కాజోల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 24: పంక్తి 24:


1994లో 'ఉదార్ మే జిందగీ' అనే చిత్రంలో జితేంద్రకి మనవరాలిగా నటించింది. ఈ చిత్రం తెలుగులో విజయవంతమైన '[[సీతారామయ్యగారి మనవరాలు]]'కి రీమేక్‌గా తెరకెక్కింది. ఆదరణకు మాత్రం నోచుకోలేదు. ఆ వెంటనే యశ్‌రాజ్ ఫిల్మ్స్‌లో 'యే దిల్లగీ' చేసింది. [[అక్షయ్‌కుమార్]], [[సైఫ్ అలీఖాన్]] సరసన నటించింది. 1995లో 'కరణ్ అర్జున్', '[[దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే']] చిత్రాలు చేశాక ఇక కాజోల్‌కి వెనుదిరిగి చూసుకొనే అవకాశం రాలేదు. ఆ చిత్రాలు సంచలన విజయాలు సొంతం చేసుకోవడంతో కాజోల్ పేరు మార్మోగిపోయింది.
1994లో 'ఉదార్ మే జిందగీ' అనే చిత్రంలో జితేంద్రకి మనవరాలిగా నటించింది. ఈ చిత్రం తెలుగులో విజయవంతమైన '[[సీతారామయ్యగారి మనవరాలు]]'కి రీమేక్‌గా తెరకెక్కింది. ఆదరణకు మాత్రం నోచుకోలేదు. ఆ వెంటనే యశ్‌రాజ్ ఫిల్మ్స్‌లో 'యే దిల్లగీ' చేసింది. [[అక్షయ్‌కుమార్]], [[సైఫ్ అలీఖాన్]] సరసన నటించింది. 1995లో 'కరణ్ అర్జున్', '[[దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే']] చిత్రాలు చేశాక ఇక కాజోల్‌కి వెనుదిరిగి చూసుకొనే అవకాశం రాలేదు. ఆ చిత్రాలు సంచలన విజయాలు సొంతం చేసుకోవడంతో కాజోల్ పేరు మార్మోగిపోయింది.

ప్రేమకథలకీ, కుటుంబ కథా చిత్రాలకే పరిమితమైపోతోంది. ఇతరత్రా కథలకు ఆమె న్యాయం చేయలేదేమో అనుకొంటున్న దశలోనే... కాజోల్ కీలకమైన నిర్ణయాలు తీసుకొంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలవైపు అడుగులేసింది. అందులో భాగంగా 'గుప్త్'లో నటించింది. ఆ చిత్రంలో వ్యతిరేక ఛాయలున్న పాత్ర పోషించింది. నటిగా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత మళ్లీ తనదైన శైలిలో అడుగులేస్తూ 'ప్యార్ కియా తో డర్నా క్యా', 'ప్యార్ తో హోనా హై తా', 'కుచ్ కుచ్ హోతా హై'లాంటి సినిమాలు చేసింది. మధ్యలో 'దుష్మన్' కూడా చేసింది. అందులో ద్విపాత్రాభినయంతో ఆకట్టుకొంది.
అటు నటన, ఇటు అందం... రెండింటికీ ప్రాధాన్యమిస్తూ ప్రయాణాన్ని కొనసాగించింది. వైవిధ్యమైన కథల్ని ఎంచుకొంటూ విజయాల్ని సొంతం చేసుకొంది. '[[కుచ్ కుచ్ హోతా హై]]' తర్వాత ఆమెకి సరైన సినిమాలు పడలేదు. 'కభీ ఖుషీ కభీ ఘమ్'తో మళ్లీ పుంజుకొంది. ఆ తర్వాత 'కల్ హో న హో', 'ఫనా', 'కభీ అల్విద న కెహనా', 'యు మి ఔర్ హమ్', 'రబ్ నే బనాదీ జోడీ', 'మై నేమ్ ఈజ్ ఖాన్' చిత్రాలు మళ్లీ మునుపటి కాజోల్‌ని గుర్తుకు తెచ్చాయి. వివాహానంతరం మధ్యలో ఆచితూచి సినిమాలు చేసింది. మంచి కథ దొరికినప్పుడు మాత్రం వదిలిపెట్టలేదు.


==వ్యక్తిగత జీవితము==
==వ్యక్తిగత జీవితము==

14:47, 22 మే 2014 నాటి కూర్పు

కాజోల్
2012 లో వోగ్ బ్యూటీ అవార్డ్స్ కార్యక్రమంలో కాజోల్
జననం
కాజోల్ ముఖర్జీ

(1974-08-05) 1974 ఆగస్టు 5 (వయసు 49)
వృత్తిసినీ నటి
క్రియాశీల సంవత్సరాలు1992–2001, 2006–2012
జీవిత భాగస్వామి
పిల్లలు2
తల్లిదండ్రులు

కాజోల్ ఒక భారతీయ సినీ నటి. ఎక్కువగా హిందీ చిత్రాలలో నటించింది. షారుక్ ఖాన్ మరియు కాజోల్ జోడీ బాలీవుడ్ లో హిట్ పెయిర్ గా ఖ్యాతిచెందింది.

నేపధ్యము

ఈవిడ తల్లి తనూజ. ప్రముఖ నటి. తండ్రి పేరు షోము ముఖర్జీ. ఆయన దర్శకనిర్మాత. ఇద్దరూ కూడా చిత్ర పరిశ్రమకు చెందినవారే కావడంతో... చిన్నప్పట్నుంచీ చుట్టూ సినిమా వాతావరణమే. కానీ తల్లిదండ్రులిద్దరూ ఎవరి పనులతో వాళ్లు బిజీగా ఉండటంతో ముంబైలోని పాంచ్‌గనిలో సెంట్ జోసెఫ్ కాన్వెంట్ బోర్డింగ్ స్కూల్‌లో చేర్పించారు. క్లాస్‌లో హెడ్‌గాళ్. చదువు కంటే ఇతర వ్యాపకాలపైనే ఆసక్తి. డ్యాన్స్ నేర్చుకొంది. ఫిక్షన్ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకొంది. అవే జీవితంలో ఎదిగేందుకు దోహదపడ్డాయని చెబుతుంటుంది. ఫిక్షన్ నవలలు చదవడం వల్ల కష్టాల్ని అలవోకగా అధిగమించానని చెబుతుంటుంది.

కాజోల్ తల్లిదండ్రులు మాత్రమే కాదు, వారి కుటుంబమంతా సినిమా పరిశ్రమలోనే ఉంది. నూతన్, శోభన్ సమర్థ్, రతన్ బాయి, జాయ్‌ముఖర్జీ, దేవ్‌ముఖర్జీ, శశిధర్ ముఖర్జీ... ఇలా కాజోల్ బంధువులంతా సినిమా పరిశ్రమలోనే ఉన్నారు. కాజోల్ కజిన్స్ కూడా సినీ పరిశ్రమలోనే కొనసాగుతున్నారు. రాణీముఖర్జీ, షర్వాణీ ముఖర్జీ, మోనిష్ భెల్, దర్శకుడు అయాన్‌ముఖర్జీ... ఇలా అందరూ కూడా పరిశ్రమలో రాణిస్తున్నారు. కాజోల్‌కి స్వయానా ఓ చెల్లి ఉంది. ఆమె పేరు తనీషా. తెలుగులోనూ నటించింది.

సినీరంగ ప్రవేశము

తల్లిదండ్రులిద్దరూ సినిమా పరిశ్రమకు చెందినవారు కావడంతో పదహారేళ్లకే తొలి అవకాశం వచ్చింది. రాహుల్ రవైల్ దర్శకత్వంలో 'బెఖుడి'లో నటించే అవకాశాన్ని సంపాదించింది. వేసవి సెలవులు కావడంతో స్కూల్‌కి ఇబ్బంది కలగకుండా సినిమా పూర్తి చేసింది. అయితే ఆ సినిమా పరాజయాన్ని చవిచూసింది. అయినా... కాజోల్ నటన, అందం చూసి అప్పటికే 'బాజీగర్' సినిమా కోసం ఎంపిక చేసుకొన్నారు. 1993లో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'బాజీగర్' వాణిజ్యపరంగా భారీ విజయాన్ని సొంతం చేసుకొంది. దీంతో బాలీవుడ్ దృష్టిలో పడింది. చదువులు పూర్తి కాకమునుపే స్కూల్‌కి గుడ్ బై చెప్పేసి పూర్తిస్థాయిలో సినిమాపై దృష్టిపెట్టింది.

1994లో 'ఉదార్ మే జిందగీ' అనే చిత్రంలో జితేంద్రకి మనవరాలిగా నటించింది. ఈ చిత్రం తెలుగులో విజయవంతమైన 'సీతారామయ్యగారి మనవరాలు'కి రీమేక్‌గా తెరకెక్కింది. ఆదరణకు మాత్రం నోచుకోలేదు. ఆ వెంటనే యశ్‌రాజ్ ఫిల్మ్స్‌లో 'యే దిల్లగీ' చేసింది. అక్షయ్‌కుమార్, సైఫ్ అలీఖాన్ సరసన నటించింది. 1995లో 'కరణ్ అర్జున్', 'దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే' చిత్రాలు చేశాక ఇక కాజోల్‌కి వెనుదిరిగి చూసుకొనే అవకాశం రాలేదు. ఆ చిత్రాలు సంచలన విజయాలు సొంతం చేసుకోవడంతో కాజోల్ పేరు మార్మోగిపోయింది.

ప్రేమకథలకీ, కుటుంబ కథా చిత్రాలకే పరిమితమైపోతోంది. ఇతరత్రా కథలకు ఆమె న్యాయం చేయలేదేమో అనుకొంటున్న దశలోనే... కాజోల్ కీలకమైన నిర్ణయాలు తీసుకొంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలవైపు అడుగులేసింది. అందులో భాగంగా 'గుప్త్'లో నటించింది. ఆ చిత్రంలో వ్యతిరేక ఛాయలున్న పాత్ర పోషించింది. నటిగా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత మళ్లీ తనదైన శైలిలో అడుగులేస్తూ 'ప్యార్ కియా తో డర్నా క్యా', 'ప్యార్ తో హోనా హై తా', 'కుచ్ కుచ్ హోతా హై'లాంటి సినిమాలు చేసింది. మధ్యలో 'దుష్మన్' కూడా చేసింది. అందులో ద్విపాత్రాభినయంతో ఆకట్టుకొంది.

అటు నటన, ఇటు అందం... రెండింటికీ ప్రాధాన్యమిస్తూ ప్రయాణాన్ని కొనసాగించింది. వైవిధ్యమైన కథల్ని ఎంచుకొంటూ విజయాల్ని సొంతం చేసుకొంది. 'కుచ్ కుచ్ హోతా హై' తర్వాత ఆమెకి సరైన సినిమాలు పడలేదు. 'కభీ ఖుషీ కభీ ఘమ్'తో మళ్లీ పుంజుకొంది. ఆ తర్వాత 'కల్ హో న హో', 'ఫనా', 'కభీ అల్విద న కెహనా', 'యు మి ఔర్ హమ్', 'రబ్ నే బనాదీ జోడీ', 'మై నేమ్ ఈజ్ ఖాన్' చిత్రాలు మళ్లీ మునుపటి కాజోల్‌ని గుర్తుకు తెచ్చాయి. వివాహానంతరం మధ్యలో ఆచితూచి సినిమాలు చేసింది. మంచి కథ దొరికినప్పుడు మాత్రం వదిలిపెట్టలేదు.

వ్యక్తిగత జీవితము

అభిరుచులు

బయటి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=కాజోల్&oldid=1156935" నుండి వెలికితీశారు