వెనిగళ్ళ సుబ్బారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వెనిగళ్ళ సుబ్బారావు ప్రకృతి వైద్యుడు, చిత్రకారుడు, హేతువాద ఉద్యమ నాయకుడు, సంస్కృతాంధ్ర పండితుడు.

జీవిత విశేషాలు[మార్చు]

సుబ్బారావు రేపల్లె నివాసి. అతను 1939 అక్టోబరు 2న జన్మించాడు. అతను చిత్రించిన అనేక చిత్రాలు నేటికీ రేపల్లె మునిసిపల్ హైస్కూలులో లభిస్తాయి. రేపల్లె సమీపంలోని పెనుమూడి గ్రామంలో ప్రకృతి ఆశ్రమం నెలకొల్పి అనేకమందికి ఆరోగ్యం ప్రసాదించాడు. హేతువాద ఉద్యమ నాయకులుగా కొన్ని వేల ఆదర్శ వివాహాలు చేయించాడు. చిత్రకారులుగా వెల్లటూరులోని నవరంగ్ చిత్రకళా నికేతన్‌లో అనేక మంది చిత్రకారులను తయారు చేశాడు. వెంకటేశ్వర సుప్రభాతంలో తెలుగు ఎందుకు ఉండదు? సంస్కృతంలోనే ఎందుకు అనే విషయాన్ని అతను తన రచనల ద్వారా వెలుగులోకి తెచ్చాడు. [1]


అతను 1996 మే 17న మరణించాడు.

రచనలు[మార్చు]

  1. రామాయణం రంకు 1978
  2. పెళ్ళిమంత్రాల బండారం 1979[2]
  3. శ్రీ వెంకటేశ సుప్రభాత శృంగారం 1979 [3]

మూలాలు[మార్చు]

  1. "హేతువాదం లోతుల్లోకి ... "ఏది నీతి, ఏది రీతి"?". సారంగ (in అమెరికన్ ఇంగ్లీష్). 2013-04-17. Archived from the original on 2020-07-16. Retrieved 2020-07-14.
  2. Surraravu, Venigalla (1979). Pelli mantrala bandaram. Repalle: Venigalla Hetuvada Sahitya Niketan.
  3. "వెంకటేశ్వర సుప్రభాతం తెలుగులో పాడరెందుకు?".{{cite web}}: CS1 maint: url-status (link)

బాహ్య లంకెలు[మార్చు]