బి.ఎల్.ఎస్.ప్రకాశరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలుగు గణాంక శాస్త్రవేత్తలు తొలగించబడింది; [[వర్గం:తెలుగువారిలో గణాంక శాస్త్రవేత్తల...
చి వర్గం:శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 16: పంక్తి 16:
[[వర్గం:తెలుగువారిలో గణాంక శాస్త్రవేత్తలు]]
[[వర్గం:తెలుగువారిలో గణాంక శాస్త్రవేత్తలు]]
[[వర్గం:తెలుగు ప్రముఖులు]]
[[వర్గం:తెలుగు ప్రముఖులు]]
[[వర్గం:శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీతలు]]

13:00, 27 జూన్ 2015 నాటి కూర్పు

బి.ఎల్.ఎస్.ప్రకాశరావు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రముఖ గణాంకశాస్త్రజ్ఞుడు, ఆచార్యుడు. ఈయన పూర్తి పేరు భాగవతుల లక్ష్మీ సూర్యప్రకాశరావు . వైఎస్ఆర్ జిల్లా, పోరుమామిళ్ల లో అక్టోబరు 6, 1942 న జన్మించాడు.

విద్య

ప్రకాశరావు విశాఖపట్టణం లోని ఆంధ్ర విశ్వకళాపరిషత్ లో బి.ఎ.ఆనర్సు (గణితం) 1957-1960 లో చదివి సుమారు 92 శాతం మార్కులు సాధించి రికార్డు నమోదు చేశాడు. ఆ తర్వాత కలకత్తా లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో చేరాడు. అక్కడ ఎం.స్టాట్ చదివి, అక్కడ నుంచి అమెరికా లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ (ఈస్ట్ లాన్సింగ్) లో 1966 లో పి.హెచ్ డి. చేశాడు.

వృత్తి మరియు పదవులు

బోధన, పరిశోధనలను వృత్తిగా తీసికొని, అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (బెర్కిలీ), ఇల్లినాయ్ విశ్వవిద్యాలయం (అర్బానా), పర్డ్యూ విశ్వవిద్యాలయం, విస్కాన్ సన్ విశ్వవిద్యాలయం (మాడిసన్), కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (డేవిస్), అయోవా విశ్వవిద్యాలయం (అయోవా సిటీ) లలోనూ, కెనడాలోని మాంట్రియల్ విశ్వవిద్యాలయంలోను వివిధ బోధన పదవులను అధిష్టించి, సంభావ్యతావాదము, గణాంకశాస్త్రములలో ఉత్తమమైన పరిశోధనలను చేసి, తగిన గుర్తింపును పొందాడు. అతడి పరిశోధనలకు గుర్తింపుగా మిచిగన్ స్టేట్ విశ్వవిద్యాలయం విశిష్ట పూర్వవిద్యార్థిగా ప్రకాశరావును గౌరవించింది. భారతదేశములో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూరు, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, కొత్తఢిల్లీ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, కోల్ కత్తాలలో ఆచార్య పదవిని అధిష్టించడమే కాకుండా, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యుట్ కలకత్తాకు డైరక్టరుగా ఉండి , దానికి దిశానిర్దేశంచేశాడు.

బిరుదులూ, పురస్కారాలు

1982లో ప్రతిష్ఠాత్మకమైన భట్నాగర్ పురస్కారాన్ని (గణితీయ శాస్త్రాలలో) పొందాడు. పరమ విశిష్ట శాస్త్రజ్ఞుడుగా గుర్తింపబడ్డాడు. సుమారు రెండు వందల పరిశోధన పత్రాలను, ఎన్నో శాస్త్రీయగ్రంథాలను ప్రకటించాడు. విశిష్ట ఆచార్యుడుగా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అతడిని గౌరవించింది. హైదరాబాదు విశ్వవిద్యాలయం వారి ఆహ్వానం మీద జవహర్ లాల్ నెహ్రూ పీఠాన్ని అలంకరించాడు.

బయటి లింకులు