Coordinates: 17°35′11″N 78°56′46″E / 17.58639°N 78.94611°E / 17.58639; 78.94611

యాదగిరిగుట్ట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
పంక్తి 2: పంక్తి 2:
|skyline = Yadagiri guTTa.jpg
|skyline = Yadagiri guTTa.jpg
|skyline_caption = యాదగిరిగుట్ట దేవాలయం
|skyline_caption = యాదగిరిగుట్ట దేవాలయం
| latd = 17
| latd = 17
| latm = 35
| latm = 35
| lats = 11
| lats = 11
| latNS = N
| latNS = N
| longd = 78
| longd = 78
| longm = 56
| longm = 56
| longs = 46
| longs = 46
| longEW = E
| longEW = E
|mandal_map=Nalgonda mandals outline04.png|state_name=తెలంగాణ|mandal_hq=యాదగిరిగుట్ట|villages=16|area_total=|population_total=52010|population_male=25960|population_female=26040|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=61.79|literacy_male=74.16|literacy_female=49.52|pincode = 508115}}
|mandal_map=Nalgonda mandals outline04.png|state_name=తెలంగాణ|mandal_hq=యాదగిరిగుట్ట|villages=16|area_total=|population_total=52010|population_male=25960|population_female=26040|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=61.79|literacy_male=74.16|literacy_female=49.52|pincode = 508115}}


పంక్తి 28: పంక్తి 28:
[[రాయగిరి]] రైల్వేస్టేషను ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది. యాదగిరి బస్టాండుకు [[హైద్రాబాదు]], [[వరంగల్]], నల్గొండల నుండి చాలా బస్సులు కలవు.హైదరాబాదు మహాత్మా గాంధీ ప్రయాణ ప్రాంగణము(ఎంజి.బి.ఎస్) నుండి యాదగిరిగుట్టకు ఉదయము గం.4.30 ని.ల కు మొదటి బస్సు కలదు.
[[రాయగిరి]] రైల్వేస్టేషను ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది. యాదగిరి బస్టాండుకు [[హైద్రాబాదు]], [[వరంగల్]], నల్గొండల నుండి చాలా బస్సులు కలవు.హైదరాబాదు మహాత్మా గాంధీ ప్రయాణ ప్రాంగణము(ఎంజి.బి.ఎస్) నుండి యాదగిరిగుట్టకు ఉదయము గం.4.30 ని.ల కు మొదటి బస్సు కలదు.
===తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ===
===తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ===
భువనగిరి డివిజన్ మొత్తానికి యాదగిరిగుట్టలోనే బస్ డిపో ఉంది. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడికి నిత్యం భక్తుల రద్తీ ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఉన్న బస్సులు వచ్చిపోయే ప్రయాణికులకే సరిపోని పరిస్థితి నెలకొంది. ఈ డిపో లో 101 బస్సు ఉన్నాయి. మరో 8 ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకొని నడుపుతున్నారు. వీటిలో 34 ఎక్స్‌ప్రెస్‌లు, 4 డీలక్స్ బస్సులున్నాయి. ప్రయాణికుల అవసరాలు తీర్చాలంటే కనీ సం మరో 70 బస్సులు కావాల్సి ఉంది. గుట్ట నుంచి వేములవాడ, కాళేశ్వరం, భద్రాచలం, ధర్మపురి తదితర పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపాల్సిన అసరం ఉంది. వీటితో పాటు హై దరాబాద్ నుంచి హన్మకొండ వరకు బస్సులను నడపాలని అధికారులు యోచిస్తున్నారు. గుట్ట నుంచి తిరుపతి పుణ్యక్షేత్రానికి నేరుగా బస్ సౌకర్యం లేకపోవడం దురదృష్టకరం.
భువనగిరి డివిజన్ మొత్తానికి యాదగిరిగుట్టలోనే బస్ డిపో ఉంది. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడికి నిత్యం భక్తుల రద్తీ ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఉన్న బస్సులు వచ్చిపోయే ప్రయాణికులకే సరిపోని పరిస్థితి నెలకొంది. ఈ డిపో లో 101 బస్సు ఉన్నాయి. మరో 8 ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకొని నడుపుతున్నారు. వీటిలో 34 ఎక్స్‌ప్రెస్‌లు, 4 డీలక్స్ బస్సులున్నాయి. ప్రయాణికుల అవసరాలు తీర్చాలంటే కనీ సం మరో 70 బస్సులు కావాల్సి ఉంది. గుట్ట నుంచి వేములవాడ, కాళేశ్వరం, భద్రాచలం, ధర్మపురి తదితర పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపాల్సిన అసరం ఉంది. వీటితో పాటు హై దరాబాద్ నుంచి హన్మకొండ వరకు బస్సులను నడపాలని అధికారులు యోచిస్తున్నారు. గుట్ట నుంచి తిరుపతి పుణ్యక్షేత్రానికి నేరుగా బస్ సౌకర్యం లేకపోవడం దురదృష్టకరం.


==మండలంలోని గ్రామాలు==
==మండలంలోని గ్రామాలు==

19:22, 11 జూన్ 2014 నాటి కూర్పు

యాదగిరిగుట్ట
—  మండలం  —
తెలంగాణ పటంలో నల్గొండ, యాదగిరిగుట్ట స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ, యాదగిరిగుట్ట స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ, యాదగిరిగుట్ట స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°35′11″N 78°56′46″E / 17.58639°N 78.94611°E / 17.58639; 78.94611
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రం యాదగిరిగుట్ట
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 52,010
 - పురుషులు 25,960
 - స్త్రీలు 26,040
అక్షరాస్యత (2001)
 - మొత్తం 61.79%
 - పురుషులు 74.16%
 - స్త్రీలు 49.52%
పిన్‌కోడ్ 508115


యాదగిరిగుట్ట, తెలంగాణ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508115. హైదరాబాదు నుండి వరంగల్లు రహదారిలో 50 కి.మీ. దూరంలో ఉన్నలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం, యాదగిరిగుట్టలోనే ఉన్నది.

చరిత్ర

పుర్వము యాద మహర్షి అనబడే ముని ఇచ్చట తపస్సు చెసి ఆ నారసింహుని దర్శనము పొందాడు. ఆ ముని కోరిక ప్రకారముగా ఈ కొండ యాదగిరి అని పిలవబడుతున్నది. యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి.... యాదగిరి గుట్ట యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ ముఖద్వారం

యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం నల్గొండ జిల్లా లో ప్రముఖ మైన దివ్య క్షేత్రం: యాదగిరి గుట్టకు సంబందించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో వున్నది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే హాదర్షి అని కూడ అంటారు. అతను నరసింహ స్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయస్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరగా స్వామి వారు కరుణించి లక్ష్మి సమేతుడై దర్శన మిచ్చి "ఏంకావాలో కోరుకో" మంటే యాదర్షి స్వామి వారికి "శాంత మూర్తి రూపంలోనె కొలువై కొండపై ఉండి పొమ్మని కోరాడు. ఆవిధంగా లక్ష్మి నరసింహ స్వామి కొండపై అలా కొలువై ఉండి పోయాడు. కొన్నాళ్ళకు స్వామివారిని వేర్వేరు రూఫాల్లో చూడాలనిపించి యాదర్షి మరలా తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామి వారు జ్వాలా, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రింద వున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా వున్నాడు. చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారుట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులువినిపిస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు. యాదగిరి గుట్టకు ప్రవేశ ద్వారము

మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు. ఇంకో విశేషం .. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రము నందు రెండు లక్ష్మీ నరసింహస్వామి ఆలయములు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము. కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము.

మరొక కథనం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామివారు మొదట పాత లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నందు వెలసి తరువాత కొత్త లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయమునకు గుర్రముమీద వెళ్ళేవారు. మనము ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆదారిన చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుండి కొత్తలక్ష్మీనరసింహస్వామివారి ఆలయము వరకు ఉన్నవి. పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంనందు, ఆంజనేయ స్వామి వారి ఆలయము కూడా కలదు. అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతముగా ఉన్నాయి. అక్కడ నుండి కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయమునకు వెళ్ళు దారిలో ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయము కూడా కలదు. ఈ ఆలయగర్భగుడి నందు స్వామివారి వద్ద నిత్యము ఒక జల ప్రవాహము కలదు. ఆ జలముతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు.

రవాణా

రాయగిరి రైల్వేస్టేషను ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది. యాదగిరి బస్టాండుకు హైద్రాబాదు, వరంగల్, నల్గొండల నుండి చాలా బస్సులు కలవు.హైదరాబాదు మహాత్మా గాంధీ ప్రయాణ ప్రాంగణము(ఎంజి.బి.ఎస్) నుండి యాదగిరిగుట్టకు ఉదయము గం.4.30 ని.ల కు మొదటి బస్సు కలదు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ

భువనగిరి డివిజన్ మొత్తానికి యాదగిరిగుట్టలోనే బస్ డిపో ఉంది. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడికి నిత్యం భక్తుల రద్తీ ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఉన్న బస్సులు వచ్చిపోయే ప్రయాణికులకే సరిపోని పరిస్థితి నెలకొంది. ఈ డిపో లో 101 బస్సు ఉన్నాయి. మరో 8 ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకొని నడుపుతున్నారు. వీటిలో 34 ఎక్స్‌ప్రెస్‌లు, 4 డీలక్స్ బస్సులున్నాయి. ప్రయాణికుల అవసరాలు తీర్చాలంటే కనీ సం మరో 70 బస్సులు కావాల్సి ఉంది. గుట్ట నుంచి వేములవాడ, కాళేశ్వరం, భద్రాచలం, ధర్మపురి తదితర పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపాల్సిన అసరం ఉంది. వీటితో పాటు హై దరాబాద్ నుంచి హన్మకొండ వరకు బస్సులను నడపాలని అధికారులు యోచిస్తున్నారు. గుట్ట నుంచి తిరుపతి పుణ్యక్షేత్రానికి నేరుగా బస్ సౌకర్యం లేకపోవడం దురదృష్టకరం.

మండలంలోని గ్రామాలు

  1. మల్లాపూర్
  2. గౌరాయిపల్లి
  3. సాదువెల్లి
  4. కాచారం
  5. మాసాయిపేట
  6. పెద్దకందుకూరు
  7. సైదాపూర్
  8. దాతారంపల్లి
  9. జంగంపల్లి
  10. వంగపల్లి
  11. రామోజీపేట
  12. చిన్నకందుకూరు
  13. చొల్లేరు
  14. ముటాకొండూరు
  15. వార్టూరు
  16. యాదగిరిగుట్ట