Jump to content

వేంకటరాయ కవి

వికీపీడియా నుండి
వేంకటరాయ కవి
జననం1830
లేపాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా
ప్రసిద్ధికవి, నాటక కర్త
మతంహిందూ
భార్య / భర్తపుట్టమ్మ
పిల్లలునంజుండ రాయడు
తండ్రివేంకట రమణయ్య

వేంకటరాయ కవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కవి, నాటక కర్త.[1]

జననం, కుటుంబ నేపథ్యం

[మార్చు]

వేంకటరాయ కవి 1830లో శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షిలో జన్మించాడు. తండ్రి వేంకట రమణయ్య. వీరిది శీర్నాడు కులం, విశ్వామిత్ర గోత్రం. భార్య పుట్టమ్మ, కుమారుడు నంజుండ రాయడు.[2] వేంకట నారాయణ కవి ఇతనికి బావమరిది.

సాహిత్య ప్రస్థానం

[మార్చు]

వేంకటరాయ కవి రామాయణంతోపాటు లేపాక్షి కృష్ణ నాటకం, జలక్రీడలు, శివనాటకం, నాట్య ప్రదీపనం వంటి రచనలు చేశాడు.[3]

ఆతను రాసిన లేపాక్షి రామాయణ యక్షగానం 1991లో సి.వి. కృష్ణ బుక్ డిపో 1991 అమ్మర్ కోవిల్ వీడి వాల్ టాక్సు  రోడ్డు, మద్రాసు ద్వారా ప్రచురించబడింది. లేపాక్షి చుట్టుపక్కల గ్రామాలలో యువకులు ఈ యక్షగానాలను ప్రదర్శించారు.[2]

లేపాక్షి కృష్ణ నాటకం 1910 జూన్ లో చెన్నపట్టణానికి చెందిన శ్రీ వంకాయల కృష్ణస్వామి శెట్టి అండ్ సన్స్ వారి శ్రీరంగ విలాస ముద్రాక్షర శాలలో ముద్రించబడింది. ఈ ప్రతి ప్రస్తుతం శ్రీ కృష్ణదేవరాయ గ్రంథమాల పుస్తక భాండాగారంలో ఉంది.[4]

మూలాలు

[మార్చు]
  1. రాయలసీమ రచయితల చరిత్ర మూడవసంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
  2. 2.0 2.1 కల్లూరు అహోబలరావు (1981-08-01). రాయలసీమ రచయితల చరిత్ర-మూడవ సంపుటి.
  3. కల్లూరు అహోబలరావు (1981-08-01). రాయలసీమ రచయితల చరిత్ర-మూడవ సంపుటి.
  4. కల్లూరు అహోబలరావు (1981-08-01). రాయలసీమ రచయితల చరిత్ర-మూడవ సంపుటి.

ఇతర లింకులు

[మార్చు]