సోమేశ్వరర్ ఆలయం
| సోమేశ్వరర్ ఆలయం | |
|---|---|
| కుడంతై కరోణం | |
ఆలయ రాజగోపురం | |
తమిళనాడులో స్థానం | |
| భౌగోళికం | |
| భౌగోళికాంశాలు | 10°57′33″N 79°22′30″E / 10.9591°N 79.3751°E |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | తంజావూరు |
| స్థలం | కుంభకోణం |
| ఎత్తు | 54.41 m (179 ft) |
| సంస్కృతి | |
| దైవం | సోమేశ్వరర్ |
| ముఖ్యమైన పర్వాలు | మహాశివరాత్రి |
| వాస్తుశైలి | |
| నిర్మాణ శైలులు | ద్రావిడ శైలి నిర్మాణకళ |
సోమేశ్వరర్ ఆలయం అనేది భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం, కుంభకోణంలో ఉన్న ఒక ప్రముఖ హిందూ దేవాలయం. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఇక్కడ శివుడిని సోమేశ్వరర్ రూపంలో పూజిస్తారు. ఆయనను లింగం రూపంలో ప్రతిష్ఠించారు. ఆయన సహధర్మిణి పార్వతిను సోమసుందరిగా ఆరాధిస్తారు. ఈ ఆలయ ప్రధాన దేవతను 7వ శతాబ్దానికి చెందిన తమిళ శైవ ధర్మ గ్రంథమైన తేవారంలో స్తుతించారు. ఈ గ్రంథాన్ని నాయనార్లుగా పిలువబడే తమిళ సంత కవులు రచించారు. ఈ ఆలయం పాడల్ పెట్ర స్థలంగా వర్గీకరించబడింది.[1]
ఆలయ సముదాయం రెండు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది, ఇది సారంగపాణి ఆలయంకు సమీపంలో ఉంది. ఈ ఆలయంలో రెండు ప్రధాన ప్రవేశ గోపురాలు ఉన్నాయి, వీటిని గోపురాలు అని పిలుస్తారు. వీటిలో అత్యంత ఎత్తైనది పశ్చిమ గోపురం, ఇది ఐదు అంతస్తులు కలిగి సుమారు 72 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి. వాటిలో సోమేశ్వరర్, సోమసుందరి దేవతల ఆలయాలు అత్యంత ప్రధానమైనవిగా భావించబడుతాయి.
ఆలయంలో ప్రతిరోజూ ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు వివిధ సమయాలలో ఆరు ప్రధాన పూజాక్రియలు నిర్వహించబడుతాయి. ఆలయ వార్షిక పండుగలలో పన్నెండు ముఖ్యమైన ఉత్సవాలు జరుపబడతాయి. వాటిలో మాఘం నక్షత్రం (ఫిబ్రవరి – మార్చి) రోజున జరిగే మాసి మగం పండుగ అత్యంత ప్రముఖమైనదిగా నిర్వహించబడుతుంది.
ప్రస్తుతం కనిపించే రాతి నిర్మాణ ఆలయాన్ని 16వ శతాబ్దంలో తంజావూరు నాయకుల కాలంలో నిర్మించారు. ఆధునిక కాలంలో ఈ ఆలయ నిర్వహణ, పరిపాలనను తమిళనాడు ప్రభుత్వంకు చెందిన హిందూ మత, దాన ధర్మాదాయ శాఖ నిర్వహిస్తోంది.
పురాణకథ
[మార్చు]
ఈ ప్రదేశాన్ని 7వ శతాబ్దానికి చెందిన సంత కవి తిరుజ్ఞానసంబంధర్, తిరునావుక్కరసర్ రచించిన తేవారంలో ప్రస్తావించారు.[2]
పురాణకథల ప్రకారం, భారతదేశంలోని తొమ్మిది పవిత్ర నదులు స్నానం చేసే భక్తుల పాపాలను కడిగివేయడం వల్ల తామూ పాపభారంతో ఉన్నామని భావించి, బెనారస్ (విశ్వనాథర్) లోని శివుని ప్రార్థించాయి. శివుడు వాటిని మహామఘం చెరువులో స్నానం చేసి ఆది కుంభేశ్వర ఆలయంను పూజించమని సూచించాడు.
మరొక కథ ప్రకారం, శివుని బాణం వల్ల పవిత్ర కుండ 12 చోట్ల పగిలిపోయి, ఆ ప్రదేశాల్లో శివాలయాలు నిర్మించబడ్డాయి. ఈ ఆలయం వాటిలో ఒకటిగా పరిగణించబడుతుంది.
ఇంకొక పురాణకథ ప్రకారం, ఒక మహా ప్రళయం సంభవించినప్పుడు సృష్టికర్త బ్రహ్మ తన సృష్టిని ఎక్కడ ప్రారంభించాలో ఆందోళన చెందాడు. అతను శివుణ్ణి ప్రార్థించగా, శివుడు వివిధ ప్రాంతాల నుండి మట్టిని సేకరించి ఒక మాయాకుంభాన్ని నిర్మించమని వరం ఇచ్చాడు. బ్రహ్మ బిల్వ ఆకులతో శివుణ్ణి పూజించి మామిడి ఆకులతో అలంకరించాడు.
ప్రళయం సమయంలో నీరు దక్షిణ దిశగా మళ్లించబడగా, ఆ పవిత్ర కుండ నీటిలో తేలుతూ వచ్చింది. అది ఎక్కడ పడిపోయి పగిలిందో అక్కడే సోమేశ్వరన్ ఆలయం ఏర్పడింది. చంద్రుడు (సోముడు) ఇక్కడ శివుణ్ణి పూజించినందువల్ల దీనిని సోమేశ్వరన్ ఆలయం అని పిలుస్తారు. ఇక్కడి లింగం స్వయంభూ లింగంగా భావించబడుతుంది.[3]
వాస్తుశిల్పం
[మార్చు]సోమేశ్వరర్ ఆలయం శ్రీ సారంగపాణి ఆలయం దక్షిణ భాగంలో ఉంది. పురాణకథ ప్రకారం, ప్రారంభ నిర్మాణంలో ఈ ఆలయం పెద్ద ప్రదేశాన్ని ఆక్రమించుకుని ఉండేదని, తరువాత సమీపంలోని సారంగపాణి ఆలయం ఎక్కువ స్థలాన్ని ఆక్రమించిందని చెబుతారు. ఈ ఆలయం కుంభకోణంలోని ప్రముఖ శివాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.[4] ఇది కావేరి నది తీరంలో నిర్మించబడిన ఆలయాలలో ఒకటిగా కూడా గుర్తింపు పొందింది.[5] ఈ ఆలయంలో ఐదు అంతస్తుల రాజగోపురం ఉంది. అంతర గోపురంలో మూడు అంతస్తులుగా ఉంటుంది. ఆలయంలోని అన్ని ఉప ఆలయాలు ప్రాకార గోడల లోపల సమావృతంగా ఉన్నాయి. గర్భగుడి తూర్పు ముఖంగా ప్రవేశగోపురానికి సూటిగా నిర్మించబడింది.
మంగళాంబిగై దేవి ఆలయం గర్భగుడికి వెళ్లే మండపంలో ఉండి దక్షిణ ముఖంగా ఉంటుంది. అంబాళ్ ఆలయం దక్షిణ ప్రవేశద్వారానికి ఎదురుగా ఉంటుంది. ఈ దక్షిణ ద్వారం తంజావూరు – కుంభకోణం ప్రధాన రహదారిపై ఉంది. గర్భగుడి చుట్టుపక్కల ప్రాకారంలో వినాయకుడు, వల్లి సహిత అర్ముగుడు, గజలక్ష్మి, నటరాజ విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయం, కాశి విశ్వనాథర్ ఆలయం, కుంభకోణం మధ్య కుడంతై కరోణం అని తేవారంలో పేర్కొనబడిన ఆలయం ఏదన్న విషయంలో వివాదం ఏర్పడింది. ధర్మపురం ఆధీనము అనే శైవ మఠ సంస్థతో పాటు కొంతమంది చరిత్రకారులు అది కాశి విశ్వనాథర్ ఆలయం అని భావించారు. అయితే 1958లో జరిగిన ఒక సమావేశంలో ఇది కుడంతై కరోణం అని నిర్ణయించారు. ఈ ఆలయానికి సంబంధించిన తేవారం పాటలను ఆలయ గోడలపై శిల్పరూపంలో చెక్కారు.[6]
పూజా విధానాలు, ఆధ్యాత్మిక ఆచారాలు
[మార్చు]
ఆలయ పూజారులు పండుగల సమయంలోను, రోజువారీగా కూడా పూజ (ఆచారాలు) నిర్వహిస్తారు. ఆలయంలో రోజుకు ఆరు సార్లు పూజలు జరుగుతాయి. అవి: ఉదయం 6:00 గంటలకు కళాశాంతి, ఉదయం 9:00 గంటలకు ఇరండాం కాలం, మధ్యాహ్నం 12:00 గంటలకు ఉచ్చికాలం, సాయంత్రం 6:00 గంటలకు సాయరక్షై, రాత్రి 7:30 గంటలకు మరొకసారి ఇరండాం కాలం,, రాత్రి 9:00 గంటలకు అర్థజామం.
ప్రతి పూజలో నాలుగు ప్రధాన దశలు ఉంటాయి: అభిషేకం (పవిత్ర స్నానం), అలంకారం (అలంకరణ), నైవేద్యం (ఆహార నివేదన), దీప ఆరాధన (దీపాలను ఊపడం). ఈ విధంగా సోమేశ్వరన్, సోమసుందరి దేవతలకు పూజలు నిర్వహిస్తారు.
ఆలయంలో వారాంతపు ప్రత్యేక పూజలుగా సోమవారం, శుక్రవారం పూజలు, పక్షంలో రెండుసార్లు జరిగే ప్రదోషం పూజలు, నెలవారీ పండుగలుగా అమావాస్య (నూతన చంద్రుడు), కృతికై, పౌర్ణమి (పూర్ణ చంద్రుడు), సతుర్థి వంటి ఉత్సవాలు నిర్వహిస్తారు.
తమిళ మాసమైన మాసి (ఫిబ్రవరి – మార్చి)లో జరిగే మాసి మహం, ఫిబ్రవరి–మార్చిలో శివరాత్రి, అలాగే పంగుని మాసంలో జరిగే పంగుని ఉత్తిరం ఈ ఆలయంలో ప్రధాన ఉత్సవాలుగా జరుపబడతాయి.[3]
ఈ ఆలయం కావేరి నది తీరంలో నిర్మించబడిన ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.[5]
ఆలయ మహాసంప్రోక్షణం (కుంభాభిషేకం) 2 నవంబరు 2015న నిర్వహించబడింది. ఈ మహాసంప్రోక్షణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.[7]
ప్రత్యేకత
[మార్చు]కుంభకోణంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహామఘం ఉత్సవంతో 12 శివాలయాలు అనుసంధానమై ఉన్నాయి. అవి:
- కాశి విశ్వనాథర్ ఆలయం,
- ఆది కుంభేశ్వర ఆలయం,
- సోమేశ్వరర్ ఆలయం,
- నాగేశ్వరస్వామి ఆలయం,
- కాలహస్తీశ్వరర్ ఆలయం,
- గౌతమేశ్వరర్ ఆలయం,
- కోడీశ్వరర్ ఆలయం,
- అమృతకడేశ్వరర్ ఆలయం,
- బాణపురీశ్వరర్ ఆలయం,
- అభిముకేశ్వరర్ ఆలయం,
- కంబట్ట విశ్వనాథర్ ఆలయం,
- ఏకాంబరేశ్వరర్ ఆలయం.
ఈ ఆలయం కూడా ఆ పన్నెండు ఆలయాలలో ఒకటి.[8]
చిత్రశాల
[మార్చు]-
కుంభాభిషేకం – 2 నవంబరు 2015
సూచనలు
[మార్చు]- ↑ Census of India, 1961, Volume 7. Director of Census publication. 1961.
- ↑ "Campantar Tevaram -2" (PDF). projectmadurai.org. 2011. Retrieved 16 July 2011.
- ↑ 3.0 3.1 "Sri Someswaran temple temple". దినమలర్. 2014. Retrieved 24 November 2015.
- ↑ Diwakar, Macherla (2011). Temples of South India (1st ed.). Chennai: Techno Book House. p. 138. ISBN 978-93-83440-34-4.
- ↑ 5.0 5.1 Ka. Vi., Kannan (2019). River cauvery the most battl(r)ed. Notion Press. p. 34. ISBN 9781684666041.
- ↑ R., Dr. Vijayalakshmy (2001). An introduction to religion and Philosophy - Tévarám and Tivviyappirapantam (1st ed.). Chennai: International Institute of Tamil Studies. pp. 216–7.
- ↑ "Consecration done in five temples". The Hindu. 3 November 2015.
- ↑ Mahamaham Festival 2004 (in Tamil), Hindu Religious and Charitable Endowments Administration Department, Government of Tamil Nadu, 2004