స్వామినేని ముద్దునరసింహంనాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వామినేని ముద్దునరసింహంనాయుడు (1792-1856) వ్యవహారిక భాషావాది, తొలి తెలుగు వ్యాసకర్త.[1] తొలి తెలుగు వ్యావహారికభాషా వచన గ్రంథం హితసూచని (1853) రచయిత.[ఆధారం చూపాలి] హేతువాది . ఈయన పెద్దాపురం జిల్లా మునసబుగా పనిచేస్తూ చనిపోయారు. హితసూచనిని ముద్దునరసింహంనాయుని మరణానంతరం రాజమండ్రిలో న్యాయవాదిగా పనిచేస్తున్న ఆయన కుమారుడు రంగప్రసాధనాయుడు తొలిసారిగా 1862లో ముద్రింపజేశాడు.[2] ఆ పుస్తకాన్ని 1986 లో రాజమండ్రి ఆంధ్రకేసరి యువజన సమితి వారు పునర్ముద్రించారు.

చిన్నయసూరి వంటి పండితులు అలంకారభూషితమైన గ్రాంధికభాషలో రచనలు చేస్తున్న సమయంలో ముద్దునరసింహంనాయుడు ధైర్యంగా వ్యవహారిక భాషలో అనేక విషయాలపై వ్యాసాలను ప్రకటించడం మొదలుపెట్టి తెలుగు గద్యరచనకు వ్యవహారిక భాషే మేలైనదని సూచించాడు. హితసూచనిలో నరసింహనాయుడు వ్యవహారిక తెలుగు భాషలో చదువు, పెళ్ళి తదితర జీవితానికి సంబంధించిన విషయాలపై ఎనిమిది వ్యాసాలను పొందుపరచాడు. ఈయన వ్యాసాలను సాధారణంగా ఉపయోగించబడే పదప్రయోగమైన వ్యాసం అనకుండా, ప్రమేయాలన్నాడు.[3][4] కవి, నాటక కర్త, పాత్రికేయుడు సామినేని ముద్దుకృష్ణ ముద్దునరసింహంనాయుడుకి ముని మనుమడు.

1862 లోరచించబడిన ఆ హితసూచని చాల గొప్ప గ్రంథము అని వాడుక భాషాకోవిదులు గిడుగు రామమూర్తి పంతులు గారు నరసింహనాయుడుగారి మనుమలు శ్రీ ముద్దు కృష్ణగారు 1924 లో కలుసుకున్నప్పుడు చెప్పినట్లుగా 1986 లో ప్రకటించబడిన హితసూచని సంకలనానికి ప్రవేశికలో ఆరుద్రగారు వ్రాశారు.[5]

ముద్దునరసింహంనాయుని ఇతర రచనలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Encyclopaedia of Indian Literature: devraj to jyoti, Volume 2 edited by Amaresh Datta
  2. Encyclopaedia of Indian Literature: sasay to zorgot, Volume 5 edited by Mohan Lal
  3. A History of Indian Literature: 1800-1910, western impact: indian ..., Volume 8 By Sisir Kumar Das
  4. స్వామినీన ముద్దు నరసింహనాయుడు గారు దిగవల్లి వేంకట శివరావు సమాలోచన February 1, 1981
  5. "హితసూచని" (1986) ఆంధ్రకేసరి యువజన సమితి, రాజమండ్రి వారి ప్రచురణ with introduction by ఆరుద్ర