సమతుల్య పౌష్టికాహారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అందానికి సమతుల్య, పౌష్టికాహారం పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసు. అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు, శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

మగవారు కాస్త మోటుగా వున్నా పర్వాలేదు. ఆడవారు అందంగా నాజూగ్గా వుండాలి. ఆడవాళ్లు అందంగా కనిపించాలంటే బాహ్యాలంకరణ మాత్రమే వుంటే చాలదు. స్వతస్సిద్ధంగా కూడా అందంగా వుండాలి. వయసుకు తగ్గ అందం వుండాలి. అందంగా వుండాలనుకుంటే శరీరం తప్పకుండా ఆరోగ్యవంతంగా వుండాలి. ఆరోగ్యానికి ఆయువుపట్టు మీరు తీసుకునే ఆహారం నియమబద్దంగా వుండాలి. పౌష్టికాహారాన్ని నియమబద్ధంగా తీసుకుంటూ తగు మోతాదులో శరీర వ్యాయామం చేసుకుంటూ అందంగా, ఆరోగ్యంగా వుండాలి. ఇది ఆడవారికి అత్యంత ముఖ్యం. చేయగలిగినంత ఇంటిపని చేయాలి. మన శరీరంలోని కణాలు నిర్వీర్యం కాకుండా పొషించేవి విటమిన్లు, న్యూట్రిషియన్‌ ఫుడ్‌ను తీసుకోవాలి. అంటే పరిపూర్ణ ఆహారం తీసుకోవాలి. పాలు, పండ్లు వంటివి బ్యాలెన్స్‌డు డైటు తీసుకోవాలి.

మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు విటమిన్లు మినరల్స్‌ కొవ్వు పదార్థాలు వుండాలి.మనం తీసుకునే ఆహారంలో హెచ్చుభాగం పండ్లు, కూర గాయలు వుండాలి. రిఫైండ్‌ షుగర్స్‌ వాడ రాదు. పంచదారకన్నా తేనెను వాడవచ్చు. అలాగే తాజా ఆకుకూరలు, టమాటోలు, దోసకాయ మొదలైనవాటిలో కాల్షియం ఎక్కువగా వుంటుంది. కెరోటిన్‌, రిబోప్లోవిన్‌, విటమిన్‌ సి, పోలిక్‌ ఏసిడ్‌ వుంటాయి. కాబట్టి ఇవే తీసుకో వాలి.ఆరంజ్‌, యాపిల్‌, బొప్పాయి తింటే ఆరోగ్య మైన చర్మం ఏర్పడుతుంది. లెమన్‌ జ్యూస్‌ మంచిది. ఇందులో సి విటమిన్ వుండి చర్మాన్ని ఇన్‌ఫెక్షన్‌ నుంచి కాపాడుతుంది. ఎక్కువగా టీ, కాఫీ త్రాగ కూడదు. అతి చల్లని పానీ యాలు ఆరోగ్యానికి హాని కరం. నీరు పుష్కలంగా తాగాలి. శరీరంలోని మలినాలని ప్రక్షాళన చేస్తుంది. ఇంకా మజ్జిగ, వెన్నతీసిన పాలు ఒంటికి మంచిది. టిన్‌లలో పాక్‌ చేసిన పండ్లు, కూరలు వాడ కూడదు. జీర్ణకోశం శుభ్రంగా వుండాలంటే పీచు ఎక్కువగా వున్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. గ్యాస్‌ ప్రాబ్లమ్‌వుంటే నూనె వస్తువులు, శనగపిండితో చేసే వాటిని తగ్గించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, వాకింగ్‌ శరీరాన్ని అనవసరంగా పెరగనివ్వకుండా చేస్తుంది. తిండి తినకుండా మాడితే మనుషులు బరువు తగ్గుతారనేది సరైనది కాదు. బ్యాలెన్స్‌డ్‌ ఫుడ్‌ తీసుకోవాలి. స్వీట్లు మితంగా తినాలి. ఇక తిండి తినేటప్పుడు పుస్త కాలు చదవడం, టీవి చూడటం చేయకూడదు. ఫైబర్‌ ఫుడ్స్‌ వల్ల పైల్స్‌, కిడ్నీలో రాళ్లు, అల్సర్‌ లాంటివి రావు. ఆహారం అసలు తినకుండాను(ఉపవాసము ), ఆహారం అమితంగా(exess)ను తీసుకోకూడదు. మీ కోపతాపాలు, మీ శరీరం సౌందర్యం ... మీరు తినే ఆహారం మీదే ఆధారపడివుంటాయి

మూలాలు[మార్చు]