కునమల్ల సంధ్యారాణి
జానపద గాయని సంధ్యక్క | |
---|---|
జననం | కునమల్ల సంధ్యారాణి కుమర్పల్లి, హన్మకొండ, వరంగల్ జిల్లా |
మరణం | 6 సెప్టెంబర్, 2018 |
ఇతర పేర్లు | సంధ్యక్క |
వృత్తి | ప్రభుత్వ ఉద్యోగి |
ప్రసిద్ధి | ఓరుగల్లు ప్రముఖ,జానపద గాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కార గ్రహీత |
భార్య / భర్త | వరంగల్ శంకర్ |
పిల్లలు | రాగమయి, శివసాత్విక్ |
తండ్రి | -సారయ్య |
తల్లి | సరోజన |
కునమల్ల సంధ్యారాణి తెలంగాణ రాష్ట్రానికి చెందిన జానపద గాయని. ఆమె 2016లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]
కుటుంబ నేపథ్యం[మార్చు]
కునమల్ల సంధ్యారాణి తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, హన్మకొండ, కుమర్పల్లి గ్రామంలో సారయ్య, సరోజన దంపతులకు జన్మించింది. ఆమె చింతగట్టులోని పే అండ్ అకౌంట్స్శాఖ లో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ, టీఎన్జీవోస్ జిల్లా సాంస్కృతిక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తుంది.
వివాహం[మార్చు]
తెలంగాణ జానపద గాయకుడు వరంగల్ శంకర్ ను కునమల్ల సంధ్య ప్రేమ వివాహం చేసుకుంది. వారికీ కుమార్తె రాగమయి, కుమారుడు శివసాత్విక్ ఉన్నారు.
ప్రజాదరణ పొందిన పాటలు[మార్చు]
సంధ్యకు గుర్తింపు తెచ్చిన పాటలు ‘ఏలో ఉ య్యాలో... తందన తానా..’, ‘కొండా కోన ల్లో.. వాగుల్లో..’
అవార్డు[మార్చు]
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జానపద రంగం నుండి సంధ్యారాణి ఎంపికైంది, ఆమె 8 మార్చి 2016న హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅథిదుల చేతులమీదుగా ఆమె తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందజేసింది. ఆమె ఈ పురస్కారంతో పాటు రూ.లక్ష నగదు స్వీకరించింది.[2]
మూలాలు[మార్చు]
- ↑ Sakshi (6 March 2016). "అవార్డుల్లో ఓరు'ఘల్లు'". Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.
- ↑ Sakshi (6 March 2016). "అవార్డుల్లో ఓరుఘల్లు". Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.