పరుగు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
Praveenbandela (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: చరవాణి సవరింపు |
||
పంక్తి 39: | పంక్తి 39: | ||
* చిత్రం శ్రీను .... శ్రీను |
* చిత్రం శ్రీను .... శ్రీను |
||
*[[శ్రీనివాస రెడ్డి]] |
*[[శ్రీనివాస రెడ్డి]] |
||
*[[దనరాజ్]] |
|||
* భాస్కర్ |
* భాస్కర్ |
||
06:31, 5 జూన్ 2014 నాటి కూర్పు
పరుగు (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | భాస్కర్ |
---|---|
నిర్మాణం | దిల్ రాజు |
రచన | భాస్కర్ |
తారాగణం | అల్లు అర్జున్ షీలా పూనమ్ బజ్వా ప్రకాష్ రాజ్ శ్రీనివాస రెడ్డి |
సంగీతం | మణిశర్మ |
ఛాయాగ్రహణం | విజయ్ చక్రవర్తి |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
పంపిణీ | గీతా ఆర్ట్స్ |
విడుదల తేదీ | మే 1, 2008 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పరుగు, 2008లో విడుదలైన ఒక తెలుగు సినిమా.
కథ
రామచంద్రాపురం లో నీలకంఠం (ప్రకాష్ రాజ్) ఇంటిలో అతని పెద్ద అమ్మాయి సుబ్బలక్ష్మి (పూనం బజ్వా) పెళ్ళి జరిగే సీనుతో చిత్రం మొదలవుతుంది. ఎర్రబాబుని ప్రేమించిన సుబ్బలక్ష్మి ఆ రోజే అతనితో లేచిపోతుంది. ఆగ్రహంతో ఎర్రబాబు స్నేహితులందరినీ కిడ్నాప్ చేయిస్తాడు నీలకంఠం. హైదరాబాదు లో సరదాగా కాలం గడిపే కృష్ణ (అల్లు అర్జున్) కూడా అతని స్నేహితుడే కావటంతో అతన్ని కూడా కిడ్నాప్ చేయిస్తాడు నీలకంఠం. అక్క పై ఉన్న కోపాన్ని మొత్తం ఇంటిల్లిపాదీ తన పైన చూపిస్తుండటంతో బాధ పడుతూ ఉంటుంది మీనా (షీలా దీక్షిత్).
ఒకరోజు తప్పించుకు పారిపోబోతున్న కృష్ణ కి మీనా కనిపిస్తుంది. తొలిచూపు లోనే మీనా ని ప్రేమిస్తాడు కృష్ణ. ఇంతలో నీలకంఠం మనుషులకు దొరికిపోతాడు. హైదరాబాదు లో పెద్ద కూతురు ఉంది అని తెలుసుకున్న నీలకంఠం చిన్న కూతురు ని వెంటబెట్టుకుని, కృష్ణ స్నేహితుల బృందంతో వెదికిస్తూ ఉంటాడు.
నీలకంఠానికి తన పెద్ద కూతురు కనిపించి, పారిపోయి వచ్చిన తమను కుక్కల్లా వెంటాడ వద్దని మందలిస్తుంది. ఆ మాటలకి బాధ పడ్డ నీలకంఠం, తన కూతుళ్ళు అంటే తనకి చాలా ప్రేమ అని, పరమ కోపిష్టి అయిన తాను తన కూతుళ్ళ కొరకే శాంత స్వభావాన్ని అలవర్చుకొన్నాడని కృష్ణ తో చెబుతాడు. పిల్లల పట్ల పెద్దలు ఎంత ప్రేమని పెంచుకొంటారో కృష్ణ అప్పుడు అర్థం చేసుకుంటాడు.
ఇంతకీ సుబ్బలక్ష్మి, ఎర్రబాబులకు సహాయపడినది ఎవరు? మీనా కూడా తనని ప్రేమిస్తోందని తెలుసుకున్న కృష్ణ ఏంచేసాడు? నీలకంఠం ను నొప్పించేలా మీనా తో పారిపోయాడా, లేక పిల్లల పై పెద్దల ప్రేమని అర్థం చేస్కొని తన ప్రేమని త్యాగం చేశాడా అన్నదే చిత్రంలోని తరువాతి కథ.
నటీనటులు
- అల్లు అర్జున్ .... కృష్ణ
- షీలా .... మీనా
- పూనమ్ బజ్వా .... సుబ్బలక్ష్మి
- ప్రకాష్ రాజ్ .... నీలకంఠ
- చిత్రం శ్రీను .... శ్రీను
- శ్రీనివాస రెడ్డి
- దనరాజ్
- భాస్కర్
పాటలు
పాట | గాయకులు | నిడివి | రచన | విశేషాలు |
---|---|---|---|---|
పరుగులు తీయకె పసిదానా | రంజిత్ | 04:20 | సిరివెన్నెల | |
నమ్మవేమో గానీ | సాకేత్ | 04:49 | అనంత్ శ్రీరాం | |
ఎలగెలగా | కైలాష్ ఖేర్, సైంధవి | 04:23 | అనంత్ శ్రీరాం | |
ఛల్ ఛల్ ఛలో | రంజిత్ | 04:37 | చంద్రబోస్ | |
హృదయం ఓర్చుకోలేనిదీ | హేమచంద్ర | 03:49 | సిరివెన్నెల | |
ఎన్నెన్నెన్నో ఊహలు | రాహుల్ నంబియార్ | 04:40 | అనంత్ శ్రీరాం |
విశేషాలు
- ఈ చిత్రం మలయాళ అనువాదం కృష్ణతో అల్లు అర్జున్ కేరళలో మూడు చిత్రాల విజయాన్ని కైవసం చేసుకున్నాడు. (దేశముదురు హీరో (2008) గా రెండవ చిత్రం, ఆర్య అదే పేరు ఆర్య (మలయాళం సినిమా)తో మొదటి చిత్రం.)
- బొమ్మరిల్లు చిత్రం లో 'పిల్లలకి స్వతంత్ర్యం ఉండాలి' అన్న సారాంశంతో కథని ఎంచుకొన్న భాస్కర్, తన రెండవ చిత్రంలోనే దానికి వ్యతిరేక అంశం అయిన 'పెద్దలని గౌరవించాలి' ని ఎంచుకోవటం ఒక ప్రయోగం.