మహమ్మద్ రజబ్ అలీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 12: పంక్తి 12:
<gallery>
<gallery>
File:Rajab Ali M.D Khammam MLA 01.JPG|Rajab Ali M.D Khammam MLA 01
File:Rajab Ali M.D Khammam MLA 01.JPG|Rajab Ali M.D Khammam MLA 01
File:Rajab Ali M.D Khammam MLA 07.jpg|Rajab Ali M.D Khammam MLA 07
File:Rajab Ali M.D Khammam MLA 03.JPG|Rajab Ali M.D Khammam MLA 03
File:Rajab Ali M.D Khammam MLA 02.JPG|Rajab Ali M.D Khammam MLA 02
File:Rajab Ali M.D Khammam MLA 02.JPG|Rajab Ali M.D Khammam MLA 02
File:Rajab Ali M.D Khammam MLA 03.JPG|Rajab Ali M.D Khammam MLA 03
[[File:Rajab Ali M.D Khammam MLA 04.jpg|thumb|Rajab Ali M.D Khammam MLA 04]]
[[File:Rajab Ali M.D Khammam MLA 05.JPG|thumb|Rajab Ali M.D Khammam MLA 05]]
[[File:Rajab Ali M.D Khammam MLA 06.JPG|thumb|Rajab Ali M.D Khammam MLA 06]]
File:Rajab Ali M.D Khammam MLA 07.jpg|Rajab Ali M.D Khammam MLA 07
</gallery>
</gallery>

==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

05:37, 16 డిసెంబరు 2014 నాటి కూర్పు

Rajab Ali Mohammad Khammam M.L.A (Ex)

జననం:- 01-01-1920-మరణం:- 10-04-1997 జనవరి 1 1920/ ఏప్రిల్ 10 1997 మహమ్మద్ రజబ్ అలీ 1920 జనవరి 1వ తేదిన ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్ మండలంలోని పాపటపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు మహబూబ్ అలీ, తల్లి పేరు హమీద వీరికి మొత్తం సంతానం ముగ్గురు వీరిలో మొదటి సంతానం ఖాసిం బీ, రెండవ సంతానం రజబ్ అలీ, మూడవ సంతానం మొఇనుద్దిన్, ఆయన ప్రాదమిక విద్యను స్వగ్రామంలో అబ్యాసించారు. తర్వాత 9వ తరగతి వరకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్లలో చదివారు. అంతటితో చదువు చాలించి, ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉట్కూరు గ్రామంలో ఒక సవత్సరం పాటు పని చేశారు. తర్వాత వృత్తిని వదిలి హైదరబాద్ లోని ప్రభుత్వ ప్రెస్ లో తెలుగు, ఉర్దూ అనువాదకునిగా పని చేసారు.

రాజకీయ ప్రస్థానము

ఖమ్మం జిల్లాలో వివిధ నియోజకవర్గాల నుండి 7 సార్లు ఎం.ఎల్.ఏ ఎన్నికయారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రముక పాత్ర పోషించారు. ప్రాదమిక విద్యను స్వగ్రామంలో అబ్యాసించారు. తర్వాత 9వ తరగతి వరకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్లలో చదివారు. అంతటితో చదువు చాలించి, ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉట్కూరు గ్రామంలో ఒక సవత్సరం పాటు పని చేశారు. తర్వాత వృత్తిని వదిలి హైదరబాద్ లోని ప్రభుత్వ ప్రెస్ లో తెలుగు, ఉర్దూ అనువాదకునిగా పని చేసారు. తర్వాత కొత్త కాలానికి స్వగ్రామం చేరుకొని గ్రామ కరణంగా ఉంటుండగా జీవితం ఒక మలుపు తిరిగింది. కరణంగా పనిచేస్తూనే, ఆంధ్ర మహాసబ కార్యక్రమాలకు తోడ్పాటును అందిస్తుడేవారు. ఆంధ్ర మహా సబకు సహకరిస్తునరనే నెపంతో ప్రభుత్వం ఆయనను మూడున్నర సవత్సరాల పాటు "డిటెన్యూ" గా నిర్బందిచింది. పటేల్, పట్వారి వస్త్రాలను ఆంధ్ర మహా సబ అద్వర్యంలో కాల్చివేస్తున్న తరుణంలో నాడు పట్వారిగా పనిచేస్తున్న ఖమ్మం తాలుక లోని గోకినేపల్లి గ్రామానికి చెందిన శ్రీ మచ్చా వీరయ్య గారు ఆంధ్ర మహా సబలలో చేరారు. ఆయన రాజకీయ జీవిత స్పూర్తికి, నిజాం నిరంకుశ విదానాలను ఎదిరించి పోరాడిన శ్రీ మచ్చా వీరయ్య కారకులు. ఖమ్మం తాలుక అద్యక్షులుగా శ్రీ పి. శ్రీనివాసరావు పనిచేస్తున్న కాల మైన 1944లో ఖమ్మంలో ఆంధ్ర మహా సబ సమావేశం జరిగినపుడు తన 24వ ఏట ఆంధ్ర మహా సబలొ ప్రవేశించారు. ఆంధ్ర మహాసభ నిర్వహించిన అనేక భూమి, భుక్తి పోరాటాలలో ప్రత్యక్ష్య నాయకత్వం వహించారు. ఖమ్మం తాలుక ప్రాంతంలో వేలాది మంది ప్రజలు ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్ట్ పార్టీల వైపు ఆకర్షించారు. తెలంగాణ సాయుధ పోరాటం సాగిన సమయంలో భూమి విముక్తి పోరాటంలో పాల్గొని చురుకైన పాత్ర పోషించారు. 1946లో నిజాం సేనలు ఆయనను అరెస్ట్ చేసి మూడు మాసాలు వరంగల్ జైలులో నిర్భదించాయి. 1947లో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. అదే సంవత్సరంలో ఆయనను అరెస్ట్ చేసి మూడు సంవత్సరాల మూడు మాసాలు వరంగల్, చంచల్ గూడా, ముషిరాబాద్ జైలు లలో బంధించారు. జైలు గోడల మద్య అనేక కష్టాలకు గురై క్షయవ్యాది సోకి ఇబ్బందులకు లొనయ్యరు. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం ప్రచార భాద్యతను నిర్వహించారు. కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిన నందికొండ ప్రాజెక్ట్ సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. పాదయాత్రలకు నాయకత్వం వహించారు. గ్రామగ్రామాన ప్రజలను కదిలించి వేలాది మంది ప్రజలను ఉద్యమ భాగస్వాములను గావించారు. ప్రాజెక్ట్ సాధనకు తొలుత ఖమ్మం తాలుక గోళ్ళపాడు జరిగిన రైతు సదస్సులో పాల్గొన్నారు. సి.పి. ఐ 1955లో జగ్గయ్యపేటలో నిర్వహించిన అద్భుతంగా రైతు యాత్రకు ఖమ్మం జిల్లా నుండి వేలాది మందిని సమికరించరు.

చిత్ర మాలిక

మూలాలు

బయటి లంకెలు