సుధాకరరావు నాయక్
సుధాకరరావు నాయక్ | |
|---|---|
![]() | |
| 11వ [[మహారాష్ట్ర ముఖ్యమంత్రి]] | |
| In office 25 జూన్ 1991 – 22 ఫిబ్రవరి 1993 | |
| అంతకు ముందు వారు | శరద్ పవార్ |
| తరువాత వారు | శరద్ పవార్ |
| 10వ [[హిమాచల్ ప్రదేశ్ గవర్నర్]] | |
| In office 30 జూలై 1994 – 17 సెప్టెంబర్ 1995 | |
| అంతకు ముందు వారు | విశ్వనాథన్ రత్నం |
| తరువాత వారు | మహాబీర్ ప్రసాద్ |
| Member of the భారత లోక్సభ Parliament for వాషిమ్ | |
| In office 1998–1999 | |
| అంతకు ముందు వారు | పుండ్లిక్రావ్ గవాలి |
| తరువాత వారు | భావనా పుండ్లిక్రావ్ గవాలి |
| Member of the [[మహారాష్ట్ర విధానసభ Assembly]] for పుసాద్ | |
| In office 1978–1995 | |
| అంతకు ముందు వారు | వసంతరావు నాయక్ |
| తరువాత వారు | మనోహర్ నాయక్ |
| In office 1999–2001 | |
| అంతకు ముందు వారు | మనోహర్ నాయక్ |
| తరువాత వారు | మనోహర్ నాయక్ |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1934 ఆగస్టు 21 గాహులి, యవత్మాల్ జిల్లా, సెంట్రల్ ప్రావిన్సెస్ అండ్ బెరార్, బ్రిటిష్ ఇండియా |
| మరణం | 2001 మే 10 (వయసు: 66) ముంబై, మహారాష్ట్ర, భారత్ |
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ |
సుధాకరరావు రాజుసింగ్ నాయక్ (21 ఆగస్టు 1934 – 10 మే 2001) భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. 25 జూన్ 1991 నుండి 22 ఫిబ్రవరి 1993 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పదవీకాలంలో ముంబై సామాజిక అల్లర్లు జరిగాయి .
అలాగే 30 జూలై 1994 నుండి 17 సెప్టెంబర్ 1995 వరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు. పంచాయతీ రాజ్ వ్యవస్థకు పునరుజ్జీవనం కల్పించి, గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర ఎన్నికల విధానాన్ని ప్రారంభించారు. అధికార వికేంద్రీకరణ, వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే విధానం ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. మహారాష్ట్రలో సాగునీటి విప్లవానికి శ్రీకారం చుట్టినందుకు ఆయనను "జలక్రాంతి నాయకుడు"గా కూడా పిలుస్తారు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]సుధాకరరావు నాయక్ తన రాజకీయ జీవితం గ్రామ సర్పంచ్గా ప్రారంభించారు. ఆయన పుసాద్ నియోజకవర్గం నుంచి 1978, 1980, 1985, 1990 మరియు 1999 ఎన్నికల్లో గెలిచి ఐదు సార్లు మహారాష్ట్ర శాసనసభ సభ్యుడిగా ఉన్నారు.[3]
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముంబైలో 1992–93 అల్లర్లు జరిగాయి. అనంతరం శరద్ పవార్తో రాజకీయ విభేదాలు పెరిగి, చివరికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఒక సందర్భంలో పవార్ తనను పప్పు కలాని విషయంలో సడలింపు ఇవ్వమని కోరారని నాయక్ పేర్కొన్నారు.[4]
1998లో ఆయన వాషిమ్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు.[5]
వ్యక్తిగత జీవితం
[మార్చు]సుధాకరరావు నాయక్ 21 ఆగస్టు 1934న మహారాష్ట్రలోని గాహులి గ్రామంలో బంజారా గిరిజన కుటుంబంలో జన్మించారు. ఆయన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసంతరావు నాయక్కు మేనల్లుడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Pusad's 'blue bloods' have not lost seat since Maha formation". The Times of India. 24 November 2024. Retrieved 14 December 2024.
- ↑ "Maharashtra polls: Naik family has won Yavatmal's Pusad seat for 72 years". Hindustan Times. 26 November 2024. Retrieved 14 December 2024.
- ↑ "Elections results analysis 1978–2004". Election Commission of India. Retrieved 28 January 2010.
- ↑ Gouri Shah (11 October 2004). "The F-factor: Kalani certain of clean sweep". The Economic Times. Archived from the original on 25 October 2004. Retrieved 24 May 2007.
- ↑ "Lok Sabha". Archived from the original on 16 January 2014. Retrieved 2013-12-01.
- ↑ Choudhary, Ratnadeep (10 May 2019). "Sudhakarrao Naik, the CM who failed to tackle Bombay riots after Babri Masjid demolition". ThePrint. Retrieved 24 November 2025.
- 1934 జననాలు
- 2001 మరణాలు
- మహారాష్ట్ర ముఖ్యమంత్రులు
- భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకులు
- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు
- మహారాష్ట్ర శాసనసభ సభ్యులు 1978–1980
- మహారాష్ట్ర శాసనసభ సభ్యులు 1980–1985
- మహారాష్ట్ర శాసనసభ సభ్యులు 1985–1990
- మహారాష్ట్ర శాసనసభ సభ్యులు 1990–1995
- మహారాష్ట్ర శాసనసభ సభ్యులు 1999–2004
- హిమాచల్ ప్రదేశ్ గవర్నర్లు
- భారత లోక్సభ సభ్యులు 1998–1999
- యవత్మాల్ జిల్లా వ్యక్తులు
- మరాఠీ రాజకీయ నాయకులు
- వాషిమ్ వ్యక్తులు
