సూర్యారావుపేట (కాకినాడ గ్రామీణ)
సూర్యారావుపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా, కాకినాడ గ్రామీణ మండలం లోని జనగణన పట్టణం.[1]
గణాంకాలు[మార్చు]
సూర్యారావుపేట, కాకినాడ జిల్లా, కాకినాడ మండలానికి చెందిన జనాభా లెక్కల పట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం సూర్యారావుపేట పట్టణంలో మొత్తం 6,453 కుటుంబాలు ఉన్నాయి. సూర్యారావుపేట పట్టణ మొత్తం జనాభా 24,112 అందులో పురుషులు 11,963 మంది ఉండగా, స్త్రీలు 12,149 మంది ఉన్నారు. సగటు లింగ నిష్పత్తి 1,016. పట్టణంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2214, ఇది మొత్తం జనాభాలో 9%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 1102 మంది మగ పిల్లలు ఉండగా, ఆడ పిల్లలు 1112 మంది ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 1,009, ఇది సగటు లింగ నిష్పత్తి (1,016) కంటే తక్కువ.అక్షరాస్యత శాతం మొత్తం 88.5%. అవిభాజ్య తూర్పుగోదావరి జిల్లా 71%తో పోలిస్తే సూర్యారావుపేట అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది. సూర్యారావుపేటలో పురుషుల అక్షరాస్యత రేటు 91.58% ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 85.39%గా ఉంది.[2]
పరిపాలన నిర్వహణ[మార్చు]
సూర్యారావుపేట సెన్సస్ టౌన్ పరిధిలో మొత్తం 6,453 గృహాలను కలిగి ఉంది.వీటికి నీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి ప్రాథమిక సౌకర్యాలను స్థానిక స్వపరిపాలన సంస్థ అందిస్తుంది. సెన్సస్ టౌన్ పరిమితుల్లో రోడ్లు నిర్మించడానికి, నిర్వహణకు దాని అధికార పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్నులు విధించడానికి కూడా దీనికి అధికారం కలిగి ఉంది.[2]
మూలాలు[మార్చు]
- ↑ "Villages and Towns in Kakinada Mandal of East Godavari, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2022-10-10.
- ↑ 2.0 2.1 "Villages and Towns in Kakinada Mandal of East Godavari, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2022-10-10.