శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కళాశాల (ప్రొద్దుటూరు)
స్వరూపం
| రకం | వెటర్నరీ |
|---|---|
| స్థాపితం | 2008 |
| అండర్ గ్రాడ్యుయేట్లు | 60 |
| స్థానం | ప్రొద్దుటూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం 14°47′50.86576″N 78°33′42.87197″E / 14.7974627111°N 78.5619088806°E |
| జాలగూడు | http://svvu.edu.in/CvscProddatur.html |
శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కళాశాల (కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్) అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రొద్దుటూరులో ఉన్న వెటర్నరీ కళాశాల. 2008లో వై.ఎస్. రాజ శేఖరరెడ్డి ఈ కళాశాలను స్థాపించాడు.
అవలోకనం
[మార్చు]ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడప జిల్లా, ప్రొద్దుటూరులో కొత్త వెటర్నరీ కళాశాలను స్థాపించింది.[1] ఈ కళాశాల 2008-09 విద్యా సంవత్సరం నుండి ప్రొద్దుటూరులోని ప్రొద్దుటూరు కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ ప్రాంగణంలో పనిచేయడం ప్రారంభించింది, మొదటి సంవత్సరం బివిఎస్సీ & ఎహెచ్ కోర్సులో 31 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. న్యూఢిల్లీలోని వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ కళాశాలకు గుర్తింపు ఇచ్చింది. 2014–15 విద్యా సంవత్సరం నుండి బివిఎస్సీ & ఎహెచ్ లో సీట్ల సంఖ్యను 30 నుండి 60కి పెంచారు.
మూలాలు
[మార్చు]- ↑ "Proddatur veterinary college to be named after YSR". 24 September 2009 – via www.thehindu.com.