Jump to content

సుశీల కర్కి

వికీపీడియా నుండి

సుశీల కర్కి ( నేపాలీ : सुशीला कार्की ) (జననం 7 జూన్ 1952 బిరత్‌నగర్) నేపాల్‌కు చెందిన న్యాయవాది, మాజీ ప్రధాన న్యాయమూర్తి. ఆమె నేపాల్‌ అత్యున్నత న్యాయస్థానానికి సీజేఐగా పనిచేసిన ఏకైక మహిళ.[1]

నేపాల్​లో ఆందోళనల నేపథ్యంలో 2025లో ప్రధాని కేపీ శర్మ ఓలి సహా మంత్రులు రాజీనామా చేయడంతో జెన్​ జెడ్ ముమ్ముర చర్చలు అనంతరం నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మాజీ చీఫ్‌ జస్టిస్‌ సుశీల కర్కి పేరును సెప్టెంబర్ 10న ప్ర‌క‌టించారు.[2][3] ఆమె సెప్టెంబర్ 12న నేపాల్​ తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది.[4][5]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సుశీల కర్కి 1952 జూన్ 7న మొరాంగ్ జిల్లాలోని బిరత్‌నగర్‌లో జన్మించింది. ఆమె మహేంద్ర మొరాంగ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని ఆ తరువాత నేపాల్ త్రిభువన్ విశ్వవిద్యాలయం నుండి న్యాయ పట్టా పొందింది.[6]

మూలాలు

[మార్చు]
  1. "Nepal's First Woman Acting Chief Justice Sushila Karki Assumes Office". NDTV. 15 April 2016. Archived from the original on 11 September 2025. Retrieved 11 September 2025.
  2. "తాత్కాలిక ప్ర‌భుత్వ చీఫ్‌గా సుశీలా క‌ర్కి పేరును ప్ర‌తిపాదించిన జెన్‌-జెడ్‌". NT News. 10 September 2025. Archived from the original on 11 September 2025. Retrieved 11 September 2025.
  3. "నేపాల్‌ తాత్కాలిక అధినేతగా సుశీల కర్కి". Andhrajyothy. 11 September 2025. Archived from the original on 11 September 2025. Retrieved 11 September 2025.
  4. "నేపాల్‌ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ప్రమాణం". Eenadu. 12 September 2025. Archived from the original on 12 September 2025. Retrieved 12 September 2025.
  5. "నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ప్రమాణ స్వీకారం". Andhrajyothy. 12 September 2025. Archived from the original on 12 September 2025. Retrieved 12 September 2025.
  6. "నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీలా కర్కి.. ప్రతిపాదించిన జనరల్-జెడ్". TV9 Telugu. 10 September 2025. Archived from the original on 11 September 2025. Retrieved 11 September 2025.