వేనాడు దర్గా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తడ మండలం వేనాడు షేక్‌ దావూద్‌వలీ అల్లా దర్గా ప్రాముఖ్యం పొందిన దర్గా.[1] ఆసియాలోనే అతిపెద్ద సమాధిగా గుర్తింపు పొందింది. ఇక్కడ 144 అడుగుల పొడవున్న అల్లా తాత సమాధి వద్ద ఏటా గంథోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ దర్గాను హిందూ, ముస్లింలు దర్శించి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి నెలా అమావాస్య రోజున ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నిద్రిస్తే దుష్టశక్తులు తొలగి, కోరుకున్నది నెరవేరుతుందని భక్తుల నమ్మకం.

రవాణా సౌకర్యం[మార్చు]

సూళ్లూరుపేట నుంచి వేనాడు 25 కి.మీ దూరంలో ఉంది. శ్రీహరికోటకు వెళ్లే మార్గంలో అటకానితిప్ప నుంచి పులికాట్‌ సరస్సు మధ్యలో వేనాడుకు గ్రావెల్‌ రోడ్డు ఉంది. సూళ్లూరుపేట నుంచి ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఆటోలు, జీపుల్లో ఇక్కడికి చేరుకోవచ్చు.

మూలాలు[మార్చు]

  1. జి., రవికిరణ్. "Nellore beaches a hub for coastal tourism". thehindu.com. ది హిందు. Retrieved 6 October 2017.