శ్రీ కుమార శతకము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుమార శతకము
కవి పేరురావు భాస్కర రావు
అనువాదకుడుదేవులపల్లి సుబ్బరాయశాస్త్రి
వ్రాయబడిన సంవత్సరం1897
మొదటి ప్రచురణ తేదీ1900
దేశంభారతదేశం
భాషతెలుగు
మకుటంకుమార!
విషయము(లు)రాజనీతి
పద్యం/గద్యంపద్యం
ఛందస్సుతేటగీతి
ప్రచురణ కర్తక్రొత్తపల్లి పద్మనాభశాస్త్రి
ప్రచురణ తేదీ1900
మొత్తం పద్యముల సంఖ్య101
అంకితంరావు వేంకటకుమార మహీపతి సూర్యారావు
ముద్రాపకుని పేరుక్రొత్తపల్లి పద్మనాభశాస్త్రి
ముద్రణా శాలలారెన్స్ అసైలం ప్రెస్, మద్రాసు

శ్రీ కుమారశతకము[1] సంస్కృతములో రావు భాస్కరరావు చేత రచింపబడి దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి చేత ఆంధ్రీకరించబడింది. ఇది 1900 ఆగస్టు 1వ తేదీన కోలంక వీరవరం జమీందారిణి రాజా చెల్లయ్యమ్మ రావుబహద్దూరు ఆజ్ఞానుసారం మద్రాసు లారెన్స్ అసైలమ్ ప్రెస్సులో క్రొత్తపల్లి పద్మనాభశాస్త్రిగారిచే ముద్రించబడింది. ఈ శతకంలో 101 శ్లోకాలు, ప్రతి శ్లోకానికి వెనువెంటనే ఆంధ్రీకృతపద్యము ఉన్నాయి. రావు వంశపు కులవృద్ధుడైన రావు భాస్కరరావు పిఠాపురం మహారాజా రావువేంకటకుమార మహీపతి సూర్యారావును ఉద్దేశించి రాజనీతిని బోధించిన శతకము ఇది. రావు వంశపుటౌన్నత్యము, మహారాజా వారి మాతృపితృ నగర మహిమ, మహారాజా వారి విద్వత్తు మొదలైన విషయాలు ఈ శతకంలో పొందుపరచబడి ఉంది. "కుమార!" అనేది ఈ శతకానికి మకుటంగా ఉంది.

మచ్చుతునకలు[మార్చు]

తే|| తత్తనూజులు సర్వజ్ఞ మాధవులనంగ
శైవవైష్ణవ ధర్ములై ఠీవి గనిరో
మీదయిన యన్వయంబున కాదిపురుషు
లట్టి వంశోచ్ఛ్రయముఁ బొందుమా కుమారా!
తే||చేయఁదగినట్టి పనియును జేయరాని
పనియుఁదెలియ నశక్యమైపరఁగుఁగాన
మహిని బండి తులైన బ్రహ్మణుల నీదు
సభల నిలుపబంగఁ దగును నిచ్చలుఁ గుమార!

మూలాలు[మార్చు]

  1. పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973