గుండమ్మ కథ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 65: పంక్తి 65:


=== స్పందన ===
=== స్పందన ===
సినిమా విడుదల ముందు విమర్శలు రావడంతో విడుదల సమయంలో చిత్రవర్గాలు ఉత్కంఠతో ఎదురుచూశారు. గుండమ్మ కథ ప్రివ్యూ చూసినప్పుడు ఎన్టీఆర్ నిక్కర్లో తెరపై కనిపించగానే ప్రివ్యూ చూస్తున్న చిన్నపిల్లలంతా ఒక్కపెట్టున నవ్వారు. అది చూసిన చక్రపాణి ఆ అంచనాతోనే ప్రివ్యూ అవగానే "ఎవరెన్ని అనుకున్నా సినిమా సూపర్ హిట్" అని తేల్చేశారు.
సినిమా విడుదల ముందు విమర్శలు రావడంతో విడుదల సమయంలో చిత్రవర్గాలు ఉత్కంఠతో ఎదురుచూశారు. గుండమ్మ కథ ప్రివ్యూ చూసినప్పుడు ఎన్టీఆర్ నిక్కర్లో తెరపై కనిపించగానే ప్రివ్యూ చూస్తున్న చిన్నపిల్లలంతా ఒక్కపెట్టున నవ్వారు. అది చూసిన చక్రపాణి ఆ అంచనాతోనే ప్రివ్యూ అవగానే "ఎవరెన్ని అనుకున్నా సినిమా సూపర్ హిట్" అని తేల్చేశారు. ఆయన అంచనాలు నిజం చేస్తూ సినిమా అప్రతిహత విజయాలను సాధించింది.


== సంభాషణలు ==
== సంభాషణలు ==

19:06, 19 ఆగస్టు 2015 నాటి కూర్పు

గుండమ్మ కథ
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
నిర్మాణం బి.నాగిరెడ్డి , చక్రపాణి
రచన పింగళి నాగేంద్రరావు
కథ చక్రపాణి
తారాగణం నందమూరి తారక రామారావు ,
అక్కినేని నాగేశ్వరరావు ,
సావిత్రి,
,
జమున ,
ఎస్.వి.రంగారావు ,
సూర్యకాంతం ,
ఛాయాదేవి ,
రమణారెడ్డి , హేమలత ,
హరనాథ్ ,
ఎల్ విజయలక్ష్మి ,
ముక్కామల,
ఋష్యేంద్రమణి ,
రాజనాల
సంగీతం ఘంటసాల
నేపథ్య గానం ఎస్.జానకి,
పి.లీల,
ఘంటసాల,
పి.సుశీల
గీతరచన పింగళి నాగేంద్రరావు
సంభాషణలు డి.వి.నరసరాజు
ఛాయాగ్రహణం మార్కస్ బార్ట్‌లీ
నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్
విడుదల తేదీ 7 జూన్ 1962
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

విజయా సంస్థ నిర్మించిన చిత్రలలో ఆఖరి విజయవంతమైన చిత్రం గుండమ్మ కథ. అప్పటిలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టారర్, కాని "గుండమ్మ కథ" అని సూర్యకాంతం పాత్ర పేరుమీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిద్యం. హాస్యం, సంగీతం ఈ చిత్రానికి అద్భుత విజయాన్ని సమకూర్చాయి.

ఇతివృత్తం

గుండమ్మ (సూర్యకాంతం) భర్త చనిపోయిన ఇల్లాలు, ఆమెకు గయ్యాళిగా ఊళ్ళో పేరుంటుంది. ఆమె స్వంత కూతురు సరోజ(జమున), సవతి కూతురు జమున(సావిత్రి). ఇంటెడు చాకిరీ సవతి కూతురు మీద పడుతుంది. స్వంత కూతురు సరోజ మాత్రం ఏ పనిపాటలూ రాకుండా పెంకిగా తయారవుతుంది. సరోజకు గుండమ్మ పెళ్ళిచేయాలని భావించినప్పుడల్లా ఆమె తమ్ముడు గంటయ్య(రమణారెడ్డి) ఆమె గయ్యాళి అనీ, ఆమె కూతురు బద్ధకస్తురాలనీ చెప్పి, చూపించి పెళ్ళి చెడగొడతూంటాడు. ఎలాగైనా హత్యచేసి జైల్లో ఉన్న తన కొడుకు (రాజనాల)కి విడుదలయ్యాకా అతనికి ఇచ్చి చేయాలని, అలా చేయాలంటే గుండమ్మ ప్రయత్నాలన్నీ వ్యర్థం కావాలని అతని పథకం. పెళ్ళిళ్ళ పేరయ్య ద్వారా ఒక జమీందారు రామభద్రయ్య (ఎస్.వి.రంగారావు) ఇద్దరు కొడుకులకు, గుండమ్మ ఇద్దరు కూతుళ్ళను ఇచ్చి పెళ్ళిచేయవచ్చునన్న సంబంధం వస్తుంది. రామభద్రయ్య ఆ ఊరు, తండ్రి పేరు వినగానే ఆయన చనిపోయిన తన స్నేహితుడేనని చెప్తాడు. దాంతో రామభద్రయ్య పెళ్ళి సంబంధం కుదుర్చుకోవడానికి వచ్చి అ యింటి పరిస్థితి అర్ధం చేసుకొంటాడు.

పెద్దకుమార్తె అన్ని విధాలా మంచి గృహిణి అయ్యేదే అయినా ఆమెకు మంచి సంబంధం చేయడం గుండమ్మకు ఇష్టం లేదు, ఏదోక అనాథ, పనివాడు లాంటి బాపతు వ్యక్తికి ఇచ్చిచేసి ఇద్దరినీ ఇంట్లో శాశ్వతంగా పనివాళ్ళను చేసుకోవాలని ఆలోచన. ఇక రెండవ కూతురు పెంకెతనం, బద్ధకం ఉన్నా అవన్నీ తల్లి పెంపకం లోపం వల్ల వచ్చినవేనని పిల్ల మాత్రం మంచిదేనని రామభద్రయ్య నమ్మకం. కానీ ఆమెను కూడా ఎవరైనా ఇల్లరికం వచ్చేవారికి ఇచ్చి చేయాలని ఆశిస్తూంటుంది గుండమ్మ. ఇలా ఇద్దరూ తన కొడుకులకు సరిపోయే పెళ్ళికూతుళ్ళే అయినా గుండమ్మ, ఆమె దగ్గర చేరిన గంటయ్య ఈ పెళ్ళిళ్ళు పడనివ్వరన్న ఆలోచనతో తన కొడుకులు ఆంజనేయ ప్రసాద్ (ఎన్.టి.రామారావు), రాజా (అక్కినేని నాగేశ్వరరావు)లను పిలిచి పరిస్థితులు వివరిస్తాడు.

వారి పథకం ప్రకారం పెద్దకొడుకు ఆంజనేయప్రసాద్ అంజిగా గంటయ్య ద్వారా గుండమ్మ ఇంట్లో పనివాడిగా చేరతాడు. పొగరున్నా మాంచి పనిమంతుడుగా గుండమ్మను ఆకట్టుకుంటాడు, గంటయ్యని దెబ్బకుదెబ్బ మాటకు మాటతో అదుపుచేస్తూంటాడు. మరోవైపు గుండమ్మ సవతి కూతురు లక్ష్మిని సాటి పనివాడిగా, మంచి మనసున్నవాడిగా ఆకర్షిస్తాడు. గుండమ్మకు ఓ కూతురుతో పాటుగా కొడుకు(హరనాథ్) కూడా ఉంటాడు. అతనూ, ఓ అమ్మాయి(ఎల్.విజయలక్ష్మి)తో ప్రేమించుకుంటూంటారు. ఆమెకు అన్నయ్యగా రామభద్రయ్య రెండో కొడుకు రాజా ప్రవేశించి, గుండమ్మ స్వంతకుమార్తె సరోజను ఆకట్టుకుంటాడు.

సరోజ మంకుపట్టు పట్టడంతో రాజా వివరాలు తెలుసుకుని అతను ఆస్తిపరుడేనని అంజి చెప్పగా గుండమ్మ పెళ్ళికి అంగీకరిస్తుంది. కానీ ఆమెకన్నా పెద్దదైన గుండమ్మ లక్ష్మి పెళ్ళి సంగతి ఏం చేయాలన్న ఆలోచన వస్తుంది. అదే సమయానికి అంజి తనకు పెళ్ళిచేయకపోతే పనిచేయనని మొండికేస్తాడు. గుండమ్మ లక్ష్మి పెళ్ళి విషయంలో సతమతం కావడం అదనుగా తీసుకుని, "నీకు ఇప్పుడు రెండు సమస్యలు, ఒకటి నా పెళ్ళి, మరోటి బుల్లెమ్మ పెళ్ళి. నాకో పెళ్ళికూతుర్ని తెచ్చి, బుల్లెమ్మకో పెళ్ళికొడుకుని తెచ్చి-తంటాలు ఏం పడతావు కానీ మా ఇద్దరికీ పెళ్ళి చేసెయ్" అని సలహాఇవ్వడంతో పనిచేస్తూండే అనాథ అన్న తనకు కావాల్సిన లక్షణాలు అంజిలో దొరకడంతో అంజికి తన సవతి కూతురిని ఇచ్చి పెళ్ళిచేసేస్తుంది. అలానే తన స్వంత కూతురిని రాజాకు ఇచ్చి చేస్తుంది.

కానీ రాజా దుర్వ్యసనాలకు బానిస అని, దొంగతనాలు చేస్తూంటాడని, అతను చెప్పినట్టు ఆస్తిపరుడూ కాడని కొత్త నాటకం మొదలుపెడతారు. దాంతో గుండమ్మ ఈ వేదన భరించలేకపోతుంది. ఇంతలో రాజా తప్పతాగి అల్లరిచేస్తూంటే అదుపుచేయబోగా సరోజ, గుండమ్మ తిట్టారని కోపగించినట్టు వంకపెట్టి అంజి భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు. రాజా కూడా అలిగినట్టు నటించి తన భార్య సరోజను తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. అంజి సమస్య తీరిపోవడంతో నేరుగా తన బంగ్లాకే తీసుకుపోయి తానెవరో చెప్పేస్తాడు. కానీ భార్య బద్ధకస్తురాలు కావడంతో ఆమెని సరిజేసుకునేందుకు రాజా మాత్రం తమ తోటలోనే ఓ పనివాడిగా తోటలోని ఇంట్లో ఉంటాడు.

ఆమెకు కాయకష్టం చేసుకుని జీవించడంలోని తృప్తి, తన చేత్తో వండిపెట్టడంలోని ఆనందం అనుభవంలోకి తీసుకువస్తాడు. వెన్నెల్లో భర్తతో కలసి తోటలో కష్టపడి అలసిపోవడాన్ని కూడా ఆమె ఇష్టపడడం ప్రారంభిస్తుంది. ఆమెకు ఆర్థిక కష్టాలను, వాటిని కూడా సర్దుకుని ఉన్నంతలో తృప్తిగా జీవించడాన్ని కూడా అలవాటు చేస్తూంటాడు.

మరోవైపు గుండమ్మ కొడుకు తాను ఇష్టపడ్డ అమ్మాయిని గుండమ్మ ఇష్టానికి విలువనివ్వకుండా ప్రేమించి పెళ్ళిచేసుకుంటాడు. గుండమ్మ కోడలి కుటుంబసభ్యులు అంతటి గయ్యాళికి కోడలుగా వెళ్తోంది ఎలా నెట్టుకువస్తుందోనని బాధపడుతుంటే వారి దూరపుబంధువు, కొత్త పెళ్ళికూతురికి అత్త వరస అయ్యే దుర్గమ్మ (ఛాయాదేవి) తాను వెళ్ళి గుండమ్మ అంతు తేలుస్తానంటుంది. దుర్గమ్మ వచ్చి గుండమ్మ ఇల్లు దోచేస్తూ, గుండమ్మ మీదే దొంగతనం నేరం వేసి ఆమె కొడుకు, కోడలు ముందు దొంగని చేస్తుంది. గంటయ్య కొడుకు జైలు నుంచి విడుదలై వచ్చి దుర్గమ్మ దొంగసొమ్ములో వాటా కోసం, గుండమ్మపైన ఆమె ఇంట్లోనే రౌడీయిజం చేస్తాడు.

ఇంతలో లక్ష్మి భర్త అంజితో వచ్చి, తాము నిజానికి శ్రీమంతులమని చెప్పడంతో గుండమ్మ సంతోషిస్తుంది. ఇప్పుడు స్వంత ఇంట్లోనే అనాథలా బ్రతుకుతున్నాని చెప్పగా అంజి ఆమె సమస్య తీరుస్తానంటాడు. అతని భార్య దుర్గమ్మతో తలపడి ఆమె నుంచి గుండమ్మ నగలు, డబ్బు లాక్కుని గుండమ్మకే ఇస్తుంది. ఇంతలో ఆమెకు మద్దతుగా ఉన్న రౌడీ రాగా అంజి అతనితో ఫైట్ చేసి ఓడిస్తాడు. మొత్తానికి వారిద్దరూ గుండమ్మ ఇంట్లో సమస్యగా తయారైన గంటయ్య కొడుకుని, దుర్గమ్మనీ తరిమేస్తారు.

మరోవైపు కష్టం విలువ తెలిసిన మనిషిగా, అభిమానవతిగా తయారైన సరోజను ఆమె భర్త గారెలు వండిపెట్టమని కోరి, అందుకు అవసరమైనంత జీతాన్ని యజమాని నుంచి తీసుకునేందుకు పంపుతాడు. యజమానిగా తనను ఒకసారి తన కొడుక్కి చూసుకోవడానికి వచ్చిన రామభద్రయ్యే ఉండడంతో ఇబ్బందిపడుతుంది, అతను డబ్బు ఇవ్వక తనను తన భర్తను అవమానిస్తుంటే తక్షణం అక్కడ ఉండనని బయలుదేరుతుంది. ఇంతలో తన అక్క, ఆమె భర్త అంజి అక్కడ కారులో కనిపించి జరిగినదంతా చెప్తారు.మఆ యజమాని రామభద్రయ్యే తమ మావయ్య అని తెలుస్తుంది. గుండమ్మ కూడా వారింటికి రావడం, అందరిలో ఇల్లరికానికి విరుగుడుగా అల్లుడరికాన్ని తీసుకువస్తానని అంజి చమత్కరించడంతో కథ ముగుస్తుంది.

నిర్మాణం

అభివృద్ధి

జానపద బ్రహ్మగా పేరొందిన విఠలాచార్య కన్నడంలో మనె తుంబిద హెణ్ణు పేరిట కుటుంబ కథాచిత్రాన్ని తెరకెక్కించారు. చిత్ర నిర్మాణానికి విఠలాచార్య నిర్మాత, వాహినీ స్టూడియోస్ అధినేత బి.నాగిరెడ్డి సహకారం పొందారు. ఆ కృతజ్ఞతతో నాగిరెడ్డి అడగగానే సినిమా హక్కుల్ని విఠలాచార్య ఆయనకి ఇచ్చేశారు. మనె తుంబిద హెణ్ణు సినిమాలో గుండమ్మ అనే గయ్యాళికి, నోరుమెదపలేని భర్త ఉంటాడు. ఆమె తన సవతి కూతురుని ఓ పిచ్చివాడికి ఇచ్చి పెళ్ళిచేస్తుంది. ఆ విషయం తెలిసిన సవతి కూతురు మేనమామ గుండమ్మపై పగబడతాడు. అతను గుండమ్మ స్వంత కూతురికి నేరాలకు అలవాటుపడ్డ జైలుపక్షికి ఇచ్చి పెళ్ళిజరిగేలా పథకం ప్రకారం చేయిస్తాడు. ఇలా సాగుతుంది ఆ సినిమా. అయితే ఇందులో గుండమ్మ కుటుంబ వ్యవహారాలు నాటకీయంగా సాగుతూ, నాగిరెడ్డికి చాలా తమాషాగా అనిపించాయి. దాంతో విజయా ప్రొడక్షన్స్ చరిత్రలోనే తొలిసారి ఓ రీమేక్ చేసేందుకు సిద్ధపడ్డారు.
కథలో చిన్న చిన్న మార్పులు చేసి డి.వి.నరసరాజుతో ట్రీట్మెంట్, మాటలు రాయించేశారు నాగిరెడ్డి. సినిమాకు దర్శకునిగా నాగిరెడ్డి సోదరుడు బి.ఎన్.రెడ్డిని అనుకున్నారు. అయితే బి.ఎన్.రెడ్డి కళాత్మక చిత్రాల తరహా దర్శకుడు కావడమూ, ఇది ఆయన తరహా సినిమా కాకపోవడంతో పాటు బి.ఎన్.రెడ్డి లాంటి అగ్ర దర్శకుడు ఓ రీమేక్ సినిమా చేస్తే బాగోదన్న అనుమానం రావడంతో నాగిరెడ్డే వేరే దర్శకునితో చేద్దామని నిర్ణయించుకున్నారు. పి.పుల్లయ్య దర్శకత్వం వహిస్తే బావుంటుందని, ఆయనకు నరసరాజు సిద్ధం చేసిన డైలాగ్ వెర్షన్ ఆయనకు పంపారు. అది చదివిన పుల్లయ్య ఈ కథ, ట్రీట్మెంట్ నాకు నచ్చలేదు అని ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దాంతో సినిమా నిర్మాణం మళ్ళీ వెనుకబడింది.
ఈ స్క్రిప్ట్ తన సన్నిహితుడు, సహ నిర్మాత, రచయిత అయిన చక్రపాణికి ఇచ్చారు నాగిరెడ్డి. చక్రపాణికి వికలాంగులు, పిచ్చివాళ్ళతో హాస్యం చేస్తూ సీన్లు నడపడం అంతగా నచ్చదు. దాంతో హీరో పిచ్చివాడు కావడమే ప్రధానమైన పాయింట్ అయిన ఈ సినిమా స్క్రిప్ట్ ఆయనకు నచ్చలేదు. కానీ గుండమ్మ కుటుంబ వ్యవహారాలు, ఆ పాత్రలు బాగా నచ్చిన నాగిరెడ్డి మాత్రం ఎలాగైనా సినిమా తీయాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు. దాంతో చక్రపాణి మొత్తం స్క్రిప్టును తిరగరాసే పనిలో పడ్డారు. విలియం షేక్‌స్పియర్ రాసిన ద టేమింగ్ ఆఫ్ ద ష్రూ నాటకంలో కథానాయికల పాత్రలను, వారి స్వభావాలను ఆధారం చేసుకుని చక్రపాణి కథను తిరగరాశారు.
సినిమాకు దర్శకునిగా చివరకు కమలాకర కామేశ్వరరావుని ఎంచుకున్నారు నాగిరెడ్డి. తర్వాత చక్రపాణి తిరగరాసిన కథకు ట్రీట్మెంట్, సీనిక్ ఆర్డర్ కోసం కథాచర్చలకు చక్రపాణితో, కమలాకర కామేశ్వరరావు, డి.వి.నరసరాజు కూర్చున్నారు. ఆ చర్చల్లో భాగంగా అప్పటివరకూ ఉన్న గుండమ్మ భర్త పాత్రను తీసేసి గుండమ్మను వైధవ్యం అనుభవిస్తున్నదానిగా చూపిద్దామని నిర్ణయించారు చక్రపాణి. అయితే కళకళలాడుతూ, నగలతో పసుపుకుంకుమలతో గుండమ్మను చూపిద్దామనుకున్న దర్శకుడు కామేశ్వరరావు ఆశాభంగం చెందారు. కానీ చక్రపాణి స్క్రిప్ట్ రచయితగా కథకు ఉపయోగపడని, కథలో మలుపులకు కారణం కాని పాత్ర వ్యర్థమన్న దృష్టితో "పెళ్ళానికి సమాధానం చెప్పలేని వాడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ పాత్ర మన కథకు అనవసరం" అంటూ తేల్చి, పాత్రను తొలగించేశారు. అయితే మిగతా గుండమ్మ కుటుంబాన్నంతా యధాతథంగా తీసుకున్నారు.[1]

నటీనటుల ఎంపిక

సినిమా కథని చక్రపాణి తిరగరాసిన తర్వాత మాటల రచయిత నరసరాజు, దర్శకుడు కామేశ్వరరావు, స్క్రీన్ ప్లే రచయిత చక్రపాణిల మధ్య జరిగిన కథాచర్చల్లో నటీనటుల ఎంపిక జరిగింది. ఆ చర్చల్లోనే వెంటనే ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావులను తీసుకుందామని నిర్ణయించుకున్నారు. సినిమా అనుకున్ననాడే గుండమ్మ పాత్రకు సూర్యకాంతం అయితేనే సరిపోతారని భావించారు. గుండమ్మ నిజానికి తెలుగుపేరు కాదు కన్నడపేరు. కన్నడంలోని ఈ సినిమా మాతృకలో ఓ పాత్ర పేరు గుండమ్మ. కథను తిరగరాసే క్రమంలో ఆ గుండమ్మ పాత్రను ప్రధానపాత్రగా చేసుకున్నారు. ఆ పాత్రకు ఏ పేరుపెట్టాలా అని తర్జనభర్జనలు పడుతుంటే, మరో పేరు ఎందుకు గుండమ్మ అన్న పేరే పెట్టేద్దామని నిర్ణయించారు చక్రపాణి. అంత కీలకమైన పాత్రకి పెట్టే పేరు తెలుగుపేరు కాకపోవడమా అన్న సందేహాన్ని చిత్రబృందం వ్యక్తం చేస్తే, "ఇందులో ఏముంది, పెడితే అదే తెలుగు పేరు అవుతుంది" అని కొట్టిపారేసి గుండమ్మ అన్న పేరు ఖాయం చేసేశారు.
సినిమాలో నటించిన ఇద్దరు కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్నార్ అప్పటికే తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోలు. సినిమా విడుదల సమయంలో టైటిల్స్ లో ఎవరి పేరు ముందువేయాలి, ఎవరి పేరు తర్వాత వేయాలి వంటి సందేహాలు వచ్చాయి. అయితే దీన్ని పరిష్కరించేందుకు అసలు తెరపై పేర్లే వేయకుండా ఫోటోలు చూపించాలని నిర్ణయించుకున్నారు. మొదట ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, జమున, ఎస్వీ రంగారావుల ఫోటోలు ఒకేసారి తెరపై వేసి, తర్వాత ఒకేసారి సూర్యకాంతం, ఛాయాదేవి, రమణారెడ్డి, హరనాథ్, ఎల్.విజయలక్ష్మిల ఫోటోలు వేశారు.[1]

చిత్రీకరణ

గుండమ్మ కథ సినిమాని విజయా నిర్మాతలకు చెందిన వాహినీ స్టూడియోస్ లో నిర్మించారు. సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా మార్కస్ బార్ట్లే వ్యవహరించారు. చిత్రీకరణలో అవసరమైన సెట్ లను కళాదర్శకులుగా వ్యవహరించిన గోఖలే, కళాధర్ వేశారు. మేకప్ ఎం.పీతాంబరం, టి.పి.భక్తవత్సలం వేశారు.[2] సినిమాలో ముఖ్యపాత్రలు చేసిన ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఎస్.వి. రంగారావు, సూర్యకాంతం తదితరులు పరిశ్రమలో చాలా బిజీ ఆర్టిస్టులు. వీళ్ళందరిపై ఒకేసారి షూటింగ్ చేయాలంటే వాళ్ళ డేట్స్ కలిసేవి కాదు. కాల్షీట్ సమస్య వల్ల అలాంటి సన్నివేశాల వరకూ అలా కుదిరిన కొన్ని డేట్లలో తీసి మిగతా సినిమాను వేరే పద్ధతిలో తెరకెక్కించారు. ఏ షాట్, ఎవరెవరి కాంబినేషన్లో షాట్ తీయాలన్నా సమస్య లేకుండా బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంగా పెట్టుకున్నారు. విజయా వారికి చెందిన వాహినీ స్టూడియోలో గుండమ్మ ఇంటి సెట్ వేసివుంచారు. రోజూ ఉదయం చక్రపాణి ఆఫీసుకు వచ్చేసి రామారావు, సావిత్రి, నాగేశ్వరరావు, ఎస్వీఆర్ మొదలై నటులకు ఫోన్ చేసేవారు. ఫోన్లో ఆరోజు వాళ్ళ షెడ్యూల్ ఏంటో కనుక్కునేవారు. ఒకవేళ ఎవరైనా ఈరోజు షూటింగ్ కి వెళ్ళాలి అంటే సరేనని తర్వాతి రెండ్రోజుల సంగతి తెలుసుకుని ఫోన్ పెట్టేసేవారు. మరెవరైనా ఆ రోజు ఖాళీగా ఉన్నానంటే పిలిపించేవారు. వచ్చినవాళ్ళలో స్క్రిప్ట్ ని బట్టి వాళ్ళ మధ్య కాంబినేషన్ సీన్లు చూసుకుని వాళ్ళతో షూటింగ్ చేసేవారు. సినిమాలో "కోలో కోలోయన్న" పాట ఎన్టీఆర్-సావిత్రి, ఏఎన్నార్-జమున జంటలు పక్కపక్కనే ఉండి పాడుకుంటున్నట్టు చూపించారు. కానీ నలుగురు ఒకేసారి కలిసి చేయనేలేదు. ఎవరికి ఎప్పుడు ఖాళీవుంటే వారితో అప్పుడు పాటను తీసేశారు. ఎడిటింగ్ లో ఆ తేడాలు తెలియకుండా జాగ్రత్తపడ్డారు.

నిర్మాణానంతర కార్యక్రమాలు

సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఆడియోగ్రఫీగా ఎ.కృష్ణన్, సౌండ్ ఇంజనీర్ గా వి.శివరాం వ్యవహరించారు. గుండమ్మకథను జి.కళ్యాణసుందరం ఎడిటింగ్ చేయగా ఆయనకు సహాయకునిగా డి.జి.జయరాం వ్యవహరించారు. సినిమా రీల్ ని విజయా లేబొరేటరీస్ లో ప్రాసెస్ చేశారు.[2] సినిమాలో పలు సన్నివేశాల్లో నటించిన నటులంతా లేకున్నా దొరికిన వారితో దొరికినట్టుగా తీసేశారు. దాంతో ఆ తేడా తెలియకుండా ఎడిటింగ్ లో జాగ్రత్తలు తీసుకున్నారు.[1]

విడుదల

గుండమ్మకథ సినిమా జూన్ 7, 1962న రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది.

విమర్శలు

సినిమా విడుదలకు ముందే విమర్శలు చెలరేగాయి. సినిమా రిలీజ్ కి ఇంకా పదిరోజుల సమయం ఉందనగానే, ఎల్వీ ప్రసాద్ ఇంట్లో జరిగిన పెళ్ళివేడుకల్లో గుండమ్మ కథ సినిమాను ప్రదర్శించారు. సినిమా చూసిన సినిమా వర్గాలు సినిమాలో కథే లేదని, సూర్యకాంతం గయ్యాళితనాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదని విమర్శలు ప్రచారం చేశారు. హరనాథ్-విజయలక్ష్మి చేసిన పాత్రలు అనవసరమని, జమున పాత్ర చిత్రణ సరిగా లేదని మరికొందరు విమర్శించారు. చివరికి విజయా వారి నిర్మాణంలో మాయాబజార్ సహా పలు చిత్రాలు తీసిన దర్శకుడు కె.వి.రెడ్డి సినిమా బాగోలేదని అన్నారు. ప్రివ్యూ తర్వాత నరసరాజుకు తన అభిప్రాయాన్ని చెప్తూ-"అదేం కథండీ! కృష్ణా, గుంటూరు జిల్లాల సంపన్న వర్గాల కథలా వుంది. చక్రపాణి గారే రాయగలరు అలాంటి కథలు. మీరు రాసిన డైలాగులు బాగున్నాయనుకోండి. ఒక్క డైలాగులతోనే పిక్చర్ నడుస్తూందా" అన్నారు. సినిమా విడుదలై హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నప్పుడు- విజయా వారి సినిమా, పెద్ద నటీనటులు నటించారు. మొదట్లో హౌస్ ఫుల్ అవుతాయి. పోగాపోగా చూద్దాం అనేవారు. సినిమా ఘన విజయమని స్థిరపడిపోయాకా కూడా ఆయన సమాధాన పడలేదు, ఏంటోనండి. జనం ఎందుకు చూస్తున్నారో అర్థంకావట్లేదు అంటూ గుండమ్మకథ ప్రస్తావన వచ్చినపపుడల్లా అనేవారు.[1]

స్పందన

సినిమా విడుదల ముందు విమర్శలు రావడంతో విడుదల సమయంలో చిత్రవర్గాలు ఉత్కంఠతో ఎదురుచూశారు. గుండమ్మ కథ ప్రివ్యూ చూసినప్పుడు ఎన్టీఆర్ నిక్కర్లో తెరపై కనిపించగానే ప్రివ్యూ చూస్తున్న చిన్నపిల్లలంతా ఒక్కపెట్టున నవ్వారు. అది చూసిన చక్రపాణి ఆ అంచనాతోనే ప్రివ్యూ అవగానే "ఎవరెన్ని అనుకున్నా సినిమా సూపర్ హిట్" అని తేల్చేశారు. ఆయన అంచనాలు నిజం చేస్తూ సినిమా అప్రతిహత విజయాలను సాధించింది.

సంభాషణలు

డి.వి.నరసరాజు పసందైన సంభాషణలు అందించాడు. మచ్చుకు:

  • పాలలో నీళ్ళు కలపకపోతే పెట్రోల్ కలుపుతారా?
  • వున్నోళ్ళంతా యదవలైతే మన తెలివికేం? దివిటీలా వెలిగిపోదూ?
  • ఆశకు చావు లేదు

సంగీతం

సినిమాకు ఘంటసాల సంగీత దర్శకత్వం వహించారు. అన్ని పాటలూ పింగళి నాగేంద్రరావు రాశారు. పాటలకు నృత్యదర్శకత్వం పసుమర్తి కృష్ణమూర్తి వహించారు. ఘంటసాల, పి.సుశీల, పి.లీల పాటలు ఆలపించారు.[2]

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
ఎంత హాయి ఈ రేయి, ఎంత మధుర మీ హాయి పింగళి నాగేంద్రరావు ఘంటసాల ఘంటసాల, పి.సుశీల
కోలోకోలో యన్నకోలో నాసామి కోమ్మలిద్దరు మాంచిజోడు పింగళి నాగేంద్రరావు ఘంటసాల ఘంటసాల, పి.సుశీల
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో పింగళి నాగేంద్రరావు ఘంటసాల ఘంటసాల, పి.సుశీల
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే తెలుపక తెలిపే అనురాగము నీ కనుల నే కనుగొంటిలే పింగళి నాగేంద్రరావు ఘంటసాల ఘంటసాల
లేచింది నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం పింగళి నాగేంద్రరావు ఘంటసాల ఘంటసాల
వేషము మార్చెనూ భాషను మార్చెను మోసము నేర్చెను అసలు తానే మారెను పింగళి నాగేంద్రరావు ఘంటసాల ఘంటసాల, పి.లీల
సన్నగవీచే చల్లగాలికి కనులు మూసినా కలలాయే తెల్లని వెన్నెల పానుపుపై ఆ కలలో వింతలు కననాయె పింగళి నాగేంద్రరావు ఘంటసాల పి.సుశీల
అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలూ, రుసరుసలాడే చూపులతోనే ముసిముసి నవ్వుల చందాలూ పింగళి నాగేంద్రరావు ఘంటసాల పి.సుశీల

మూలాలు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
  • http://www.idlebrain.com/nosta/index.html
  1. 1.0 1.1 1.2 1.3 వట్టికూటి, చక్రవర్తి. "యాభై వసంతాల గుండమ్మకథ". ఈనాడు ఆదివారం. Retrieved 19 August 2015.
  2. 2.0 2.1 2.2 గుండమ్మ కథ సినిమా టైటిల్స్