Jump to content

హేమావతి నందన్ బహుగుణ

వికీపీడియా నుండి
హేమావతి నందన్ బహుగుణ
హేమావతి నందన్ బహుగుణ

భారతదేశం 2018 స్టాంపుపై హేమవతి నందన్ బహుగుణ


13వ కేంద్ర ఆర్థిక మంత్రి
పదవీ కాలం
1979 జూలై 28  1979 అక్టోబర్ 25
ప్రధాన మంత్రి చరణ్ సింగ్
ముందు చరణ్ సింగ్
తరువాత చరణ్ సింగ్

పదవీ కాలం
1973 నవంబర్ 8  1975 నవంబర్ 29
ముందు రాష్ట్రపతి పాలన
తరువాత రాష్ట్రపతి పాలన

పదవీ కాలం
(1980 - 1982), (1982  1984)
ముందు పండిట్ జగన్నాథ్ శర్మ
తరువాత చంద్ర మోహన్ సింగ్ నేగి
నియోజకవర్గం గర్హ్వాల్

పదవీ కాలం
(1977  1980)
ముందు షీలా కౌల్
తరువాత షీలా కౌల్
నియోజకవర్గం లక్నో

పదవీ కాలం
(1971  1975)
ముందు హరి కృష్ణ శాస్త్రి
తరువాత జానేశ్వర్ మిశ్రా
నియోజకవర్గం అలహాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం 25 April 1919
పౌరి గర్హ్వాల్, ఆగ్రా & ఔధ్ యునైటెడ్ ప్రావిన్సులు, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుత ఉత్తరాఖండ్ , భారతదేశం )
మరణం 1989 మార్చి 17(1989-03-17) (వయసు: 69)
క్లీవ్‌ల్యాండ్ , ఒహియో, యూఎస్
రాజకీయ పార్టీ భారతీయ లోక్ దళ్
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ , జనతా పార్టీ, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ
జీవిత భాగస్వామి కమలా బహుగుణ
బంధువులు సౌరభ్ బహుగుణ (మనవడు)
సంతానం విజయ్ బహుగుణ (కొడుకు)
రీటా బహుగుణ జోషి (కుమార్తె)
పూర్వ విద్యార్థి అలహాబాద్ విశ్వవిద్యాలయం

హేమవతి నందన్ బహుగుణ (25 ఏప్రిల్ 1919 - 17 మార్చి 1989) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1973 నవంబరు 8 నుండి 1975 నవంబరు 30 వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

హేమావతి నందన్ బహుగుణ 1919 ఏప్రిల్ 25న ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్హ్వాల్‌లోని బుఘానిలో గర్హ్వాలి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించగా[1] ఆ తరువాత వారు ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌కు మారారు.[2]

హేమావతి నందన్ బహుగుణ మొదటి భార్య ఎల్లప్పుడూ అతని స్వగ్రామమైన బుఘానిలో ఒక సాధారణ గ్రామీణ మహిళగా నివసించేది. అతని రెండవ భార్య కమలా బహుగుణ అతనితో అలహాబాద్‌లో నివసించింది, వారికి  ముగ్గురు పిల్లలకు తల్లి:

  • వారి పెద్ద కుమారుడు విజయ్ బహుగుణ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పని చేశాడు. ఆయన అలహాబాద్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి & భారతీయ జనతా పార్టీ సభ్యుడు. విజయ్ కుమారుడు సౌరభ్ బిజెపి నుండి ఉత్తరాఖండ్ శాసనసభ సభ్యుడు. ఆయన 2022లో పుష్కర్ సింగ్ ధామి మంత్రివర్గంలో పశుసంవర్ధక, మత్స్య, నైపుణ్యాభివృద్ధి & ఉపాధి, ప్రోటోకాల్ & చెరకు అభివృద్ధి మంత్రిగా పని చేస్తున్నాడు.[3]
  • రెండవ కుమారుడు శేఖర్ బహుగుణ.
  • ఈ దంపతుల కుమార్తె రీటా బహుగుణ జోషి యుపి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలిగా, అలహాబాద్ మేయర్‌గా, లో‍క్‍సభ సభ్యురాలిగా పని చేసింది.

ఎన్నికలలో పోటీ

[మార్చు]
  • 1971: కాంగ్రెస్ సభ్యుడిగా అలహాబాద్ నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.
  • 1977: జనతా పార్టీ మద్దతుతో 'కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ' సభ్యునిగా లక్నో నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.
  • 1980: గర్హ్వాల్ నుండి కాంగ్రెస్ సభ్యుడిగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు, కానీ త్వరలోనే కాంగ్రెస్ & లోక్‌సభ రెండింటినీ విడిచిపెట్టాడు.
  • 1982 ఉప ఎన్నిక: గర్హ్వాల్ నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు, తన కాంగ్రెస్ ప్రత్యర్థిని ఓడించాడు.
  • 1984: ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్)లో అమితాబ్ బచ్చన్ చేతిలో ఓడిపోయాడు.

మరణం

[మార్చు]

బహుగుణ 1988లో అనారోగ్యానికి గురై కరోనరీ బైపాస్ సర్జరీ కోసం అమెరికాకు వెళ్లగా సర్జరీ విజయవంతం కాకపోవడంతో 1989 మార్చి 17న క్లీవ్‌ల్యాండ్ ఆసుపత్రిలో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. Mishra, Anand (16 August 2020). "Big fight for Brahmin votes in Uttar Pradesh". Deccan Herald. Retrieved 27 September 2020.
  2. "Hemanti Nandan Bahuguna". Pauri Garhwal Group. Archived from the original on 1 June 2007. Retrieved 15 March 2015.
  3. "Uttarakhand CM Dhami allots portfolios, keeps over two dozen departments with himself". The Indian Express. 30 March 2022. Retrieved 7 December 2022.