అయ్యంకి వెంకటరమణయ్య: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
చి వర్గం:గ్రంథాలయోద్యమ నేతలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 24: | పంక్తి 24: | ||
[[వర్గం:1979 మరణాలు]] |
[[వర్గం:1979 మరణాలు]] |
||
[[వర్గం:సంపాదకులు]] |
[[వర్గం:సంపాదకులు]] |
||
[[వర్గం:గ్రంథాలయోద్యమ నేతలు]] |
08:08, 9 మార్చి 2014 నాటి కూర్పు
అయ్యంకి వెంకట రమణయ్య (1890-1979) గ్రంథాలయోద్యమకారుడు మరియు పత్రికా సంపాదకుడు. ఈయన గ్రంథాలయ ఉద్యమంలో జీవితాంతం (అరవై సంవత్సరాలు) విశేష కృషి సల్పి గ్రంథాలయ పితామహుడుగా పేరుగాంచాడు.
ఆయనతూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా కొంకుదురు గ్రామంలో ఆగష్టు 7, 1890 సంవత్సరంలో జన్మించాడు. వీరి తల్లిదండ్రులు వెంకటరత్నం మరియు మంగమాంబ. నరసాపురం టైలరు ఉన్నత పాఠశాలలో చదువుతున్న రోజులలో బిపిన్ చంద్ర పాల్ ఉపన్యాసాలను విని ఉత్తేజితుడై ప్రజారంగంలోనికి ప్రవేశించాడు.
గ్రంథాలయోద్యమం
1911లో విజయవాడలో రామమోహన గ్రంథాలయ స్థాపనకు తోడ్పడ్డాడు. 1914లో విజయవాడలో ఆంధ్రదేశ గ్రంథ భాండాగార, ప్రతినిధుల గ్రంథాలయ మహాసభలు జరిపి భారతదేశంలో తొలిసారిగా గ్రంథాలయ సంఘాన్ని, 1915లో సంఘ పక్షాన గ్రంథాలయ సర్వస్వం' పత్రికను స్థాపించడానికి తోడ్పడ్డారు. 1919లో అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘాన్ని స్థాపించి, 1924లో ఆ సంఘ పక్షాన 'ఇండియన్ లైబ్రరీ జర్నల్' అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించాడు. వీరు ఈ సంఘాన్ని స్థాపించిన రోజును 'నేషనల్ లైబ్రరీ డే'గా భారత గ్రంథాలయ సంస్థ గుర్తించి దేశమంతటా 1968 నుంచి ప్రతి సంవత్సరం జాతీయ గ్రంథాలయ వారోత్సవము ('నేషనల్ లైబ్రరీ వీక్ ') ను నిర్వహిస్తుంది.
1934-1948 మధ్యకాలంలో గ్రంథాలయ యాత్రలను అపూర్వమైన స్థాయిలో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో కార్యదర్శులు నిర్వహించారు. వీని మూలంగా వందల సంఖ్యలో కొత్త గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. మూసివేసినవి పునరుద్ధరించబడ్డాయి. 1920, 1934లలో గ్రంథాలయ కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆంధ్రదేశంలోని ప్రతి గ్రామం పర్యటించాడు.
గౌరవాలు
- గ్రంథాలయ విశారద, గ్రంథాలయ పితామహ, గ్రంథాలయోద్ధారక, సరస్వతీ సామ్రాజ్య ప్రతిష్ఠాపనాచార్య.
- భారత ప్రభుత్వం 1972 లో పద్మశ్రీ గౌరవాన్నిచ్చింది.
- ఆంధ్రవిశ్వ కళాపరిషత్తు గ్రంథాలయ శాస్త్ర పరీక్షలో ఉత్తమ విద్యార్థికి వీరి పేరుతో స్వర్ణ పతకం ఇస్తుంది.
- 1979లో అయ్యంకి లైబ్రరీ కమిటీ ఏర్పడి ప్రతి సంవత్సరం ఉత్తమ గ్రంథాలయ కార్యకర్తను సత్కరిస్తోంది.
మూలాలు
అయ్యంకి వెంకట రమణయ్య పల్లెలలో పఠనాశక్తి పెంపొందుచుటకు చేసిన కృషి వ్యాసం