రుక్మిణీదేవి అరండేల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Uccha (చర్చ) చేసిన మార్పులను, Mpradeep వరకు తేసుకువెళ్ళారు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[బొమ్మ:Rukmini Devi.jpg|thumb|right|రుక్మిణీదేవి అరండేల్ ]]
[[బొమ్మ:Rukmini Devi.jpg|thumb|right|రుక్మిణీదేవి అరండేల్ ]]

==రుక్మిణీదేవి అరండేల్ ==
రుక్మిణీదేవి అరండేల్ తమిళనాడులోని చెన్నై లో కళా క్షేత్ర నాట్యపాఠశాల వ్యవస్తాపకురాలు.ఆమె స్వయంగా నృత్య కళాకారిణి.కళలయందు ఆమెకున్న మక్కువ ఆమెను కర్నాటక సంగీతం,బాలే,భరతనాట్యాలలో ప్రావీణ్యం
సంపాదించేలా చేశాయి.ఆమె భరత నాట్యం శిక్షణ కొరకు పాఠసాల స్తాపించి భరతనాట్యం ప్రాచుర్యము,గౌరవము
ఇనుమడింప చేసింది.ఆమె ఎన్నోవ్యయప్రయాసలకు లోనయి ఈ ప్రయత్నాన్ని విజయ వంతం చేశారు.
== జననం ==
== జననం ==
ఈమె 1904వ సంవత్సరం,పిబ్రవరి 29వ తారీఖున నీలఖంఠ శాస్త్రి,శేషమ్మ దంపతులకు తమిళనాడులో ఉన్న మధురలో జన్మించింది.కళలయందు కల ఆసక్తి వలన పెద్దలు నిర్ణయించిన బాల్య వివాహాన్ని చేసుకోవడానికి నిరాకరించింది.ఆతరువాత కర్నాటక సంగీతాన్ని అభ్యసించడం ఆరంభించింది.తన ఏడవ సంవత్స్రరంలో తండ్రి పని చేసే దియాసాఫికల్ సొసైటీలో చేరింది.
ఈమె 1904వ సంవత్సరం,పిబ్రవరి 29వ తారీఖున నీలఖంఠ శాస్త్రి,శేషమ్మ దంపతులకు తమిళనాడులో ఉన్న మధురలో జన్మించింది.కళలయందు కల ఆసక్తి వలన పెద్దలు నిర్ణయించిన బాల్య వివాహాన్ని చేసుకోవడానికి నిరాకరించింది.ఆతరువాత కర్నాటక సంగీతాన్ని అభ్యసించడం ఆరంభించింది.తన ఏడవ సంవత్స్రరంలో తండ్రి పని చేసే దియాసాఫికల్ సొసైటీలో చేరింది.

03:41, 1 ఆగస్టు 2007 నాటి కూర్పు

రుక్మిణీదేవి అరండేల్

రుక్మిణీదేవి అరండేల్

రుక్మిణీదేవి అరండేల్ తమిళనాడులోని చెన్నై లో కళా క్షేత్ర నాట్యపాఠశాల వ్యవస్తాపకురాలు.ఆమె స్వయంగా నృత్య కళాకారిణి.కళలయందు ఆమెకున్న మక్కువ ఆమెను కర్నాటక సంగీతం,బాలే,భరతనాట్యాలలో ప్రావీణ్యం సంపాదించేలా చేశాయి.ఆమె భరత నాట్యం శిక్షణ కొరకు పాఠసాల స్తాపించి భరతనాట్యం ప్రాచుర్యము,గౌరవము ఇనుమడింప చేసింది.ఆమె ఎన్నోవ్యయప్రయాసలకు లోనయి ఈ ప్రయత్నాన్ని విజయ వంతం చేశారు.

జననం

ఈమె 1904వ సంవత్సరం,పిబ్రవరి 29వ తారీఖున నీలఖంఠ శాస్త్రి,శేషమ్మ దంపతులకు తమిళనాడులో ఉన్న మధురలో జన్మించింది.కళలయందు కల ఆసక్తి వలన పెద్దలు నిర్ణయించిన బాల్య వివాహాన్ని చేసుకోవడానికి నిరాకరించింది.ఆతరువాత కర్నాటక సంగీతాన్ని అభ్యసించడం ఆరంభించింది.తన ఏడవ సంవత్స్రరంలో తండ్రి పని చేసే దియాసాఫికల్ సొసైటీలో చేరింది.

వివాహం

ఈమె తన అభిరుచులకతో,ఆలోచనలతో ఏకీభవించిన అరండేల్ అనే విదేశీయుణ్ణి ప్రేమించి పెళ్ళి చేసుకుంది.అప్పుడు ఆమె వయసు 16,అరండేల్ కు 40.వీరి వివాహము పెద్దల విపరీతమైన అభ్యంతరాల మధ్య ముంబయ్ లో రిజిస్టర్ ఆఫీసులోజరిగింది.

నాట్య అభ్యాసం

వివాహానంతరం ఈమె తన భర్తతో అనేక ప్రదేశాలను దర్శిందచే అవకాశం లభించింది.ఆమె తనకు సహజంగానే ఉన్న కళలయందున్న ఆసక్తిచేత అన్నాబావ్లే అనే రష్యా కళాకారిణి చేసిన బాలే నృత్యము చేత ఆకర్షించబడి,ఆమె సహాయంతోనే ఆమె గురువైన కిళియోనర్టిని గురువుగా స్వీకరించి రుక్మిణీ దేవి బాలే నృత్యాన్ని అభ్యసించింది.ఆపై అన్నాబావ్లే సలహా అనుసరించి తన భరతనాట్య శిక్షణకు కావసిన ప్రయత్నాలు ప్రారంభించింది.కాని ఆరంభంలో అనేక తిరస్కారాలను చవిచూసింది.ఆ రోజులలో స్త్రీలు నాట్యాన్ని అభ్యసించడం అవమానంగా భావించడం చేత ఆరంభంలో అనేక విమర్శలు ఎదుకున్నా ఆమె తన పట్టు విడవకుండా మీనాక్షి సుందరం పిళ్ళై దగ్గర శిష్యరికం చేసి భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది.

అరంగేట్ట్రం

రుక్మిణీదేవి తన మొదటి నాట్య ప్రదర్శనని,దియాసాఫికల్ సొసైటి వజ్రోత్సవాలలో ఇరవై వేల మంది ప్రేక్షకుల ఎదుట చేసి పలువురి ప్రశంశలకు పాత్రురాలు అయినది.రామసామి అయ్యర్,శివసామి అయ్యర్ మొదలైన ప్రమఖుల సముఖంలో జరిగిన ఈ ప్రదర్శన జేంస్ కజిన్స్ అనే ఇర్లాండ్ కవిని ఆకర్షించింది.

నాట్య పాఠశాల ఆరంభం

ఐర్లాండ్ కవి ఆమె యొక్క ప్రతిభను పది మందికి పంచి పెట్ట మని,అందుకు తగిన విధంగా నాట్య పాఠశాల ఆరంభించాలని కోరిక వెలిబుచ్చాడు.కవి జేంస్ కోరిక ఆమెను నాట్య పాఠశాల ఆరంభించేలా ఉత్తేజ పరచింది. ప్రారంభంలో ఆమె నాట్య పాఠశాలకు "ఇంటర్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్" నామకరణం చేసి అనేక మంది ప్రముఖుల సమక్షం లో జరిగింది.తరువాత కాలంలో అదే కళాక్షేత్రంగా రూపుదిద్దుకుంది.

పాఠశాల నిర్వాహం

నాట్య పాఠశాలకు ఆమె మొదటి గురువైన సుందరం పిళ్ళై ,అతని అల్లుడు చొక్కలింగం పిళ్ళై ఉపాధ్యాయులుగా ఉన్నారు.మొదటి విద్యార్ధుల సంఖ్య కేవం నలుగురు మాత్రమే.ఈ పాఠశాలలో నాట్యమేకాక సంగీతమూ నేర్పుతారు.అందమైన తోటలు,తామర కొలనులు,సంప్రదాయమైన కట్టడాలు ఈ పాఠశాలను నాట్య దేవాలయంలా చేశాయి.అడూగడుగునా ఆమె కృషి,అభిరుచి ప్రతిభింభిస్తూ ఈ పాఠశాల నాట్య రంగానికి ఎనలేని కృషి చేస్తూ ఉంది.ఈ పాఠశాల ఆమె సేవను చిరస్తాయిని చేసి చిరకాలం గుర్తుంచుకునేలా చేసినంది.

బిరుదులు

రుక్మిణీదేవి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆమెను" పద్మభూషణ్",శాంతినికేతన్ "దేశికోత్తం"బిరుదులతో సత్కరించింది.భరతనాట్యానికి గుర్తింపు గౌరవాన్ని కలిగించి,దానిలోని దైవీక తత్వాన్ని ప్రపంచానికి చాటిన ఘనతలో రుక్మిణీ దేవి అరండేల్ కు ప్రదాన పాత్ర ఉంది.కళాక్షేత్ర విద్యార్ధులు నేడు వివిధ రంగాలలో ప్రకాశిస్తున్న వారు అనేకమంది.