కాశీయాత్ర చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 31: | పంక్తి 31: | ||
{{వికీసోర్స్|కాశీయాత్ర చరిత్ర}} |
|||
==బయటి లింకులు== |
==బయటి లింకులు== |
||
*[http://ia331330.us.archive.org/3/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf కాశీయాత్రచరిత్ర పూర్తి పుస్తకం పీడిఎఫ్] |
*[http://ia331330.us.archive.org/3/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf కాశీయాత్రచరిత్ర పూర్తి పుస్తకం పీడిఎఫ్] |
11:08, 4 జూలై 2014 నాటి కూర్పు
కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్యానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి 3 సెప్టెంబరు, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.
ఏనుగుల వీరాస్వామయ్య
కాశీయాత్ర చరిత్ర రచన ప్రాముఖ్యత
యాత్రా క్రమం, విశేషాలు
- అప్పటికి (1831-1832) బ్రిటిషు వారు ఇంకా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకోలేదు. కాబట్టి కొంత భాగం సంస్థానాలలో రాజు ల క్రింద ఉండేది.
- ఆనాటి వాడుకభాషలో సమకాలీన జీవిత దౌర్భాగ్యాలను, తన పోషకుల వంచనాశిల్పాన్ని, తన బలహీనతలనూ నిర్వికారంగా వ్రాయగలిగాడు.
- అప్పటి సంస్థానాలలో, ఇంగ్లీషు రాజ్యభాగాలలో, పౌరోహిత్యంలో ఎన్ని విధాల మోసం, లంచగొండితనం, అవినీతి ఉన్నాయో దాపరికం లేకుండా వ్రాశాడు.
- విలియం బెంటింగ్ రాజప్రతినిధులు ఎన్ని విధాల, ఎన్ని కుమార్గాలలో స్వదేశీ సంస్థానాలను క్రమంగా ఆక్రమించుకొంటున్నారో, దేశంలో జమిందారుల, దోపిడీ దొంగల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో, సామాన్య ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురౌతున్నారో మొహమాటం లేకుండా వ్రాశాడు.
- కొన్ని ప్రదేశాలలో కుల, మత, ప్రాంత భేదాలు ఎన్ని అనర్ధాలు తెచ్చిపెడుతున్నాయో, భిన్న ప్రాంతాలలో ఆర్ధిక పరిస్థితులెలా ఉన్నాయో చిత్రీకరించాడు.
- పుప్పాడ లోని బెస్తలు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎలా అప్పులపాలైనారో వివరించాడు.
రచన నుండి కొన్ని ఉదాహరణలు
రచయిత వాడిన పదాలు
ముద్రణలు
- చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సలహాలు ఉత్తరాల ద్వారా పొందిన వీరాస్వామి యాత్రా చరిత్రను ఆయన మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై మొదటిసారిగా 1838 లో ముద్రించాడు.
- ఈ గ్రంథం 1869 లో ద్వితీయ ముద్రణ పొందింది.
- ఈ గ్రంథం 1941 లో దిగవల్లి వేంకట శివరావు అనేక వివరణలతో ప్రచురించాడు. ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు బెజవాడలో తిరిగి ముద్రించారు.
మూలాలు, వనరులు
- తెలుగు సంగతులు, బూదరాజు రాధాకృష్ణ, మీడియా హౌస్ పబ్లికేషన్స్, హైదరాబాదు, 2003.