పరవస్తు చిన్నయ సూరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7136257 (translate me)
పంక్తి 39: పంక్తి 39:


==మూలాలు==
==మూలాలు==
* ఆంధ్ర రచయితలు - [[మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి]], [[అద్దేపల్లి అండ్ కొ]], రాజమహేంద్రవరం, 1950.
* [[ఆంధ్ర రచయితలు]] - [[మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి]], [[అద్దేపల్లి అండ్ కొ]], రాజమహేంద్రవరం, 1950.
* శ్రీ పరవస్తు చిన్నయసూరి జీవితము - [[నిడుదవోలు వేంకటరావు]], [[వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్]], చెన్నపురి, 1953.
* శ్రీ పరవస్తు చిన్నయసూరి జీవితము - [[నిడుదవోలు వేంకటరావు]], [[వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్]], చెన్నపురి, 1953.
* పరవస్తు చిన్నయసూరి - [[బూదరాజు రాధాకృష్ణ]] (ఆంగ్లములో) (1995) సాహిత్య ఆకాడెమీ.
* పరవస్తు చిన్నయసూరి - [[బూదరాజు రాధాకృష్ణ]] (ఆంగ్లములో) (1995) సాహిత్య ఆకాడెమీ.

06:40, 16 ఏప్రిల్ 2014 నాటి కూర్పు

పరవస్తు చిన్నయసూరి

పరవస్తు చిన్నయ సూరి (1809-1861) ప్రసిద్ధ తెలుగు రచయిత. గొప్ప పండితుడు. ఇతడు తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాలోని పెరంబూరులో జన్మించాడు. మద్రాసు ప్రభుత్వ (పచ్చాయప్ప) కళాశాలలో తెలుగు బోధకుడు. తను జీవితాంతం తెలుగు భాషాభ్యుదయానికి, తెలుగు సాహిత్యానికి పాటుబడ్డాడు. "పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ" అనే లోకోక్తి ఉంది. అప్పటి విశ్వవిద్యాలయ కార్యదర్శి ఎ. జె. ఆర్బత్నాట్ కాశీ నుండి తర్కమీమాంస పండితులను రప్పించి, చిన్నయను పరీ‍క్ష చేయించి, సమర్థుడని గుర్తించి, "చిన్నయసూరి" అనే అక్షరాలతో స్వర్ణకంకణాన్ని సీమ నుండి తెప్పించి బహుమతిగా ఇచ్చాడు.[1] సూరి అనగా పండితుడు అని అర్థం.

చిన్నయ చాలా తరాలకు పూర్వం ఉత్తర ఆంధ్రప్రదేశ్ నుండి మద్రాసు వలసవెళ్ళిన వైష్ణవ కుటుంబములో జన్మించాడు. వీరి పూర్వీకులు పరవస్తు మఠం శిష్యులు. వీరు సాతాని కులానికి చెందినా బ్రాహ్మణ ఆచారవ్యవహారాలు పాటించేవారు. తాము ఆపస్తంబ సూత్రానికి, గార్గేయ గోత్రానికి చెందిన యజుశ్శాఖాధ్యాయులమని చెప్పుకున్నారు. చిన్నయ 1809 (ప్రభవ)లో జన్మించాడు. కానీ కొందరు పండితులు ఈయన 1806లో జన్మించాడని భావిస్తున్నారు..

చిన్నయ తండ్రి వెంకటరంగ రామానుజాచార్యులు తిరువల్లిక్కేని (ట్రిప్లికేన్) లోని రామానుజమఠంలో మతాధికారి. చిన్నయ తండ్రి సంస్కృత, ప్రాకృత, తెలుగు మరియు తమిళాలలో మంచి పండితుడు. అక్కడే ఈయన్ను ప్రతివాదభయంకరం శ్రీనివాసాచార్యులనే వైష్ణవ పండితుడు చూసి రామానుజాచార్యుల జన్మస్థానమైన శ్రీపెరంబుదూరులోని ఆలయంలో వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేసేందుకు ఆహ్వానించాడు. పండు ముదుసలి వయసు వరకు ద్రవిడవేదాన్ని పారాయణం చేస్తూ, మతాధికారిగా కార్యాలు నిర్వహిస్తూ ఇక్కడే నివసించాడు. ఈయన 1836లో నూటపదేళ్ళ వయసులో మరణించాడు.

వెంకటరంగ రామానుజాచార్యులుకు ఒక చిన్న వయసులోనే విధవరాలైన కూతురు, ఆమె కంటే చిన్నవాడైన చిన్నయ, ఇరువురు సంతానము. చిన్నయను గారాబంగా పెంచటం వలన 16 యేళ్ళ వయసు వరకు చదువుసంధ్యలను పట్టించుకోలేదు.


రచనలు

Notes

  1. మధునాపంతుల 1950

మూలాలు

బయటి లింకులు