సాలూరు: కూర్పుల మధ్య తేడాలు
చి ప్రముక సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వర రావు గారి పుట్టినది ఇక్కడే ఘంటసాల గారు కూడా ఇక్కడే శ్రీ |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 10: | పంక్తి 10: | ||
| longEW = E |
| longEW = E |
||
|mandal_map=Vijayanagaram mandals outline11.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=సాలూరు|villages=81|area_total=|population_total=101386|population_male=49731|population_female=51655|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=52.09|literacy_male=61.55|literacy_female=43.02}} |
|mandal_map=Vijayanagaram mandals outline11.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=సాలూరు|villages=81|area_total=|population_total=101386|population_male=49731|population_female=51655|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=52.09|literacy_male=61.55|literacy_female=43.02}} |
||
[[File:Salur - Te.ogg]] |
|||
'''సాలూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విజయనగరం]] జిల్లాకు చెందిన ఒక మండలము. సాలూరు [[వంశధార]] ఉపనదైన [[వేగావతి]] ఒడ్డున వుంది. ఈ ఊరు <!-- తూర్పు [[కోస్తా]] లోనే --> చుట్టు కొండలు మద్యలో అందమైన ఊరుసాలూరు రాష్ట్రంలోనే సుందరమైన ప్రదేశం. |
'''సాలూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విజయనగరం]] జిల్లాకు చెందిన ఒక మండలము. సాలూరు [[వంశధార]] ఉపనదైన [[వేగావతి]] ఒడ్డున వుంది. ఈ ఊరు <!-- తూర్పు [[కోస్తా]] లోనే --> చుట్టు కొండలు మద్యలో అందమైన ఊరుసాలూరు రాష్ట్రంలోనే సుందరమైన ప్రదేశం. |
||
ఈ ఊరులో పురాతనమైన |
ఈ ఊరులో పురాతనమైన |
17:01, 19 జనవరి 2014 నాటి కూర్పు
సాలూరు |
|
— మండలం — | |
విజయనగరం పటంలో సాలూరు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో సాలూరు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 18°32′00″N 83°13′00″E / 18.5333°N 83.2167°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విజయనగరం |
మండల కేంద్రం | సాలూరు |
గ్రామాలు | 81 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 1,01,386 |
- పురుషులు | 49,731 |
- స్త్రీలు | 51,655 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 52.09% |
- పురుషులు | 61.55% |
- స్త్రీలు | 43.02% |
పిన్కోడ్ | {{{pincode}}} |
సాలూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము. సాలూరు వంశధార ఉపనదైన వేగావతి ఒడ్డున వుంది. ఈ ఊరు చుట్టు కొండలు మద్యలో అందమైన ఊరుసాలూరు రాష్ట్రంలోనే సుందరమైన ప్రదేశం. ఈ ఊరులో పురాతనమైన
పంచముఖేశ్వర శివాలయం వున్నది. ఈ ఆలయం చాలప్రసిద్ది చెందినది.
ఇక్కడ శివాలయంతో పాటుగా సాయిబాబా మందిరం, అయ్యప్ప స్వామి కోవెల,వీరబ్రంహేంద్రస్వామి,ఆదిపరాశక్తి ,సంతోషిమాతఆలయాలు నది తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వున్నాయి.శ్రీ శ్యామలాంబ అమ్మవారు ఈ ఊరి గ్రామదేవతగా పూజలు అందుకుంటున్నారు ఇక్కడకు దగ్గరలోనే శంబరపోలమాంబ,పారమ్మకొండలాంటి పుణ్యతీర్దాలు వున్నాయ్.తోణం వాటర్ ఫాల్స్ ,దండిగం,కూరుకుటి వాటర్ ఫాల్స్, పాచిపెంట డ్యాం,శంబర డ్యాం లాంటి చూడచక్కని ప్రదేశాలు వున్నాయి.... ఇక్కడ ప్రదానంగా లారి పరిశ్రమపై ఎక్కువమంది ప్రజలు ఆదారపడి వున్నారు..రాష్ట్రంలో విజయవాడ తరువాత అత్యదిక లారీలు ఇక్కడే వున్నాయి .. పువ్వుల వ్యాపారంలో సాలూరు అగ్ర స్తానంలో వుంది. మల్లెపువ్వులు ఇక్కడ ఎక్కువ దిగుబడి అవుతాయి.ఇక్కడ నుండి రోజు ఆనేక జాతుల పువ్వులు దూర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. ఆంద్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతమైన సాలూరు నుండి పర్యటక ప్రాంతమైన అరకు వెళ్లేందుకు దగ్గర మార్గాలున్నాయి. సాలూరు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలోని ఒక నియోజకవర్గం. ప్రముక సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వర రావు గారి పుట్టినది ఇక్కడే .. [[
]] ఘంటసాల గారు కూడా ఇక్కడే శ్రీ పట్రయుని సీతారామశాస్త్రి గారి దగ్గర సంగిత విద్యను నేర్చుకున్నారు ..
పురపాలక సంఘం
సాలూరు 1950 సంవత్సరం వరకు గ్రామ పంచాయితి. 26 సెప్టంబరు 1950 సంవత్సరంలో గ్రామ పంచాయితీ స్థాయి నుండి మూడవ గ్రేడ్ పురపాలక సంఘ స్థాయికి ఉన్నతిని కల్పించారు. 1950 సంవత్సరంలో సాలూరు పురపాలక సంఘ పరిధి 13.58 మైళ్ళు. 2001 సంవత్సరం లొ రెండవ గ్రేడ్ పురపాలక సంఘ స్థాయికి ఉన్నతిని పొందిన తరువాత సాలూరు పురపాలక సంఘ పరిధి 19.55 మైళ్ళు. సాలూరు పట్టణం లొ పువ్వుల పెంపకం, లారీల శరీరాలు తయారు చేయడం (బాడి బిల్దింగ్), లారీ, బస్సుల ట్యూబ్ లు టైర్లు రిపేరు చేయడం ప్రధాన వృత్తులు. పట్టణం లొ 24 ప్రాధమిక పాఠశాలలు, 9 ఉన్నత పాఠశాలలు, 4 జూనియర్ కళాశాలలు, 2 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అంతేకాక పట్టణం లొ 13 రైస్ మిల్లులు, 2 రంపం మిల్లులు (వడ్రంగి పనికి చెక్క కోసే మిల్లు), 3 ఇంజనీరింగ్ వర్క షాప్ లు, 15 వాహానాల రిపైరు చేసే షెడ్స్, 8 లారీ బాడి బిల్డింగ్ కర్మాగారాలు ఉన్నాయి. పట్టణం లొ ఒక ప్రభుత్వ ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రి, హోమియో ఆసుపత్రి, 5 ప్రైవేటు నర్సింగ్ హోమ్లు, 30 మంది వైద్యులతో ఒక కమ్యూనిటి ఆరోగ్య కేంద్రం ఉన్నాయి.
1959 సంవత్సరం పట్టణానికి రక్షిత మంచి నీరు సరఫరా చేసే ఉద్దేశ్యంతో ఒక బావిని, ఒక పంప్ హౌస్ ని, ఒక ఓవర్ హెడ్ నీరు భద్రపరచే జలాశయాన్ని నిర్మించారు. రక్షిత మంచి నీటి పథకానికి నీటి ఆధారం వేగావతి నది. ఈ పథకానికి 1987, 1993, 2001 సంవత్సరాలలొ జరిగిన ఉన్నత మార్పుల వల్ల , 2002 సంవత్సరం నుండి పట్టణం లొ 80 శాతం మందికి రక్షిత మంచి నీరు సరఫరా అవుతోంది. రోజుకి సగటున 3.69 MLD (8.11 లక్ష గ్యాలన్ల) నీరు సరఫరా చేయబడుతోంది. నీటి ఫలకం భూమి నుండి 12 మీటర్ల లోతు లొ ఉన్నది.
సాలూరు శాసనసభా నియోజకవర్గం
సాలూరు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలోని ఒక నియోజకవర్గంగా 1951 సంవత్సరం నుండి శాసనసభ్యుల్ని ఎన్నుకొంటుంది. ఇది వెనుకబడిన తెగలకు (Scheduled Tribes) రిజర్వ్ చేయబడినది. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత సాలూరు, పాచిపెంట, మెంటాడ మరియు మక్కువ మండలాలు ఇందులో చేర్చబడ్డాయి
సాలూరు నుండి ఎన్నికయిన శాసన సభ్యుల పట్టిక:
- 1951 - కూనిశెట్టి వెంకట నారాయణ దొర
- 1955 - అల్లు ఎరుకు నాయుడు
- 1955, 1967, 1983 and 1985 - బోయిన రాజయ్య
- 1962 - సూరి దొర
- 1962 and 1989 - రాజా లక్ష్మీ నరసింహ సన్యాసిరాజు
- 1972 - జన్ని ముత్యాలు
- 1978 - S.R.T.P.S. వీరప రాజు
- 1994, 1999 - రాజేంద్ర ప్రతాప్ భంజ్ దేవ్.
- 2004 - రాజన్న దొర
- 2009 - రాజన్న దొర
పట్టణ ప్రముఖులు
- బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత మరియు పాత్రికేయులు అయిన పురిపండా అప్పలస్వామి (1904-1982) సాలూరులో జన్మించారు.
అంగజాల జగన్నాథయ్య
అంగజాల జగన్నాథయ్య (1932 - 1989) సుప్రసిద్ధ వ్యాపారవేత్త. వీరి స్వస్థలం విజయనగరం జిల్లాలోని బలిజిపేట గ్రామం. వీరు వ్యాపారరీత్యా సాలూరు పట్టణానికి 1960 ప్రాంతంలో వచ్చారు. ఈయన తల్లిదండ్రులు అంగజాల పెదప్పయ్య మరియు ఇండుగు కొండమ్మ. తండ్రి గారు బలిజిపేటలో పేరుపొందిన వ్యాపార ప్రముఖులు. ఈయన బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం బలిజిపేట గ్రామంలోనే జరిగింది. ఎస్.ఎస్.ఎల్.సి. కోసం దగ్గరిలోని విద్యాకేంద్రమైన బొబ్బిలి వెళ్ళి అక్కడి సంస్థానం ఉన్నత పాఠశాలలో చదివారు. వీరు 1952లో మద్దమశెట్టి సావిత్రమ్మను వివాహం చేసుకున్నారు. భారత స్వాతంత్యం అనంతరం 1947లో అన్నయ్య అయిన కృష్ణమూర్తి గారు చనిపోవడంతో చదువు ఆపి తండ్రి గారి వ్యాపార విషయాలలో కేంద్రీకరించారు. జగన్నాథయ్య గారు, బావమదరులైన మద్దమశెట్టి శ్రీరాములప్పయ్య మరియు భరతారావు గార్లతో కలిసి శ్రీకృష్ణా ట్రేడర్స్ పేరుతో వ్యాపారసంస్థను స్థాపించి, ఉమ్మడిగా వ్యాపారం మొదలుపెట్టారు. వీరు ముగ్గురూ త్రిమూర్తుల వలె వ్యాపారాన్ని వృద్ధిచేసి ఉమ్మడి కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయపడేవారు. వీరు ముఖ్యంగా చింతపండు వ్యాపారం చేసినా, కొంతకాలం నూనెదినుసులు మొదలైన ఇతర వ్యాపారాలు కుడా చేశారు. వీరు చింతపండును పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకొని, మన రాష్ట్రంలోను మరియు తమిళనాడు రాష్ట్రాలకు అమ్మి టోకు వ్యాపారం మరియు కమిషన్ కోసం కూడా క్రయవిక్రయాలు చేశారు. కొనుగోలు ఎక్కువగా గిరిజన అభివృద్ధి సంస్థ నుండి లేదా కొన్ని ప్రైవేటు సంస్థల నుండి కొనేవారు. వాటిని బస్తాలలో లారీలు లేదా రైలు ద్వారా సాలురుకు తరలించి నిలువచేసేవారు. చింతపండు నుండి గింజలను వేరుచేయడానికోసం (Deseeding process) కొట్లు పెట్టి ఎంతో మందికి, ముఖ్యంగా గ్రామీణ స్త్రీలకు ఉపాధి కల్పించారు. ఇలా పిక్క తీసిన చింతపండును తిరిగి వెదురు బుట్టలలో గోదావరి జిల్లాలకు లేదా మధురై మొదలైన ప్రాంతాలకు లారీల ద్వారా ఎగుమతి చేశేవారు.
పోతుబరి పెదనారాయణ
సాలూరు కోటలో రాజ వైద్యునిగా పనిచేసేవారు. రాజుల వద్ద పనిచేసే కాలంలో నయం కాని ఎన్నో రోగాలను తన వైద్యంతో తరిమికొట్టేవారు. సాలూరుపట్టణం లో మరియు కోటలో ఎన్నో నారాయణ సంకీర్తనలు, భజనలు చేసేవారు. వీరి కుమారుడు పోతుబరి విష్ణు మూర్తి గారు కూడా ఎన్నో సంఘ సేవా కార్యక్రమాలు చేబట్టేవారు. అందులో భాగంగానే అతను మరియు కొంతమంది ప్రముఖుల సహాయంతో ఎంతో మంది అనాధలకు ఉండడానికి ఒక అనాధ సంఘం నిర్మించారు. అనాధ సంఘం నిర్వహించడానికి ప్రతి రోజు బిక్షాటన చేసేవారు. శ్రీమన్నారయునిని ఎంతగానో కొలిచేవారు. కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఒక చిన్న గుమస్తాగా పని చేస్తూ నలుగురికి ఉపయోగపడేలా ఏదో ఒక మంచి పని చేబట్టేవారు. ఈయన కుమారుడు పోతుబరి అప్పలసుర్యనారాయణ (భావాజీ )గారు కూడా ఆయుర్వేదం విద్య అభ్యసించి చిన్న పిల్లలకు వచ్చే భాలగ్రహాలు, అన్నిరకముల ఆయుర్వేద మందులు విక్రయించేవారు. శ్రీ భుజంగరావు వైద్యశాల అనే ఒక ఆయుర్వేద ఆసుపత్రి ని నడిపేవారు. ఎంతోమంది చిన్నపిల్లలకు నయం కాని రోగాలను కూడా నయం చేసేవారు. పోతుబరి వారు అంటే సాలురులో మోతుబరులు. ఇప్పటికీ చిన్నపిల్లలకు వైద్యం వారి భార్య పోతుబరి మంగయమ్మ గారు చేస్తున్నారు .
పవిత్ర స్థలాలు
- పంచ ముఖేశ్వరాలయం :
- జగన్నాథస్వామి గుడి
- కన్యకా పరమేశ్వరి గుడి
- శ్యామలాంబ గుడి
- ముత్యాలమ్మ తల్లి గుడి
- వేణు గోపాలస్వామి గుడి
- శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం(తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధం)
- శ్రీ రామాలయం
- అయ్యప్ప స్వామి ఆలయం
- శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం
- శ్రీ బంగారమ్మతల్లి గుడి
- శ్రీ సాయిరామ్ గుడి
- శ్రీ కోట దుర్గ దేవి గుడి
- శ్రీ పోతులూరు వీరబ్రహ్మం గారి గుడి
- శ్రీ కొత్తమ్మ తల్లి వనం
- శ్రీ నూకాలమ్మ తల్లి గుడి
- కోట లోపల కొలువున్న సర్వమంగాలా దేవి
- శ్రీ సత్తమ్మ తల్లి గుడి
- శ్రీ దేశమ్మ తల్లి గుడి
- శ్రీ పర దేశమ్మ తల్లి గుడి
- శ్రీ పైడితల్లి అమ్మవారి గుడి
- శ్రీ గంగమ్మ తల్లి గుడి
- శ్రీ లక్ష్మి పేరంటాల గుండం
- శ్రీ సత్యసాయి బాబా ధ్యాన మందిరం
- శ్రీ కల్కి భగవాన్ మందిరం
క్రైస్తవ దెవాలయాలు
- రోమను కేథలిక్ చర్చి
- St. పాల్ లుథర్న్ చర్చి
- ది లివింగ్ చర్చ్ ఆఫ్ ఇండియా
- ఆబ్బాఫాధర్ బైబిల్ బిలీవియర్స్
- పెనూయోలు ప్రార్దన మందిరం
మండలంలోని పట్టణాలు
- సాలూరు