వేదిక:భారతదేశం/వార్తలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వార్తలు
మార్చు
  • అక్టోబర్ 3: ప్రముఖ చార్టర్డ్ అక్కౌంటెట్, బిర్లా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడైన ఆర్.ఎస్.లోధా లండన్ లో మరణించాడు.
  • అక్టోబర్ 2: భారత్-అమెరికా అణుఒప్పందానికి అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది.
  • అక్టోబర్ 1: భారత్‌కు చెందిన కృష్ణమ్మాళ్, శంకరలింగంజగన్నాథన్ దంపతులకు ప్రత్యమ్నాయ నోబెల్ బహుమతిగా పేరుపొందిన రైట్ లివ్లీహుడ్ అవార్డు లభించింది.
  • అక్టోబర్ 1: ఢిల్లీ మెట్రో రైల్వే కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధరన్‌కు లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పురస్కారం లభించింది.
  • సెప్టెంబర్ 30: రాజస్థాన్ లోని జోధ్‌పూర్ లో చాముండా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 150 పైగా భక్తులు మరణించారు. 60కి పైగా గాయపడ్డారు
  • సెప్టెంబర్ 27; భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అద్యక్షుడిగా శశాంక్ మనోహర్ నియమితులైనాడు. కార్యదర్శి పదవి ఎన్.శ్రీనివాసన్‌కు దక్కింది.
  • సెప్టెంబర్ 27: ప్రముఖ సినీగాయకుడు మహేంద్ర కపూర్ ముంబాయిలో మరణించాడు.
  • సెప్టెంబర్ 27: వదోదరలో జరిగిన ఇరానీ ట్రోఫి క్రికెట్‌ను రెస్టాఫ్ ఇండియా విజయం సాధించింది. ఈ ట్రోఫీ రెస్టాఫ్ ఇండియా చేజిక్కించుకోవడం ఇది 21వ సారి.

పాత వార్తలు