పాటిబండ్ల చంద్రశేఖరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పి. సి. రావు
పి. చంద్రశేఖరరావు
జననం
పాటిబండ్ల చంద్రశేఖరరావు

1936 ఏప్రిల్ 22
మరణం2018 అక్టోబరు 11(2018-10-11) (వయసు 82)
హైదరాబాదు
మరణ కారణంఅనారోగ్యం
ఇతర పేర్లుపాటిబండ్ల చంద్రశేఖరరావు
విద్యన్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ, పి.హెచ్.డి
విద్యాసంస్థమద్రాసు విశ్వవిద్యాలయం
వృత్తిసముద్ర చట్టాల ట్రిబ్యునల్‌లో జడ్జి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారతదేశ న్యాయకోవిదుడు
పిల్లలునలుగురు కుమార్తెలు

పాటిబండ్ల చంద్రశేఖరరావు భారతదేశ న్యాయకోవిదుడు. అతను పద్మభూషణ్ పురస్కార గ్రహీత.[1]

జీవిత విశేషాలు[మార్చు]

అతను 1936 ఏప్రిల్ 22న కృష్ణా జిల్లా కు చెందిన వీరులపాడు లో జన్మించాడు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని, పి.హెచ్.డి ని చేసాడు. హైదరాబాదులోని నల్సార్ విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.డి పట్టాను పొందాడు.[2] భారత మాజీ దౌత్యవేత్త వి. కె. కృష్ణ మేనన్ 1959లో ప్రారంభించిన "ఇండియన్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ లా" అనే సంస్థకు పరిశోధకునిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. అక్కడ 1963 నుండి 1967వరకు తన సేవలనందించాడు. అదే సంస్థలో 1999 నుండి 2000 వరకు అధ్యక్షునిగా పనిచేసాడు.[3] 1967లో భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖలో చేరాడు. ఆ తరువాత న్యాయ మంత్రిత్వ శాఖకు బదిలీ కాబడి దానికి కార్యదర్శిగా తన సేవలనందించాడు. దేశం తరపున దాదాపు 18 సంవత్సరాల పాటు సముద్ర న్యాయవివాదాల ట్రిబ్యునల్‌లో సేవలందించిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందాడు.[4] 1972లో అతను ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత విభాగంలో న్యాయ సలహాదారునిగా నియమితులయ్యాడు.[5] తదనంతరం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలో అనేక హోదాలు నిర్వర్తించాడు. 1995-96లో న్యూఢిల్లీలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కార కేంద్రానికి సెక్రటరీ జనరల్‌గా నియమితులైన గౌరవం కూడా పొందాడు. 1996లో ఆయన నేతృత్వంలోనే ఆర్బిట్రేషన్‌- కన్సీలియేషన్‌ చట్టం రూపుదాల్చింది. హాంబర్గ్‌లోని అంతర్జాతీయ సముద్ర జలవివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌ న్యాయమూర్తిగా పనిచేశాడు.[6] భారతదేశంలో ముగ్గురు ప్రధాన మంత్రుల వద్ద అతను పనిచేశాడు. 1996 అక్టోబరు 1 నుంచి సముద్ర చట్టాల ట్రిబ్యునల్‌లో జడ్జిగా పనిచేస్తున్నాడు. అతను చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్రప్రభుత్వం 2012లో పద్మభూషణ్‌ పురస్కారాన్ని ప్రదానం చేసింది. రాజ్యాంగంతో పాటు మధ్యవర్తిత్వ చట్టాలపై ఆరు పుస్తకాలు కూడా రాశాడు. ఇటలీ, చైనా మధ్య సముద్ర జలాలపై వివాదం జరిగితే మధ్యవర్తిత్వం నడపడం ద్వారా ఆ వివాదాన్ని పరిష్కరించాడు.

అతను విశాఖపట్నంలోణి దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్ గా తన సేవలనందించాడు.[7]

మరణం[మార్చు]

అతను హైదరాబాదులో అక్టోబరు 11 2018న మరణించాడు.[8] అతనికి నలుగురు కుమార్తెలు.

మూలాలు[మార్చు]

  1. "న్యాయకోవిదుడు పీసీ రావు కన్నుమూత".[permanent dead link]
  2. "ITLOS Tribunol judge Dr. Chandrashekhara Rao". www.itlos.org. International Tribunal on the Law of the Sea. Archived from the original on 14 ఫిబ్రవరి 2016. Retrieved 25 August 2015.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-12-25. Retrieved 2018-10-12.
  4. "న్యాయ కోవిదుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పాటిబండ్ల కన్నుమూత.. చంద్రబాబు దిగ్భ్రాంతి!".[permanent dead link]
  5. "Biodata page of ITLOS Judge Chadrashekhara Rao". Official website for ITLOS. ITLOS — The Hague. Archived from the original on 14 ఫిబ్రవరి 2016. Retrieved 25 August 2015.
  6. "జస్టిస్‌ పీసీ రావు కన్నుమూత".
  7. "Padma Bhushan Dr. Patibandla Chandrasekhara Rao — Faculty Member detail". Archived from the original on 4 అక్టోబరు 2015. Retrieved 28 September 2015.
  8. "న్యాయ కోవిదుడు పాటిబండ్ల". Archived from the original on 2018-10-12. Retrieved 2018-10-12.

అంతర్జాల లంకెలు[మార్చు]