అడివి బాపిరాజు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 26: పంక్తి 26:
==రచనలు==
==రచనలు==
===నవలలు===
===నవలలు===
* [[నారాయణరావు]]
* [[నారాయణరావు]] (1934) - సాంఘికం
* తుఫాను (1945) - సాంఘికం
* తుఫాన్
* [[గోనగన్నారెడ్డి]]
* [[గోనగన్నారెడ్డి]] (1945) - చారిత్రకం
* కోనంగి
* కోనంగి (1946)- సాంఘికం
* [[హిమబిందు (నవల)]]
* [[హిమబిందు (నవల)]] - చారిత్రకం
* [[అడవి శాంతిశ్రీ]] - చారిత్రకం
* [[కోణంగి]]
* [[అంశుమతి]] - చారిత్రకం
* [[అడవి శాంతిశ్రీ]]
* నరుడు (1946 ) - సాంఘికం
* [[అంశుమతి]]
* జాజిమల్లి (1951) - సాంఘికం
* [[మధురవాణి]]
* [[మధురవాణి]] (అసంపూర్ణం, పూరణ - దిట్టకవి శ్యామలా దేవి)
* శిలారథం (అసంపూరణం)
* కైలాసేశ్వరుడు (అసంపూర్ణం)


===రేడియో నాటికలు===
===రేడియో నాటికలు===

11:44, 3 జూన్ 2015 నాటి కూర్పు

అడివి బాపిరాజు
జననంఅక్టోబరు 8, 1895
భీమవరం
మరణంసెప్టెంబరు 22, 1952
ఇతర పేర్లుబాపిబావ
వృత్తికవి, చిత్రకారుడు, పాత్రికేయుడు, దర్శకుడు
తండ్రికృష్ణయ్య
తల్లిసుబ్బమ్మ

అడివి బాపిరాజు (Adivi Bapiraju) (1895 - 1952) బహుముఖ ప్రజ్ఞాశీలి. స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త. తెలుగు దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న "బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా "బాపి బావ" అని పిలిచేవారు.

విశాఖలో అడివి బాపిరాజు విగ్రహం

బాపిరాజు పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం లో అక్టోబర్ 8, 1895 న ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబములో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. భీమవరం హైస్కూలులో చదివి, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి, మద్రాస్ లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించాడు. 1934 నుండి 1939 వరకు బందరు నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా (ప్రిన్సిపాల్ గా) పని చేశాడు. 1944లో హైదరాబాదు నుండి వెలువడే తెలుగు దినపత్రిక మీజాన్ సంపాదకునిగా పని చేశాడు. తరువాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నాడు. 'నవ్య సాహిత్య పరిషత్' స్థాపించినవారిలో బాపిరాజు ఒకడు. చిత్రకళను నేర్పడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ ప్రారంభించాడు.

బాపిరాజుకు చిన్ననాటినుండి కవితలు రాసే అలవాటు ఉండేది. బాపిరాజు నవల నారాయణరావుకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో 'సముద్ర గుప్తుడు', 'తిక్కన' ప్రసిద్ధమయ్యాయి. విశ్వనాథ సత్యనారాయణ గేయ సంపుటి కిన్నెరసాని పాటలు బాపిరాజు చిత్రాలతో వెలువడింది.

1922లో సహకార నిరాకరణోద్యమంలో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. తన జైలు జీవితానుభవాలను 'తొలకరి' నవలలో పొందుపరచాడు.

సెప్టెంబరు 22, 1952 న బాపిరాజు మరణించాడు.

చిత్రకళ

నవరంగ సంప్రదాయ రీతిలో అడివి బాపిరాజు ఎన్నో చిత్రాలను చిత్రించారు. బాపిరాజు చిత్రించిన శబ్ద బ్రహ్మ అనే చిత్రం డెన్మార్కు ప్రదర్శనశాలలో ఉంది. భాగవత పురుషుడు, ఆనంద తాండవం మొదలగు చిత్రాలు తిరువాన్‍కూరు మ్యూజియంలో వున్నాయి. 1951లో అప్పటి మద్రాసుప్రభుత్వం కోరికపై సింహళంలోని సిగిరియా కుడ్య చిత్రాల ప్రతికృతులను చిత్రించారు.

రచనలు

నవలలు

రేడియో నాటికలు

  • దుక్కిటెద్దులు
  • ఉషాసుందరి
  • bhogiraloya ?

కథాసంపుటాలు

  • తరంగిణి[1]
  • రాగమాలిక[2]

ప్రసిద్ధి చెందిన కథలు

  • తూలికా నృత్యం
  • హంపి శిథిలాలు
  • శైలబాల
  • వీణ
  • నాగలి
  • నేలతల్లి
  • బొమ్మలరాణి
  • సోమసుత
  • సూర్యసుత

దర్శకత్వం వహించిన సినిమాలు

మరెన్నో కథలు, గేయాలు రచించాడు. కొన్ని కథలు కన్నడ భాషలోకి అనువదింపబడ్డాయి.

వనరులు, బయటి లింకులు

  • http://www.vepachedu.org/Bapiraju.html లో వ్యాసం - ఎమ్.ఎల్.నరసింహారావు 'నూరుగురు తెలుగు ప్రముఖులు' ఆధారంగా వ్రాసినది.

మూలాలు

  1. బాపిరాజు, అడివి (1945). తరంగిణి.
  2. బాపిరాజు, అడివి (1945). రాగమాలిక.