భృగు మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి వర్గం:ప్రజాపతులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 25: పంక్తి 25:
[[వర్గం:హిందూ ఋషులు]]
[[వర్గం:హిందూ ఋషులు]]
[[వర్గం:హిందూ మతము]]
[[వర్గం:హిందూ మతము]]
[[వర్గం:ప్రజాపతులు]]

04:03, 16 డిసెంబరు 2014 నాటి కూర్పు

భృగు మహర్షి

భృగు మహర్షి బ్రహ్మ మానస పుత్రుడైన ప్రజాపతి మరియు సప్తర్షులలో ఒకరు.[1] మొట్టమొదటి జ్యోతిష రచయిత[2] మరియు వేదాల కాలంలో రచించిన భృగు సంహిత కర్త.[3] భృగు మహర్షి బ్రహ్మహృదయము నుండి ఉద్భవించిన నవబ్రహ్మలలో ఒకడు. వాయు పురాణం ప్రకారం భృగువు మామగారైన దక్షుని యజ్ఞంలో పాల్గొన్నాడు.[4]

భృగు వంశం

దక్షుడు తన కూతురైన ఖ్యాతిని భృగుకిచ్చి వివాహం చేశాడు. వీరికి ధాత మరియు విధాత అని ఇద్దరు కుమారులు.[5] వీరి కుమార్తె శ్రీ ని విష్ణుమూర్తి కిచ్చి వివాహం చేసాడు. భృగు మహర్షికి ఉశనలకు పుట్టిన కుమారుడు అయిన ఉశనసుడు మంచి కవి. ఇతనే ఆ తదుపరి ప్రసిద్ధ రాక్షస గురువు శుక్రాచార్యుడుగా ప్రసిద్ధి కెక్కినాడు . చ్యవన మహర్షి భృగువుకు పులోమకు జన్మించిన వాడు. చ్యవన మహర్షి భార్య సుకన్యల కుమారుడు దధీచి మహర్షి . సువర్చల భర్త దధీచి మహర్షి.

భృగు వంశమునకు మూలపురుషుడు భృగు మహర్షి. ఈ వంశములో పుట్టిన వాళ్ళను భార్గవులు అని అంటారు. వీరు యాగాలలో దేవతలు సోమరసం సేవించడాన్ని ప్రవేశపెట్టారు. వీరు అథర్వణ వేదాన్ని రచించడంలో పాల్గొన్నారు.

భృగు సంహిత

భృగుమహర్షి ఒక గొప్ప హైందవ జ్యోతిష్య శాస్త్ర పితామహుడు మరియు ఇతని మొదటి జ్యోతిష్య శాస్త్ర గ్రంధం భృగుసంహిత దానికొక తర్కాణం. ఈ గ్రంధంలో సృష్టిలోని దాదాపు అన్ని రకాల జీవుల గురించి వ్రాయబడ్డాయి. అనగా దాదాపు 50 లక్షల ప్రాణుల జాతకాలు పొందుపర్చబడ్డాయి. ఒక పరిసశీలన ప్రకారం ఇప్పుడు కేవలం 01 శాతం జీవులు మత్రమే మిగిలి ఉన్నాయని అంటున్నారు. భృగుమహర్షి ఒక గొప్ప ధర్మశాస్త్రప్రవక్తగా కాత్యాయనుడు పేర్కొన్నాడు.

త్రిమూర్తులు:ఎవరు గొప్ప?

ఒకనాడు సరస్వతి నదీ తీరమున మహర్షులకు సత్క్రతువులు ఆచరించిన పిమ్మట మాటల సందర్భములో త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే సంశయము వచ్చినది. త్రిమూర్తుల గుణగణములు, ,ప్రాశస్త్యములు పరిశీలించిన పిదప, మహర్షులందరు భృగువు మహర్షి కంటే గొప్ప మహాత్ముడు లేడు అని నిర్ణయించుకొని, ఈ సంశయ విషయము నిర్ధారణ చేసుకునేందుకు భృగువుకు తెలియ జేస్తారు. మహర్షుల నిజ దైవము ఎవరో తెలుసుకునేందుకు బ్రహ్మ, శంకరుడు మరియు విష్ణువు దగ్గరకు వెళ్లడము, అక్కడ విష్ణువు ద్వారా తన అహంకారము పరాభవముతో నశించడము, ముకుందుడు నుండి ఆనందం పొందడము, భక్తి పారవశ్యముతో తిరిగి భూలోకమున సరస్వతి నదీ తీరమునకు చేరుకుంటాడు. [6]. మహర్షులకు పుండరీకాక్షుడు/విష్ణువు ఒక్కడే దైవమని తెలియజేస్తాడు.

భగవద్గీత భృగు ప్రస్తావన

భగవంతుడు శ్రీకృష్ణుడు ఉపదేశించిన భగవద్గీతలో మహర్షుల గురించి తెలియజేస్తూ ఈ భృగు మహర్షి [7] ప్రస్తావన కూడా రావడము జరుగుతుంది.

మూలాలు

  1. Narada said.. The Mahabharata translated by Kisari Mohan Ganguli (1883 -1896), Book 2: Sabha Parva: Lokapala Sabhakhayana Parva, section:XI. p. 25 And Daksha, Prachetas, Pulaha, Marichi, the master Kasyapa, Bhrigu, Atri, and Vasistha and Gautama, and also Angiras, and Pulastya, Kraut, Prahlada, and Kardama, these Prajapatis, and Angirasa of the Atharvan Veda, the Valikhilyas, the Marichipas; Intelligence, Space, Knowledge, Air, Heat, Water, Earth, Sound, Touch, Form, Taste, Scent; Nature, and the Modes (of Nature), and the elemental and prime causes of the world,--all stay in that mansion beside the lord Brahma. And Agastya of great energy, and Markandeya, of great ascetic power, and Jamadagni and Bharadwaja, and Samvarta, and Chyavana, and exalted Durvasa, and the virtuous Rishyasringa, the illustrious 'Sanatkumara' of great ascetic merit and the preceptor in all matters affecting Yoga..."
  2. Bhrigu Samhita|భృగు సంహిత
  3. What is Bhrighu Samhita ?
  4. Vishnu Purana SACRIFICE OF DAKSHA (From the Vayu Purana.) The Vishnu Purana, translated by Horace Hayman Wilson, 1840. 67:6.
  5. Brigu www.urday.in.
  6. Bhrigu and the Three Gods Summaries and Commentaries for Indian Mythology.
  7. Bhagavad Gītā – Chapter 10 Verse 25