గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు

గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు తెలంగాణకు చెందిన కవి, రచయిత.గన్నమరాజు గిరిజా మనోహర బాబు 1951 నవంబరు 20 న మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ లో శకుంతలమ్మ, రామేశ్వర్ రావు దంపతులకు జన్మించాడు. ఆలంపూర్, పాలెంలలో ప్రాథమిక , ఉన్నత విద్యాభ్యాసాలు పూర్తి చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయం , హైదరాబాద్ నుండి ఎం ఏ.తెలుగులో పట్టా పొందాడు. జూనియర్ లెక్చరర్ గా 6 జనవరి 1978జనవరి 7 న ఉద్యోగంలో చేరి , డిగ్రీ కాలేజి లెక్చరర్ గా ప్రమోషన్ పొంది మొత్తం ( 16+17 ) 33 సంవత్సరాల పాటు సత్తుపల్లి, ఖమ్మం, వర్ధన్నపేట, మహబూబాబాద్‌ , హుజురాబాద్, హనుమకొండ పట్టణాల్లో పనిచేసి 2009 ఆగష్టు 31 న ఉద్యోగ విరమణ పొందాడు.ఇతని సతీమణి కె, గీత హనుమకొండ ప్రభుత్వ పాఠశాల (కొత్తూరు న్యూ ) లో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు.

సాహితీ సేవలు[మార్చు]

హనుమకొండలో 1996లో ప్రారంభింపబడిన “సహృదయ” సాహిత్య సాంస్కృతిక సంస్థ కు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా గత ఇరవైనాలుగేళ్ళుసేవలందించి ప్రస్తుతం ఆ సంస్థ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పండితులను ఆహ్వానించి “మహాభారత దర్శనం“ పేరిట పద్ధెనిమిదిపర్వాల పై పద్ధెనిమిది మంది పండితుల తో ప్రసంగాలు ,“భాగవత సుధా స్రవంతి “పేరిట ద్వాదశ స్కంధాలపై పన్నెండు మంది పండితుల తో ప్రసంగాలు,“ రామ కథా పరిమళం“పేరిట కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విరచిత రామాయణ కల్పవృక్షం పై పది రోజుల పాటు ప్రసంగాలు ,”ఉపనిషచ్చంద్రిక “ పేరిట దశోపనిషత్తులపై పదిమంది పండితుల తో పదిరోజుల ప్రసంగాలు”గీతామృతం”పేర భగవద్గీత లోని పద్ధెనిమిది అధ్యాయాలపై పద్ధెనిమిది మంది విద్వాంసులతో ప్రసంగాలు, “వేద సూక్త కౌముది “ పేరుతో పదిరోజులపాటు వేదసూక్తాల పై పెద్దల తో ప్రసంగాలు,”రామాయణం -మానవ ధర్మము“అనే అంశం పై బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి తో ప్రవచనాలు సహృదయ పక్షాన ఏర్పాటుచేసి విజయవంతంగా నిర్వహించారు .. సహృదయ పక్దాన వందల సంఖ్యలో గ్రంథావిష్కరణ సభలు, సాహిత్య సమావేశాలు ,కవిసమ్మేళనాలు,చర్చాగోష్ఠులునిర్వహించడమే గాక వ్యక్తిగతంగా జాతీయ స్థాయిలో జరిగిన అనేక కళాశాలల సదస్సులలో వివిధవిషయాలపై పత్ర సమర్పణలు చేశారు. వీటిలో కొడాలి సుబ్బారావు-హంపీ క్షేత్రము, కళా పూర్ణోదయము-ఆధునిక రచనా దృక్పథము, తిలక్ రచనలు, పద్యాన్ని ప్రజాపక్షం చేసిన దాశరథి , ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి కావ్యాలు, గోపీనాథ రామాయణం, కాళోజీ ఆత్మకథ,”కాళోజీ’’జీవన గీత’, తెలంగాణ కథ- స్థానికత,వేయిపడగలు-ప్రకృతి,మానవుడు,నవీన్ నవలలు-చారిత్రక దృక్కోణము,ఠంయాల వారి కృష్ణ కుబ్జా విలాసము,పండరినాథరామాయణం-వర్ణనలు,అలంకారములు , శ్రీశ్రీ అనంతం- ఒక దృష్టి .... మొదలైన సుమారు 50 అంశాలకు పైగా ఆధునిక ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన వివిధ విషయాలపై సమర్పించిన పత్రాలు ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల లోని అనేక పట్టణాల లో ప్రదర్శించిన ”శతక కవుల సంగోష్ఠి, ప్రతాప రుద్ర సభ,రామసభ,పోతనవిజయం, కృష్ణా పత్రిక దర్బారు, వందే మాతరం, భువన విజయం, ఇంద్ర సభ, పుష్కర సభ, బ్రహ్మసభ, గణపతి విజయం, గోలకొండ విజయం “ వంటి పలు సాహిత్య రూపకాల్లో చారిత్రక కవుల పాత్రధారణ చేశారు.

ఆకాశవాణి, దూరదర్శన్ లోనే కాకుండా ఇతర చానళ్ళలో కూడా వివిధ ధార్మిక అంశాలతో పాటుగా, సాహిత్యోపన్యాసాలు కూడా చేస్తున్నారు.తిరుమల బ్రహ్మొత్సవాలలో,పుష్కరాల సందర్భాలలోశ్రీరామనవమి మొదలైన పలు ఇతర ప్రత్యేక సందర్భలలోజరిగిన ఎన్నో కార్యక్రమాలలో అనేక పర్యాయాలు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.పూర్వపు ఆంధ్రప్రదేశ్ లోని 23 జిల్లాలలోని ప్రాంతాలలో సాహిత్య,సాంస్కృతిక,సామాజిక అంశాల పై వందలాదిప్రసంగాలు చేశారు.ఇతను పొందిన సత్కారాల్లో సాహితీ విరించి బిరుదు, తో బాటు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం , దేవరకొండ బాలగంగాధర తిలక్ పురస్కారం (తణుకు) గడియారం రామకృష్ణ శర్మ స్మారక పురస్కారం .. కిన్నెర సంస్థ , హైదరాబాదు , సంకీర్తన వారి జీవనసాఫల్యపురస్కారం (హైదరాబాదు) , తెలుగు భాషా దినోత్సవ పురస్కారం, జాతీయ సాహిత్య పరిషత్ పురస్కారం, స్వరసుధ వారి సత్కారం, కళావాహిని వారి సత్కారం, స్వర రవళి వారి సత్కారం, శాంతిదూత పురస్కారం, శాతవాహన విశ్వ విద్యాలయం వారి పురస్కారం , తెలంగాణా సారస్వత పరిషత్తు వారు అందించిన "దేవులపల్లి రామానుజరావు పురస్కారం " ప్రముఖమైనవి.

వీరి సంపాదకత్వం లో రసహృదయ , కథకుశతమానం , శతకసాహిత్యం - సామాజిక నైతిక విలువలు , యువజనవిజ్ఞానము ( రెండవముద్రణ సురవరం ప్రతాపరెడ్డి ) , శతపత్రము ( రెండో ముద్రణ - గడియారం రామకృష్ణ శర్మగారి ఆత్మకథ ~ కేంద్ర సాహిత్య అకాడెమీ వారి పురస్కారం పొందిన రచన )

తెలుగు కథ వెలుగులు , ఓరుగల్లు కళా వైభవము .. , హైందవ ధర్మ వీరులు .. కీ . శే . సురవరం ప్రతాప రెడ్డి ( రెండవముద్రణ )

స్వీయ రచనలు :: సాహిత్య సుధ , శతకసమీరం , తెలుగు శతకాలు ( లఘు గ్రంథం ~ నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వెలువరించిన లఘురచన ) , అక్షరార్చన , అక్షరధుని ( ముందుమాటల మూట ) ,అక్షరాధార (వ్యాససమాహారం )

హైదరాబాదు , ఖమ్మం , మధిర , విజయవాడ , మహబూబునగర్ , తిరుపతి , కర్నూలు , నంద్యాల , నెల్లూరు వరంగల్లు , కరీంనగర్ , రాజమండ్రి ,గుంటూరు, చీరాల , విశాఖపట్టణం , బాపట్ల , తాండూరు , వికారాబాదు , సూర్యాపేట , ఎమ్మిగనూరు , ఆదోని , షాద్ నగర్ మొదలైన పలు చోట్లవివిధ సాహిత్య , సాంస్కృతిక , సామాజిక అంశాలను గురించి వందలాది ప్రసంగాలు చేశారు ..

మూలాలు[మార్చు]

గుంటూరు వెలుపలి లంకెలు[మార్చు]