దేవులపల్లి రామానుజరావు: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 82: | పంక్తి 82: | ||
==యితర లింకులు== |
==యితర లింకులు== |
||
* [http://www.namasthetelangaana.com/sunday/article.asp?category=10&subCategory=3&ContentId=24150 నమస్తే తెలంగాణా లో వ్యాసం] |
* [http://www.namasthetelangaana.com/sunday/article.asp?category=10&subCategory=3&ContentId=24150 నమస్తే తెలంగాణా లో వ్యాసం] |
||
* [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=%20aan%27dhra%20vijnj-aana%20kooshamu%20modat%27i%20san%27put%27amu&author1=maamid%27ipuud%27i%20vein%27kat%27aran%27gayya&subject1=LANGUAGE.%20LINGUISTICS.%20LITERATURE&year=1958%20&language1=Telugu&pages=906&barcode=2010010000046&author2=&identifier1=&publisher1=Sangraha%20Andhra%20Vignyankosa%20Samithi,Hyderabad.&contributor1=&vendor1=NONE&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=NONE&sourcelib1=SNL,%20Vetapalem&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=&numberedpages1=&unnumberedpages1=&rights1=%20©rightowner1=©rightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data7/upload/0189/002 రామానుజరావు సంపాదకునిగా వ్యవహరించిన సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము, మొదటి సంపుటము భారత డిజిటల్ లైబ్రరీలో పుస్తక ప్రతి.] |
|||
{{తెలంగాణ సాహిత్యం}} |
{{తెలంగాణ సాహిత్యం}} |
||
[[వర్గం:1917 జననాలు]] |
[[వర్గం:1917 జననాలు]] |
10:53, 10 మార్చి 2015 నాటి కూర్పు
దేవులపల్లి రామానుజరావు | |
---|---|
జననం | దేవులపల్లి రామానుజరావు 1917 ఓరుగల్లు |
ఇతర పేర్లు | దేవులపల్లి రామానుజరావు |
ప్రసిద్ధి | సాహితీకారుడు |
దేవులపల్లి రామానుజరావు తెలంగాణ విముక్తి కోసం జరిగిన పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని అలుపెరగని పోరాటం చేసిన సాహితీకారుడు. తెలంగాణలో శోభ, ‘గోల్కొండ’ పత్రికలకు సంపాదకుడిగా, సురవరం ప్రతాపరెడ్డి తర్వాత అంతటి సాహిత్య సేవ చేసిన సాహితీకారుడు ఆయన. సహజ తెనుగు భాషలో పాండిత్యం సంపాయించి, చిత్త శుద్ధితో తెలుగు భాష సేవలో నిమగ్నమై ఫలితాలు సాసించిన తెలుగు భాషా సాధకుడు. 1950 నుండి 1979 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనేట్, సిండికేట్ సభ్యుడిగా ఉన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి, శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భషా నిలయం, కేంద్ర సాహిత్య అకాడమీలలో మూడు దశాబ్ధాలకు పైగా ప్రగాడ అనుభందాలేర్పరచుకుని తెనుగు భాషా, రచనల పరివ్యాప్తికి మిక్కిలి కృషి చేశారు. గోల్కొండ పత్రిక సంపాదకుడిగా పనిచేశారు[1].
ఇంగ్లిషు, తెలుగు, ఉర్దూ భాషా ప్రవీణుడు, మంచి పాండిత్యం కలవాడు; తెలుగులో మంచి రచయిత. అనేక విషయాలు తెలిసిన దిట్ట మంచి వక్త; పరిశోధకుడు శ్రీ రామానుజరావు గారు; తెలుగు సంస్కృతి మీద మెండుగా అభిమానం ఉన్నవాడు.
జీవిత విశేషాలు
శ్రీ రామనుజ రావు గారు - ఆగస్టు 25, 1917 లో వరంగల్లు పట్టణ సమీపాన ఉన్న దేశాయి పేట గ్రామంలో వేంకట చలపతిరావు, ఆండాళ్ళమ్మ దంపతులకు ప్రధమ సంతానంగా జన్మించినారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైనారు. తరువాత నాగ్పూర్ విశ్వవిద్యాలయం నుండి ఎల్ ఎల్ బి పట్టా సాదించేరు. అక్కడే డాక్టర్ నటరాజ రామకృష్ణ గారితో పరిచయం ఏర్పడింది.రామానుజరావు పదహారు గ్రంథాలు రాయడమే కాక పెక్కు సంస్థలకు తన సేవలందించారు. 22 సంస్థలతో ప్రత్యక్ష, పరోక్ష భాగస్వామ్యం కలిగి ఉండటమే కాక విద్యారంగంలోనూ, ఉస్మానియా యూనివర్సిటిలోనూ అనేక పదవులను సమర్థవంతంగా నిర్వహించారు.
అంతేకాదు, సహకార రంగ వ్యాపార సంస్థ డైరెక్టర్గా, సాధారణ భీమా సంస్థ డైరెక్టర్గానూ పని చేశారు. రాష్ట్రంలోని అనేక గ్రంథాలయాలకు పాలక సభ్యుడిగా, వ్యవస్థాపకుడిగా, పరిపాలకుడిగా తన విలువైన సేవలందించారు. హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొన్న ఆయన 1960-62 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు.
డాక్టర్ రామానుజరావు గారి దేశాభిమానం వారిలోని కవితాశక్తిని జాగృతం చేసి పొంగింప చేసింది. ‘పచ్చతోరణం’ వారి పద్యరూప దేశాభిమానానికి హృద్యమైన ఉదాహరణం. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అన్నట్లు వారు ఓరుగల్లు మీద వ్రాసిన ఖండకావ్యం తెలుగు సాహిత్యంలోని ప్రబోధ కవితాశాఖలో వెలువడిన విలువైన కళాఖండంగా కావ్య విమర్శకులు గుర్తించారు. అందులోని అయిదు సీసపద్యాలూ పంచరత్నాలు. ఓరుగల్లు కోటను దర్శించే సమయంలో సాహితీపరులు ఆ పద్యాలను స్మరించుకుంటూ పులకిస్తూ ఉంటారు. డాక్టర్ రామానుజరావు గారు ‘మా ఊరు-ఓరుగల్లు’ అనే వ్యాసం కూడా వ్రాశారు. పద్యాల్లో ఎంత ఆవేశాన్నీ, ఆర్ద్రతనూ ప్రదర్శించారో మాటల్లో కూడా అంత ఆత్మీయతనూ, తాదాత్మ్యాన్నీ ప్రకటించారు.[2]
గౌరవ పదవులు
- 1945-46 లో వరంగల్ జిల్లా యువ జన కాంగ్రెస్ అధ్యక్షకుడిగా ఉన్నారు. సూరవరం ప్రతాపరెడ్డి గారి ఆహ్వానం మేరకు " గోల్కొండ " పత్రిక ఉప సంపాదకులుగా పనిచేశారు. ఇరవై రెండేళ్ళు - గోల్కొండ పత్రికలో సంపాదికీయం వ్రాసినారు.
- 1960-62 లో సాహిత్య ప్రతినిధిగా రాజ్య సభ సభ్యుడిగా పనిచేశారు;
- 1950 నుండి 1979 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా ఉన్నారు. మూడు పర్యయాలు కార్య నిర్వహణా (ఆక్టింగ్) కులపతిగా వ్యవహరించారు. హైద్రాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా పనిచేశారు. ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కార్యనివాహక సంఘ సభ్యుడిగా ఉన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా కొంత కాలం పనిచేశారు. రెండు, మూడేళ్ళ పాటు హైద్రాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం నిర్వాణా సంఘ సభ్యుడిగా పనిచేశారు.
- 1990 లో ఆంధ్ర ప్రదేశ్ సారస్వత విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా అందుకున్నారు.
రచనలు[3]
- సారస్వత నవనీతం
- తెలుగు సీమలో సాంస్కృతిక పునర్జీవనము
- తెలంగాణాలో జాతీయోధ్యమాలు
- నా రాడియో ప్రశంగాలు
- ఉపన్యాస తోరణము
- వేగుచుక్కలు
- తెనుగు సాహితీ
- తెలుగు దేశము
- యాబై సంవత్సరాల జ్ఞాపకాలు (1929 నుండి 1979 వరకు)
- తలపుల దుమారము
- పంచవర్ష ప్రణాళికలు
- బంకించంద్ర చఠర్జీ జీవితము
- హైద్రాబాదులో స్వాతంత్యోధ్యమం
- మన దేశం - తెలుగు సీమ
- జవాహర్లాల్ నెహ్రూ
- గౌతమ బుద్ధుడు
- కావ్యమాల
సంపాదకీయం వహించిన రచనలు[4]
- శోభ సాహిత్య మాస పత్రిక
- గోల్కొండ దిన పత్రిక (1948-1964)
- గురజాడ శతవార్షికోత్సవ సంచిక (1962-64)
- రవీంద్రనాధ్ ఠాగూర్ శత వార్షికోత్సవ సంచిక
- తెలుగు మహా సభల ప్రత్యేక సంచిక (1981)