Jump to content

హితసూచని

వికీపీడియా నుండి
హితసూచని
రచయిత(లు)స్వామినీన ముద్దునరసింహంనాయుడు
దేశంబ్రిటిషు భారతదేశం
భాషవ్యావహారిక తెలుగు
విషయంవిద్య, భాష, సంస్కృతి, మూఢాచారాలు
ప్రచురణ సంస్థరంగప్రసాద్ నాయుడు (1862)
ఆంధ్రకేసరి యువజన సమితి (1986)
ప్రచురణ కర్తస్వామినీన రంగప్రసాద్ నాయుడు
ప్రచురించిన తేది
1862
Textహితసూచని online

పలు సామాజిక అంశాలపై రాసిన వ్యాసాల సంకలనం, హితసూచని. ఈ పుస్తకాన్ని 1853 ప్రాంతాలలో స్వామినేని ముద్దునరసింహంనాయుడు రచించాడు. ఆయన మరణం తరువాత, 1862 జూలైలో, ఆయన కుమారుడు రంగప్రసాద నాయుడు తొలిసారి దీన్ని ప్రచురించాడు. ఈ పుస్తకం డెమీ సైజులో 224 పేజీలతో ఉండేది. గ్రంథకర్త బొమ్మ కూడా పుసకంలో ఉంది.

హితసూచని ముఖపత్రంమీద 'మహోపకారులగు రాజమహేంద్రవరపు జిల్లా ఫస్టుక్లాస్‌ డిస్ట్రిక్టు మునసఫుగా నుండిన స్వామినీవ ముద్దునరసింహనాయనివారు’ దానిని రచించినట్టు ప్రకటించడంవల్ల హితసూచని రచనను ఆయన ఆ హోదాలో ఉన్న సమాయనికే (సుమారు 1853 నాటికి) అచ్చువేయించడానికి సిద్ధం చేసి ఉండవచ్చు.

మళ్ళీ 1986 లో ముద్దు నరసింహం నాయుడి మునిమనుమడైన సామినేని ముద్దుకృష్ణ ఈ పుస్తకాన్ని పునర్ముద్రించాడు. దీనికి ఆరుద్ర ముందుమాట రాసాడు.

పుస్తకం విశేషాలు

[మార్చు]

దీనిలో ఎనిమిది వ్యాసాలున్నాయి. రచయిత వాటిని ప్రమేయములు అని పేర్కొన్నాడు. అవి:

  1. విద్యాపమేయము
  2. వైద్య ప్రమేయము
  3. సువర్ణ ప్రమేయము
  4. మనుష్యేతర జంతు సంజ్ఞా ప్రమేయము
  5. రక్ష, ప్రభృతి ప్రమేయము
  6. మంత్ర ప్రమేయము
  7. పరోక్ష జ్ఞాన ప్రమేయము
  8. వివాహ ప్రమేయము
"https://te.wikipedia.org/w/index.php?title=హితసూచని&oldid=4640789" నుండి వెలికితీశారు