తిరుమల తిరుపతి దేవస్థానం: కూర్పుల మధ్య తేడాలు
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7809337 (translate me) |
|||
పంక్తి 54: | పంక్తి 54: | ||
* కల్యాణోత్సవం |
* కల్యాణోత్సవం |
||
* '''<font><font color="#ff0000"><font>రెండో అన్నదాన సత్రం</font></font></font>''' |
* '''<font><font color="#ff0000"><font>రెండో అన్నదాన సత్రం</font></font></font>''' |
||
ప్రస్తుతం కల్యాణకట్ట ఎదురుగా ఉన్న అన్నదాన సత్రంలో |
ప్రస్తుతం కల్యాణకట్ట ఎదురుగా ఉన్న అన్నదాన సత్రంలో 1000 మంది మాత్రమే భోజనం చేసే సౌకర్యం ఉంది. తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ రద్దీని తట్టుకునేందుకు వరాహస్వామి అతిథిగృహం సమీపంలో రెండో అన్నదాన సత్రాన్ని నిర్మించేందుకు సమాయత్తమైంది పద్దతి. అలాగే అన్నదానానికి గతంలో ఉన్న టోకెన్ పద్ధతిని ఎత్తివేస్తూ ఇటీవల ప్రారంభించిన సర్వభోజనం పథకం భక్తుల ప్రస0సలు అ0దుకు0టు0ది |
||
***సామాజికసేవ*** |
|||
* విద్యాభివృద్ధి కోసం తిరుపతిలో ప్రాచ్య పరిశోధనా సంస్థ, |
* విద్యాభివృద్ధి కోసం తిరుపతిలో ప్రాచ్య పరిశోధనా సంస్థ, |
||
* ఎస్వీ ఆర్ట్స్ కళాశాల |
* ఎస్వీ ఆర్ట్స్ కళాశాల |
||
పంక్తి 63: | పంక్తి 63: | ||
* కుష్టురోగుల ఆసుపత్రి |
* కుష్టురోగుల ఆసుపత్రి |
||
* తిరుమలలో అశ్వని ఆసుపత్రిని నిర్మించారు<br /> |
* తిరుమలలో అశ్వని ఆసుపత్రిని నిర్మించారు<br /> |
||
[[ |
[[ఇమెజ్:టిటిడికళ్యాణమస్తుthumb|widthpx|కల్యాణమస్తు:పేద జంటలకు ఉచితంగా కల్యాణం జరిపించటం]]అరిపించింది టీటీడీ. వధూవరులకు నూతన వస్త్రాలూ మంగళసూత్రాలూ ఇచ్చి జరిపిస్తున్న ఇలాంటి కార్యక్రమం ఆలయాల చరిత్రలోనే ప్రధమం. |
||
'''కల్యాణమస్తు''' :ఇప్పటివరకు మూడు విడతల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 20వేల జంటలకు వివాహాలు జరిపించింది టీటీడీ. వధూవరులకు నూతన వస్త్రాలూ మంగళసూత్రాలూ ఇచ్చి జరిపిస్తున్న ఇలాంటి కార్యక్రమం ఆలయాల చరిత్రలోనే ప్రధమం. |
|||
[[Image:TTD_dalitagovindam.jpg|thumb|widthpx|స్వామి దళిత వాడవాడలా పర్యటించే అపురూప దృశ్యం ]] |
[[Image:TTD_dalitagovindam.jpg|thumb|widthpx|స్వామి దళిత వాడవాడలా పర్యటించే అపురూప దృశ్యం ]] |
||
* '''<font><font color="#000000"><font>దళిత గోవిందం</font></font></font>''' : స్వామి చెంతకు చేరుకోలేని వారందరికోసం ఆయనే వాడవాడలా పర్యటించే అపురూపదృశ్యం. |
* '''<font><font color="#000000"><font>దళిత గోవిందం</font></font></font>''' : స్వామి చెంతకు చేరుకోలేని వారందరికోసం ఆయనే వాడవాడలా పర్యటించే అపురూపదృశ్యం. |
10:16, 21 జనవరి 2014 నాటి కూర్పు
తిరుమల తిరుపతి దేవస్థానము (ఆంగ్లం: Tirumala Tirupati Devasthanams or TTD), ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆలయమైన తిరుమల వెంకటేశ్వరుని ఆలయాన్ని నిర్వహించే ఒక స్వతంత్ర సంస్థ. ఇది దేవాలయం యొక్క బాగోగులు చూడడమే కాక వివిధ సామాజిక, ధార్మిక, సాంస్కృతిక, సాహిత్య, విద్యా సంభందమైన కార్యక్రమాలను భారతదేశం నలువైపులా నిర్వహిస్తుంటుంది. 1933లో టీటీడీ పాలకమండలి ఏర్పాటైంది.[1] ప్రపంచములోనే అత్యంత ధనిక హిందు ఆలయ పాలకమండలి.రూ.1925 కోట్ల వార్షిక బడ్జెట్, వేలాది సిబ్బంది, సామాజికసేవ, కల్యాణమస్తు, దళితగోవిందం లాంటి ఎన్నెన్నో బృహత్తర కార్యక్రమాల నిర్వహణ... వెరసి అదొక మహావ్యవస్థ. ఇందులో సుమారు 14,000 మంది ఉద్యోగులు ఉంటారు. వీరు దేవస్థానం నిర్వహించే 12 ఆలయాలను, ఇతర కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు.
ఇది వాటికన్ తరువాత అత్యధిక ఆర్థిక వనరులు కలిగిన సంస్థ. స్వామి వారి ఆభరణాల నిర్వహణకు బొక్కసం సెల్ను తితిదే ఏర్పాటు చేసింది. సహాయ కార్యనిర్వాహణాధికారి పర్యవేక్షణలో ఇది కొనసాగుతుంది. ఆభరణాల కోసం తితిదే 19 రికార్డులను నిర్వహిస్తోంది.[2]
స్థాపన
ధర్మకర్తల మండలి: తిరుమల ఆలయ పాలనా బాధ్యతలు నిర్వర్తించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 1933లో... కమిషనర్ల నేతృత్వంలో నడిచే పాలకమండలి వ్యవస్థను ఏర్పాటు చేసింది. మళ్లీ 1951లో చేసిన హిందూ మత చట్టం ప్రకారం కమిషనర్లందరినీ కార్యనిర్వాహక అధికారులు (ఈవో)గా మార్చింది. అంతేకాదు, తితిదేకు ఓ ధర్మకర్తల మండలిని ఏర్పాటుచేసి దానికి అధ్యక్షుడిని కూడా నియమించారు. ధర్మకర్తల మండలి పర్యవేక్షణలో ఈవో ఆలయ పరిపాలన నిర్వహిస్తారని చట్టంలో పేర్కొన్నారు.
తితిదే పాలక మండలి ఏర్పాటైన తర్వాత ఏడున్నర దశాబ్దాల్లో తిరుమల అంతటా సర్వతోముఖాభివృద్ధి జరిగింది. భక్తుల సౌలభ్యం కోసం రూ.26 వేల ఖర్చుతో మెట్ల మార్గాన్ని నిర్మించడంతో ఆ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది మండలి. వారు తలపెట్టిన రెండో ప్రాజెక్టు ఘాట్ రోడ్డు.
అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలూ పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో ఇన్ని కార్యక్రమాలను చేపట్టి విజయవంతం చేసిన ఘనత తొలి ఈ.వో. చెలికాని అన్నారావుదే[1]
నిర్మాణాలు నిర్వహణ
- భక్తుల సౌలభ్యం కోసం రూ.26 వేల ఖర్చుతో మెట్ల మార్గాన్ని నిర్మించడం
- ఘాట్ రోడ్డు : 1944 ఏప్రిల్ పది నాటికి మెలికలు తిరిగే అందమైన రోడ్డు సిద్ధమైంది.
- కొండమీదకు బస్సు : ఘాట్రోడ్డు పుణ్యమాని 1956 నాటికి భక్తుల సంఖ్య ఐదారు రెట్లు పెరిగి ఐదారొందలకు చేరుకుంది.
- శ్రీవారి ఆలయంలో పరకామణి వ్యవహారాలను క్రమబద్ధీకరించి రోజూ హుండీ ఆదాయాన్ని లెక్కించే విధానాన్ని ప్రవేశపెట్టారు
- దాతల భాగస్వామ్యంతో అనేక కాటేజీలు నిర్మాణం.
- 1978 నాటికి రెండో ఘాట్ రోడ్డు పనులు కూడా ప్రారంభమయ్యాయి.
- 1978 - 82 కాలంలో కార్యనిర్వహణాధికారిగా ఉన్న పీవీఆర్కే ప్రసాద్ అభివృద్ధి కార్యక్రమాల్ని మరింత వేగవంతం చేశారు.
- తిరుమల ఆలయ ధ్వజస్తంభాన్ని పునరుద్ధరించడం,
- మాడవీధులను విస్తరించడం,
- అన్నదాన భవన నిర్మాణం
- ఎందరికో ఉపాధినిచ్చిన అన్నమాచార్య, దాససాహిత్య, వేదరికార్డింగ్ ప్రాజెక్టులను నెలకొల్పడం
- కోకిలమ్మ ఎం.ఎస్. సుబ్బులక్ష్మి ఆలపించిన వెంకటేశ్వర సుప్రభాతం నేల నలుచెరగులా వినిపించింది అప్పుడే.
1983లో ఎన్టీ.రామారావు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన తిరుమల-తిరుపతికి ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడంతో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కింది. ఆయన హయాంలోనే
- వైకుంఠం క్యూకాంప్లెక్స్ నిర్మించారు
- ఉచిత అన్నదాన పథకాన్ని ప్రారంభించారు
- తిరుమలలో మిరాశీ వ్యవస్థను రద్దుచేశారు[1]
- కల్యాణకట్టలో ఉచితంగా తలనీలాలు తీసే విధానాన్ని ప్రవేశపెట్టారు
- తిరుమలలో అధునాతన రోడ్లను నిర్మించారు.
- కాలినడకమార్గాన్ని ఆధునీకరించి పూర్తిగా పైకప్పు వేయించారు.
- తిరుమలకు తెలుగు గంగ నీటిని తరలించారు.[1]
- కొండమీద విద్యుత్తుకోత లేకుండా విధాన నిర్ణయం తీసుకున్నారు
- తితిదే ఆధ్వర్యంలో తిరుపతిలో సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి స్విమ్స్ నిర్మించారు[1]
- ఎముకల సంబంధ వ్యాధుల ఆసుపత్రి బర్డ్.
- శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం[1]
- మహతి సభా మందిరం నిర్మించారు
కార్యక్రమాలు
- నల్లరాతిశోభతో మెరిసే తిరుమల ఆలయానికి బంగారుపూతతో పసిడి వన్నెలద్దింది
- తిరుమలలో పలుప్రాంతాల్లో ప్రైవేటు క్షురకులు తలనీలాలు తీసేవారు. ఆ పద్ధతికి స్వస్తి చెప్పి వారికంటూ ఓ సంఘాన్ని ఏర్పాటు చేసి ఒకేచోట తలనీలాలు తీసే విధానాన్ని అమలులోకి తెచ్చారు.
- శ్రీవారి బ్రహ్మోత్సవాలను దేశవ్యాప్తంగా ఉన్న అశేషభక్తులకు నేత్రపర్వం కలిగించేలా 1995లో దూరదర్శన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు
- 1999 - 2000 నడుమ తిరుమలేశుని దర్శన విధానంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. శ్రీవారి సులభ దర్శనం కోసం 'సుదర్శనం కంకణాల' విధానానికి రూపకల్పనచేసి అమల్లోకి తెచ్చిందప్పుడే. ఈ విధానం వల్ల భక్తులకు రోజుల తరబడి క్యూలైన్లలో పడిగాపులు పడాల్సిన అగత్యం తప్పింది.[1]
- శ్రీవారి కోసమే ప్రత్యేకంగా ఓ ఛానెల్ను ప్రారంభించింది తితిదే. అదే శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ) ఈ ఛానెల్ ద్వారా 2008-జూన్ నుంచే ప్రసారాలు ప్రారంభమై భక్తులను ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడిస్తున్నాయి[1]
సేవలు
- ఆర్జితసేవలు
- సుప్రభాతం సేవ
- అర్చన
- తోమాల సేవ
- అభిషేకం
- కల్యాణోత్సవం
- రెండో అన్నదాన సత్రం
ప్రస్తుతం కల్యాణకట్ట ఎదురుగా ఉన్న అన్నదాన సత్రంలో 1000 మంది మాత్రమే భోజనం చేసే సౌకర్యం ఉంది. తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ రద్దీని తట్టుకునేందుకు వరాహస్వామి అతిథిగృహం సమీపంలో రెండో అన్నదాన సత్రాన్ని నిర్మించేందుకు సమాయత్తమైంది పద్దతి. అలాగే అన్నదానానికి గతంలో ఉన్న టోకెన్ పద్ధతిని ఎత్తివేస్తూ ఇటీవల ప్రారంభించిన సర్వభోజనం పథకం భక్తుల ప్రస0సలు అ0దుకు0టు0ది
- సామాజికసేవ***
- విద్యాభివృద్ధి కోసం తిరుపతిలో ప్రాచ్య పరిశోధనా సంస్థ,
- ఎస్వీ ఆర్ట్స్ కళాశాల
- సంగీత, నృత్య కళాశాల
- బధిరుల పాఠశాల
- రుయా ఆసుపత్రి
- కుష్టురోగుల ఆసుపత్రి
- తిరుమలలో అశ్వని ఆసుపత్రిని నిర్మించారు
widthpx|కల్యాణమస్తు:పేద జంటలకు ఉచితంగా కల్యాణం జరిపించటంఅరిపించింది టీటీడీ. వధూవరులకు నూతన వస్త్రాలూ మంగళసూత్రాలూ ఇచ్చి జరిపిస్తున్న ఇలాంటి కార్యక్రమం ఆలయాల చరిత్రలోనే ప్రధమం.
- దళిత గోవిందం : స్వామి చెంతకు చేరుకోలేని వారందరికోసం ఆయనే వాడవాడలా పర్యటించే అపురూపదృశ్యం.
- మత్స్యగోవిందం : మత్స్యకారులకు వైదిక కర్మల్లో శిక్షణనిచ్చి సర్వమానవ సమానత్వాన్ని చాటుతోంది.
- పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన వెయ్యి మంది పేద విద్యార్థులకు నెలకు రూ.300 చొప్పున ఉపకార వేతనాలు ఇవ్వాలనేది ఇటీవల తీసుకున్న నిర్ణయం.
- రైలుగోవిందం
బాలాజీ దర్శన గోవిందం... తితిదే-,భారత రైల్వే ఆహార, పర్యాటక సంస్థ(ఐఆర్సిటిసి) నడుమ కుదిరిన ఒక ప్యాకేజీ ఒప్పందం పేరిది. ఈ పథకంలో భాగంగా వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది తితిదే. శ్రీనివాసం విడిదిగృహంలో బస నుంచి అర్చనానంతర, సెల్లార్ దర్శన టిక్కెట్ల వరకూ అన్నీ చక్కగా అమరుస్తోంది..
విజయవాడ నుంచి... విజయవాడ నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం కృష్ణా ఎక్స్ప్రెస్లో ప్రయాణం మొదలవుతుంది. గూడూరులో భోజనం. రాత్రి తిరుపతిలోని శ్రీనివాసం విడిదిగృహంలో బస. మర్నాడు తెల్లవారుజామున నాలుగింటికి కొండపైకి తీసుకెళ్లి అర్చనానంతర దర్శనం చేయిస్తారు. అనంతరం శ్రీకాళహస్తి, అలివేలు మంగాపురం ఆలయాల సందర్శన. మధ్యాహ్న భోజనం అయ్యాక శ్రీనివాస మంగాపురం, కాణిపాకం క్షేత్రాల్లో దర్శనం. చంద్రగిరి కోట సందర్శన. రాత్రికి మళ్లీ తిరుపతి శ్రీనివాసంలో బస. మర్నాడు తెల్లవారుజామునే విజయవాడకు తిరుగుప్రయాణం. ఉదయం ఫలహారం, రెండుపూటలా భోజనం రైల్లోనే. థర్డ్క్లాస్ ఏసీ రుసుము పెద్దలకు రూ.2800, పిల్లలకు(5-11) రూ.2400. స్లీపర్క్లాస్లో అయితే పెద్దలకు రూ.2100, పిల్లలకు రూ.1950.
సికింద్రాబాద్ నుంచి... వారాంతాల్లో తిరుమలలో సెల్లార్ దర్శనం ఉండదు కాబట్టి సికింద్రాబాద్ నుంచి వారానికి ఐదురోజులు మాత్రమే ఈ ప్యాకేజీ ఉంటుంది. ఆదివారం నుంచి గురువారం వరకూ. ఈ ఐదురోజుల్లో రోజూ రాత్రి ఎనిమిదింటికి నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో ప్రయాణం మొదలవుతుంది. మర్నాడు పొద్దున్న ఆరింటికి తిరుపతికి చేరాక శ్రీనివాసంలో బస, ఫలహారం. అక్కణ్నుంచి కొండమీదకు తీసుకెళ్లి సెల్లార్ దర్శనం చేయిస్తారు. కొండ దిగాక మధ్యాహ్నభోజనం. అనంతరం అలివేలుమంగాపురంలో అమ్మవారి దర్శనం. సాయంత్రం మళ్లీ నారాయణాద్రిలోనే తిరుగు ప్రయాణం. ఆ రాత్రికి భోజనం రైల్లోనే. థర్డ్క్లాస్ ఏసీ రుసుము పెద్దలకు రూ.3,400, పిల్లలకు రూ.2,400. స్లీపర్క్లాస్లో పెద్దలకు రూ.2,000, పిల్లలకు రూ.1,600.
కల్యాణమస్తు
2006 వ సంవత్సరంలో బోర్డు ఛైర్మన్ కరుణాకర్రెడ్డి ఈ పథకానికి రూపకల్పన చేశారు. 2007 ఫిబ్రవరి 21 న దీనికి రాష్ట్ర వ్యాప్తంగా అంకురార్పణ జరిగింది.సరాసరి ఒక్కో జంటకు రూ 7 వేల వరకు వ్యయం అవుతున్నది.ఇప్పటివరకూ 34,017 జంటలను ఒక్కటి చేసిన టిటిడికి అయిన ఖర్చుసుమారు 24 కోట్ల రూపాయలు.స్వామిని దర్శించి,ముడుపులు చెల్లించే వారిలో తమిళనాడు, కర్నాటక, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారుకూడా ఉన్నారు కనుక కళ్యాణమస్తును దేశ వ్యాపితం చేయాలని కొందరు వాదిస్తున్నారు.బంగారపు తాళిబొట్టు, వెండి మట్టెలు, వధూవరులకు నూతన వస్త్రాలు, తలంబ్రాలు, పెళ్లిసామాగ్రి, మంగళ వాయిద్యాలు, ధార్మిక స్తోత్ర పుస్తకాలు, పురోహితుడు, 60 మంది బంధుమిత్రులకు పెళ్లి భోజనాలు ఉచితంగా కల్పిస్తున్నది.వివాహాలు జరిపించలేని పేద, మధ్య తరగతి కుటుంబాలవారు , తల్లిదండ్రులు లేని అనాథలుకూడా ఈ కార్యక్రమంవల్ల లబ్దిపొందుతున్నారు.కానీ చౌకగా జరిగే ఇలాంటి మూకుమ్మడి కళ్యాణాలకు గౌరవంతక్కువ అనే భావంతో ప్రజలనుండి తగినంత స్పందన లేదు.రాష్ట్ర వ్యాపితంగా ఈ కార్యక్రమాన్నిఏడాది పొడవునా కాకుండా ఏడాదికి ఒక్క రోజుమాత్రమే చేపట్టటంతో నిరాశ చెందుతున్నారు.గోదాదేవి లాగానే బీబీ నాంచారి అనే ముస్లిం స్త్రీ కూడా విష్ణుపత్నిగా ఆరాధించ బడుతుంది.వెంకటేశ్వరుడు లౌకికవాదానికి ప్రతీకగా మారి మతాంతర వివాహాలు కు మార్గం సుగమం చేసి మార్గదర్శకుడయ్యాడని సుబ్బన్న శతావధాని చెప్పారు.[3]శ్రీవేంకటేశ్వరుని పై భక్తి విశ్వాసాలున్న హిందూ-ముస్లిము జంటలకు కూడా కళ్యాణమస్తు కార్యక్రమం విస్తరించి మత సామరస్యం ,లౌకికత్వం బలపడేలా చెయ్యాలని వేంకటేశ్వరుని పై భక్తి విశ్వాసాలున్నముస్లిములు కోరుతున్నారు.
ఇవికూడా చూడండి
బయటి లింకులు
- భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ లో బుకింగ్ కోసం తి.తి.దే ఏర్పాటు చేసిన వెబ్సైటు
- భక్తుల సౌకర్యార్థం ప్రతి రోజు మొబైల్ సమాచారము వెబ్సైటు