చిరుధాన్యం: కూర్పుల మధ్య తేడాలు
B.K.Viswanadh (చర్చ | రచనలు) |
|||
పంక్తి 29: | పంక్తి 29: | ||
చిరుధాన్యాలు ప్రాచీనకాలం నుంచి మానవ పరిణామక్రమం లో ప్రముఖపాత్ర పోషించాయి. వర్షాభావ మరియు ఎడారి ప్రాంతం నందు ఈ ధాన్యాలు మానవులకు, పసువులకు మఖ్య ఆహారం. భారతదేశము నందు [[జొన్న]]లు, [[సజ్జలు]], [[రాగులు]], వరిగెలు ఈనాటికీ వాడుకలో కలవు. ఆఫ్రికా ఖండం నందు కూడా త్రుణధాన్యాలు ప్రధానాహారం. |
చిరుధాన్యాలు ప్రాచీనకాలం నుంచి మానవ పరిణామక్రమం లో ప్రముఖపాత్ర పోషించాయి. వర్షాభావ మరియు ఎడారి ప్రాంతం నందు ఈ ధాన్యాలు మానవులకు, పసువులకు మఖ్య ఆహారం. భారతదేశము నందు [[జొన్న]]లు, [[సజ్జలు]], [[రాగులు]], వరిగెలు ఈనాటికీ వాడుకలో కలవు. ఆఫ్రికా ఖండం నందు కూడా త్రుణధాన్యాలు ప్రధానాహారం. |
||
ఈజిప్ట్ నందు, గ్రీస్ నందు క్రీ.పూ లొనే చిరుధాన్యాలతో మధ్యమును తయారుచేసారు. [[ |
ఈజిప్ట్ నందు, గ్రీస్ నందు క్రీ.పూ లొనే చిరుధాన్యాలతో మధ్యమును తయారుచేసారు. [[చైనా]], [[జపాన్]], [[ఇండొనేషియా]] లలో నూడుల్స్ తయారీకి ఈనాటికీ వాడుచున్నారు. |
||
ఈ ధాన్యాలను ప్రాంత ఆహార అలవాట్లను బట్టి జావ కానూ, రొట్టె గానూ, లేదా సంకటి గానూ వాడెదరు. ఈ ధాన్యాల గడ్ది పసుగ్రాసంగా పనికి వచ్చును. నవీనకాలం నందు త్రణధాన్యాల వాడుక తగ్గిననూ ప్రస్తుతకాలంలో వీటి వాడుక పెరుగుచున్నది. |
ఈ ధాన్యాలను ప్రాంత ఆహార అలవాట్లను బట్టి జావ కానూ, రొట్టె గానూ, లేదా సంకటి గానూ వాడెదరు. ఈ ధాన్యాల గడ్ది పసుగ్రాసంగా పనికి వచ్చును. నవీనకాలం నందు త్రణధాన్యాల వాడుక తగ్గిననూ ప్రస్తుతకాలంలో వీటి వాడుక పెరుగుచున్నది. |
09:46, 30 డిసెంబరు 2014 నాటి కూర్పు
చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు (Millets) ఆహారధాన్యాలలో చిన్న గింజ కలిగిన గడ్డిజాతి పంటలు. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఆహారం కోసం మరియు పశుగ్రాసం కోసం పెంచుతున్నారు. ఇవి ఒక శాస్త్రవిభాగం కాదు; వీటి సామాన్య లక్షణం చిన్న విత్తనాన్ని కలిగియుండడం మాత్రమే. ఇవి నీరు తక్కువగా అందే మెట్టప్రాంతాలలో పండి, పేదదేశాల ప్రజలకు ఆహారపు అవసరాల్ని తీరుస్తాయి.
చిరుధాన్యాలలో రకాలు
చిరుధాన్యాలలో చాలా జాతుల మొక్కలు పోయేసి (Poaceae) కుటుంబంలో ముఖ్యంగా పానికోయిడే(Panicoideae) ఉపకుటుంబంలో ఉన్నవి.
వీనిలో ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత ననుసరించి ముఖ్యమైన జాతులు[1].: బ్రాకెట్ నందు ఆంగ్ల అనువాదము ఇవ్వబడినది.
- జొన్నలు (Sorghum)
- సజ్జలు (Pearl millet)
- కొఱ్ఱలు (Setaria italica)
- వరిగెలు (Proso millet)
- రాగులు ('Finger millet)
ఇతర తక్కువ ప్రాముఖ్యత కలిగిన చిరుధాన్యాలు:
- వరకు
- కులై
- కుసుములు
చిరుధాన్యాల ఉపయోగాలు
చిరుధాన్యాలు ప్రాచీనకాలం నుంచి మానవ పరిణామక్రమం లో ప్రముఖపాత్ర పోషించాయి. వర్షాభావ మరియు ఎడారి ప్రాంతం నందు ఈ ధాన్యాలు మానవులకు, పసువులకు మఖ్య ఆహారం. భారతదేశము నందు జొన్నలు, సజ్జలు, రాగులు, వరిగెలు ఈనాటికీ వాడుకలో కలవు. ఆఫ్రికా ఖండం నందు కూడా త్రుణధాన్యాలు ప్రధానాహారం.
ఈజిప్ట్ నందు, గ్రీస్ నందు క్రీ.పూ లొనే చిరుధాన్యాలతో మధ్యమును తయారుచేసారు. చైనా, జపాన్, ఇండొనేషియా లలో నూడుల్స్ తయారీకి ఈనాటికీ వాడుచున్నారు.
ఈ ధాన్యాలను ప్రాంత ఆహార అలవాట్లను బట్టి జావ కానూ, రొట్టె గానూ, లేదా సంకటి గానూ వాడెదరు. ఈ ధాన్యాల గడ్ది పసుగ్రాసంగా పనికి వచ్చును. నవీనకాలం నందు త్రణధాన్యాల వాడుక తగ్గిననూ ప్రస్తుతకాలంలో వీటి వాడుక పెరుగుచున్నది.
పోషక విలువలు
చిరుధాన్యాలు పోషకవిలువలలో దాదాపు గోధుమలతో సరితూగును. మాంసకృత్తులు దాదాపు 10% బరువును కలిగివుంటాయి. విటమిన్ బి12, బి17, బి6, కూడా ఎక్కువ శాతం వుంటాయి. ఎక్కువ పీచుపదార్ధాలు కలుగివుంటాయి కాబట్టి చిరుధాన్యాలు అరుగుదలకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. ఇంకా చిరుధాన్యాలు పిల్లలకు, వ్రుద్దులకు కావలసిన పోషకాలు ఎక్కువగా వుండుటచేత భారతదేశంలో వీటివాడుక ఎక్కువ.
మూలాలు
- ↑ "Annex II: Relative importance of millet species, 1992-94". The World Sorghum and Millet Economies: Facts, Trends and Outlook. Food and Agriculture Organization of the United Nations. 1996. ISBN 92-5-103861-9.