1990 నంది పురస్కారాలు
స్వరూపం
నంది పురస్కారాలు అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమాలకు ఏటా ఇచ్చే పురస్కారాలు. తెలుగు చరిత్ర, కళలకు ప్రతీకలలో ఒకటైన లేపాక్షి నంది పేరిట ఉత్తమ చిత్రాలకు,, ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలు ఇస్తారు. ఈ సంప్రదాయం 1964 సంవత్సరములో ప్రారంభమైనది. ఆ రోజులలో చిత్ర నిర్మాణము చాలా తక్కువగా ఉండేది, ఏడాదికి సుమారు 25 నుండి 30 వరకు చిత్రాలు మాత్రమే తయారవుతుండేవి. రాను రాను వాటి సంఖ్య 125 నుండి 130 వరకూ పెరిగింది. చిత్ర నిర్మాణం సరళి, నాణ్యత, ప్రమాణాలు తగ్గుతూ భారీ వ్యయ ప్రయాసలకు లోనవుతుంది. మొదటిలో బంగారు, రజిత, కాంస్య నంది అనే 3 బహుమతులూ కథకు 2 బహుమతులూ, మొత్తము 5 పురస్కారాలుండేవి. చిత్ర నిర్మాణములో అన్ని శాఖలకు గుర్తింపు, ప్రోత్సాహము అందించే విధంగా ఇప్పుడు 42 నందులకు పెరిగినవి.
| వర్గం | విజేత | చిత్రం |
|---|---|---|
| ఉత్తమ చలనచిత్రం | ముత్యాల సుబ్బయ్య | ఎర్ర మందారం (సినిమా) |
| రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ | టి. క్రాంతి కుమార్ | సీతారామయ్య గారి మనవరాలు |
| మూడవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ | రఘురామిరెడ్డి | హృదయాంజలి |
మూలాలు
[మార్చు]- ↑ "నంది అవార్డు విజేతలు 1964-2008" (PDF). Government ఆంధ్ర ప్రదేశ్. Retrieved 14 జూలై 2021.