, 5000 కోరుకొండ బాబికి ఇవ్వడం జరిగింది (ఆగస్టు 15-2012) విరవలో లోకల్ లో పనిచేసే ఎలెక్ట్రిషియన్ నాగేశ్వరావు కరెంటు స్తంభం పై పనిచేస్తూ ఉండగా .. ఎవరో మెయిన్ ఆన్చేయడం వాళ్ళ పైనుంచి క్రిందపడిపోయాడు. ఒక చెయ్యి తొలగించారు : ( . రెండో చెయ్యి పనిచేయదు . ఉన్నట్టు ఉండి ఆ కుటుంబం రోడ్ పై పడిపోయింది . అతనికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి .. ఇప్పుడు పాలిటెక్నిక్ చదువుతున్నాడు వాళ్ళ అబ్బాయి . నాగేశ్వరావు 5000 /- యూత్ ద్వారా ఇవ్వడం జరిగింది.

కోరుకొండ బాబి 10వ తరగతి చదివాకా ఇంటిదగ్గర పరిస్థితి బాలేదు అని కూరగాయల షాప్ లో జాయిన్ అయ్యాడు . ఒక సంవత్సరం తరువాత పిఠాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలల జాయిన్ అయ్యాడు M.P.C ఆ సంవత్సరం ఆ కాలేజీ ఫస్ట్ సాధించాడు . ఇంటర్ రెండవ సంవత్సరంలో ఉండగా వాళ్ళ నాన్నగారు మరణించారు . ఆ అబ్బాయికి 5000 /-ఇవ్వడం జరిగింది. 2011 - 2012 విద్య సంవత్సరంలో పదవ తరగతిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో ఉత్తిర్ణులైన వార్కి బహుమతుల ప్రధానం జరిగింది.

వ్యవసాయం[మార్చు]

ఏలేరు కాలువ వల్ల సంవత్సరం మొత్తం పంటలు పండుతున్నాయి. వరి ప్రధానపంట. ఊరిలోఅన్ని రకాల కూరగాయలు, చెరుకు, మొక్కజొన్న, కంద పంటలు పండుతాయి. మల్లిపూలు, కనకంబరాలు ఏక్కువగ లభిస్తాయి.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన మణివెంకటకృష్ణ అను విద్యార్థి, 5-10-2020 న ప్రకటించిన తెలంగాణా ఎం.సెట్. పరీక్షా ఫలితాలలో మూడవ ర్యాంక్ సాధించాడు. ఈ విద్యార్థి తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయదారులు.[1]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-07.
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రధాన సంచిక;2020, అక్టోబరు-7,8వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=విరవ&oldid=4128052" నుండి వెలికితీశారు