Jump to content

సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం
ఇతర పేర్లు
SSCTU (ఎస్ఎస్సీటీయూ)
స్థాపితం2023
వైస్ ఛాన్సలర్ఆచార్య వై ఎల్ శ్రీనివాస్
రెక్టర్జిష్ణుదేవ్ వర్మ గవర్నర్ తెలంగాణ
చిరునామగిరిజన యూనివర్సిటీ ములుగు జిల్లా తెలంగాణ, ములుగు, తెలంగాణ, 506343, భారతదేశం
కాంపస్సబ్ అర్బన్
భాషఆంగ్లం
అనుబంధాలుUGC యూజీసీ
జాలగూడుhttps://ssctu.ac.in/

సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (ఎస్ఎస్సీటీయూ) ఒక గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం దీనిని కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం ములుగులో భారత పార్లమెంటు చట్టం -2023 ప్రకారం చట్టం 36 ద్వారా సెంట్రల్ యూనివర్సిటీ చట్టం,2009 ప్రకారం సవరణ ద్వారా స్థాపించబడింది. దీనిని ప్రత్యేకంగా ఆదివాసీలు,గిరిజనులు కోసం ఏర్పాటు చేసినారు[1][2][3].

చరిత్ర

[మార్చు]

ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మ పేరుతో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అని నామకరణం చేశారు.ఇది తెలంగాణ రాష్ట్రం గిరిజన జిల్లా అయిన ములుగు జిల్లా కేంద్రంలో పార్లమెంటు చట్టం 2023 ప్రకారం 36 కేంద్రీయ విశ్వవిద్యాలయం చట్టం 2009 సవరణ ద్వారా స్థాపించారు. ఈ యూనివర్సిటీ కి సంబంధించిన బిల్లును పార్లమెంటులో తేది:07 డిసెంబర్ 2023 లో లోక్ సభ ఆమోదించింది[4]. ఈ యూనివర్సిటీ లో గ్రాడ్యుయేట్ & పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ప్రోగ్రాం కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 335.04 ఎకరాల విస్తీర్ణంలో భూమిని కేటాయించి 900 వందల కోట్ల నిధులు కేటాయించారు.ఈ విశ్వవిద్యాలయంకు సంబంధించి శాశ్వతంగా క్యాంపస్ నిర్మాణాలు పూర్తి అయ్యే వరకు ఇది ములుగు జిల్లా ప్రధాన కార్యాలయానికి సమీపంలో జకారాం గ్రామంలో ఉన్న యూత్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్ నుండి విశ్వవిద్యాలయం కార్యక్రమాలు నిర్వహిస్తారు[5].

విభాగాలు, కోర్సులు

[మార్చు]

2024-2025 విద్యా సంవత్సరానికి గాను సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో బి ఏ కోర్సులు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులు సీటు కేటాయిస్తారు.

తొలి ఉపకులపతి

[మార్చు]

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో ఏర్పాటు చేసిన సమ్మక్క-సారలమ్మ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం(ఎస్ఎస్సీటీయూ) తొలి వైస్‌ఛాన్సలర్‌గా ఆచార్య వై.ఎల్‌. శ్రీనివాస్‌ నియమితులయ్యాడు.[6][7] కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన ఐదేళ్లపాటు లేదా 70 ఏళ్ల వయసు వరకు ఉంటారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌ చెందిన శ్రీనివాస్ ఎంఏ ఆంగ్లం, ఎంఫిల్, పీహెచ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుండి పూర్తిచేశారు. అదే వర్సిటీ ఆంగ్ల విభాగంలో 1992లో సహాయ ఆచార్యుడిగా, బోర్డు ఆఫ్ స్టడీస్ ఛైర్మన్, ఆంగ్ల విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించాడు. పలు వర్సిటీల్లో బోర్డు ఆఫ్ చైర్మన్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని అరోరా డీమ్డ్ వర్సిటీలో వైస్‌ఛాన్సలర్‌గా ఉన్నాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Chary, Maheshwaram Mahendra. "Sammakka Sarakka Tribal University : సమ్మక్క - సారక్క ట్రైబల్ వర్శిటీలో అడ్మిషన్లు - కోర్సులు, ముఖ్య తేదీలివే". Hindustantimes Telugu. Retrieved 2025-03-12.
  2. Today, India. "Central Tribal University to be set up in Telangana". bestcolleges.indiatoday.in (in ఇంగ్లీష్). Retrieved 2025-03-12.
  3. Bharat, E. T. V. (2023-10-05). "Sammakka Sarakka Tribal University : HCU స్థాయిలో గిరిజన యూనివర్సిటీ.. వచ్చే ఏడాది నుంచి తరగతులు!". ETV Bharat News. Retrieved 2025-03-12.
  4. Bharat, E. T. V. (2023-12-08). "సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం". ETV Bharat News. Retrieved 2025-03-12.
  5. Telugu, ntv (2024-03-08). "Kishan Reddy: సమ్మక్క-సారక్క తాత్కాలిక ట్రైబల్ యూనివర్సిటీని ప్రారంభించిన కేంద్ర మంత్రి". NTV Telugu. Retrieved 2025-03-12.
  6. "గిరిజన విశ్వవిద్యాలయం తొలి వీసీగా ప్రొఫెసర్‌ వై.ఎల్‌. శ్రీనివాస్‌". Andhrajyothy. 12 March 2025. Archived from the original on 12 March 2025. Retrieved 12 March 2025.
  7. Kotas, Vamshi (2025-03-11). "ములుగు ట్రైబల్ యూనివర్సిటీ వీసీగా లక్ష్మీ శ్రీనివాస్‌ | Lakshmi Srinivas as VC of Mulugu Tribal University". www.teluguglobal.com. Retrieved 2025-03-12.[permanent dead link]