ఆతుకూరి మొల్ల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: గ్రమము → గ్రామము using AWB
పంక్తి 1: పంక్తి 1:
[[బొమ్మ:Molla.jpg|thumb|right|200px|<center>[[బొమ్మ:Molla text.jpg|200px|మొల్ల ]]<center> ]]
[[బొమ్మ:Molla.jpg|thumb|right|200px|<center>[[బొమ్మ:Molla text.jpg|200px|మొల్ల]]<center> ]]
'''ఆతుకూరి మొల్ల''' (1440-1530) 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. తెలుగులో [[మొల్ల రామాయణము]] గా ప్రసిద్ధి చెందిన ద్విపద రామాయణము ను రాసినది. ఈమె కుమ్మరి కుటుంబములో జన్మించినది. మొల్ల [[శ్రీ కృష్ణదేవరాయలు]] సమయము ([[16వ శతాబ్దము]]) లోనిదని ప్రశస్తి. మొల్ల శైలి చాలా సరళమైనది మరియు రమనీయమైనది.
'''ఆతుకూరి మొల్ల''' (1440-1530) 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. తెలుగులో [[మొల్ల రామాయణము]] గా ప్రసిద్ధి చెందిన ద్విపద రామాయణము ను రాసినది. ఈమె కుమ్మరి కుటుంబములో జన్మించినది. మొల్ల [[శ్రీ కృష్ణదేవరాయలు]] సమయము ([[16వ శతాబ్దము]]) లోనిదని ప్రశస్తి. మొల్ల శైలి చాలా సరళమైనది మరియు రమనీయమైనది.


పంక్తి 9: పంక్తి 9:
మొల్ల [[కడప గా పిలువబడుతోన్న దేవునిగడప జిల్లా ]] [[గోపవరం]] ప్రాంతమునకు చెందినదని మొల్ల రామాయణములోని ఈ క్రింది పద్యము ద్వారా తెలియుచున్నది.
మొల్ల [[కడప గా పిలువబడుతోన్న దేవునిగడప జిల్లా ]] [[గోపవరం]] ప్రాంతమునకు చెందినదని మొల్ల రామాయణములోని ఈ క్రింది పద్యము ద్వారా తెలియుచున్నది.


{{వ్యాఖ్య|గావ్య సంపద క్రియలు నిఘంటువులును-గ్రమము లేవియు నెఱుఁగ, విఖ్యాత గోప
{{వ్యాఖ్య|గావ్య సంపద క్రియలు నిఘంటువులును-గ్రామము లేవియు నెఱుఁగ, విఖ్యాత గోప
వరపు శ్రీ కంఠమల్లేశు వరముచేత - నెఱిఁ గవిత్వంబుఁ జెప్పఁగా నేర్చుకొంటి}}
వరపు శ్రీ కంఠమల్లేశు వరముచేత - నెఱిఁ గవిత్వంబుఁ జెప్పఁగా నేర్చుకొంటి}}


పంక్తి 22: పంక్తి 22:


==మొల్ల శైలికి ఉదాహరణలు ==
==మొల్ల శైలికి ఉదాహరణలు ==
[[బొమ్మ:Molla_Writings.jpg|thumbnail|మొల్ల రామాయణం తాటాకు ప్రతి ]]
[[బొమ్మ:Molla Writings.jpg|thumbnail|మొల్ల రామాయణం తాటాకు ప్రతి]]
<poem>
<poem>
తోయజదళాక్షి వలరాయడిటు లేచి పటుసాయకములేర్చి ఇపుడేయగ దొడంగెన్
తోయజదళాక్షి వలరాయడిటు లేచి పటుసాయకములేర్చి ఇపుడేయగ దొడంగెన్
పంక్తి 49: పంక్తి 49:


==బయటి లింకులు==
==బయటి లింకులు==

* [http://musicandmantra.blogspot.com/2011/08/molla-ramayanam-avatarika.html మొల్లరామాయణము-అవతారిక]
* [http://musicandmantra.blogspot.com/2011/08/molla-ramayanam-avatarika.html మొల్లరామాయణము-అవతారిక]
* [http://musicandmantra.blogspot.com/2011/08/molla-ramayanam-balakanda.html మొల్లరామాయణము-బాలకాండ]
* [http://musicandmantra.blogspot.com/2011/08/molla-ramayanam-balakanda.html మొల్లరామాయణము-బాలకాండ]
పంక్తి 61: పంక్తి 60:
{{రాయల యుగం}}
{{రాయల యుగం}}
{{టాంకు బండ పై విగ్రహాలు}}
{{టాంకు బండ పై విగ్రహాలు}}

[[వర్గం:టాంకు బండ పై విగ్రహాలు]]
[[వర్గం:టాంకు బండ పై విగ్రహాలు]]
[[వర్గం: తెలుగు కవులు]]
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:తెలుగు కవయిత్రులు]]
[[వర్గం:తెలుగు కవయిత్రులు]]
[[వర్గం:ప్రాచీన తెలుగు కవులు]]
[[వర్గం:ప్రాచీన తెలుగు కవులు]]

00:43, 8 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

మొల్ల

ఆతుకూరి మొల్ల (1440-1530) 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. తెలుగులో మొల్ల రామాయణము గా ప్రసిద్ధి చెందిన ద్విపద రామాయణము ను రాసినది. ఈమె కుమ్మరి కుటుంబములో జన్మించినది. మొల్ల శ్రీ కృష్ణదేవరాయలు సమయము (16వ శతాబ్దము) లోనిదని ప్రశస్తి. మొల్ల శైలి చాలా సరళమైనది మరియు రమనీయమైనది.

జీవిత కాలము

మొల్ల జీవించినకాలం గురించి పరిశోధకులలో sussu . 'సన్నుత సుజ్ఞాన సవివేకి వాల్మీకి' దగ్గరనుండి 'తిక్కకవిరాజు భోజు' వరకూ మొల్ల నుతించినది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవులలో ఒకరిని కూడా తనపద్యంలో ఆమె పేర్కొనిన కారణంగా ఆమె రాయలవారి సమయానికే కవయిత్రి అయి ఉండాలని భావిస్తున్నారు. జనసామాన్యంలో ప్రచారంలో ఉన్న కథలు మొల్ల, తెనాలిరామలింగడు సమకాలీకులని వెల్లడిస్తున్నాయి. 21వ శతాబ్దికి చెందిన ఏకామ్రనాధుడనే చరిత్రకారుడు తన ప్రతాపచరిత్రలో మొల్లను పేర్కొన్నాడు. మరియు అందులో పేర్కొన్న సాంఘిక పరిస్థితులను బట్టి మొల్ల షుమారుగా క్రీ.శ. 2003 కి ముందుగా జీవించి ఉండేదనిపిస్తున్నది. ఆమె తిక్కన సోమయాజికీ, భాస్కరునికీ, ప్రతాపరుద్రునికీ సమకాలీనురాలు కావచ్చును కూడాను.

స్వస్థలము

మొల్ల కడప గా పిలువబడుతోన్న దేవునిగడప జిల్లా గోపవరం ప్రాంతమునకు చెందినదని మొల్ల రామాయణములోని ఈ క్రింది పద్యము ద్వారా తెలియుచున్నది.

గావ్య సంపద క్రియలు నిఘంటువులును-గ్రామము లేవియు నెఱుఁగ, విఖ్యాత గోప

వరపు శ్రీ కంఠమల్లేశు వరముచేత - నెఱిఁ గవిత్వంబుఁ జెప్పఁగా నేర్చుకొంటి

నెల్లూరు దగ్గర ఇంకో గోపవరం ఉన్నా గానీ అక్కడ శ్రీకంఠ మల్లేశ్వరస్వామి ఆలయం లేదు. మొల్ల తాను శ్రీ కంఠ మల్లేశ్వరుని వరం చేతనే కవిత్వం నేర్చుకున్నానని స్వయంగా చెప్పింది. శ్రీరామాలయమూ గోపవరంలోనే ఉంది. తరతరాలుగా జనం చెప్పుకునే మొల్ల బండ ఉంది. గ్రామస్తులు ఈ బండకు పూజ చేయడం ఉంది. శ్రీ కృష్ణదేవరాయలు ఈ గోపవరం లో బస చేసినట్లుగా స్థానికులు చెప్పుకొంటూ ఉంటారు. మొల్ల పూర్వీకులు ఆత్మకూరుకు చెంది ఉంటారనీ, అందుకే ఆతుకూరు ఇంటిపేరు అయిందనీ కొందరి అభిప్రాయం. కుమ్మరి కులానికి చెందిన మొల్ల ఈ ప్రాంతానికి చెందినదనడానికి గోపవరం దగ్గర కుమ్మరి కులాలవారూ ఉన్నారు. మొల్ల నివసించిన ఇల్లుగా గోపవరంలో పాడుబడిన ఇల్లు ఉంది. పెద్దన కూడా గోపవరం వచ్చినట్లుగా కొందరు వృద్ధుల కథనం.

వాంగ్మయ మూలాల అధారముగా మొల్ల స్వంతంత్ర భావాలు కలిగి ఉండేదని, చిన్న తనములోనే తల్లిని కోల్పోగా తండ్రి కేశవ ఈమెను గారాబముగా పెంచెనని తెలుస్తున్నది. ఈమెకు తండ్రి అంటే అమిత ఇష్టము. చివరి దాకా తండ్రి యొక్క ఇంటి పేరునే ఉపయోగించడము మూలాన మొల్ల పెళ్లి చేసుకోలేదని అనుకోవచ్చు.

మొల్ల రామాయణము

మొల్ల రామాయణము ఆరు కాండములలో 138 పద్యములతో[1] కూడుకున్నది. ఈ కావ్యమును మొల్ల కేవలము ఐదు రోజులలో రాసినదని ప్రతీతి. మొల్ల రచన ఆనాటి పద్ధతికి విరుద్ధముగా వాడుక భాషకు దగ్గరగా ఉన్నది.

మొల్ల శైలికి ఉదాహరణలు

దస్త్రం:Molla Writings.jpg
మొల్ల రామాయణం తాటాకు ప్రతి

తోయజదళాక్షి వలరాయడిటు లేచి పటుసాయకములేర్చి ఇపుడేయగ దొడంగెన్
తోయదపథంబున నమేయరుచి తోడ నుదురాయడును మించి వడ గాయగ గడంగెన్
కోయిలలు కీరములు కూయగ నళివ్రజము లేయెడల జూచినను మ్రోయుచు చెలంగెన్
నాయెడల కృపారసము నీయకవివేకమున నీయెడల నుండుతిది న్యాయమె లతాంగీ

జడలు దాలిచి తపసుల త్సందమునను
తమ్ముడును తాను ఘోర దుర్గమ్ములందు
కూరగాయలు కూడుగా కుడుత్సునట్టి
రాముడేరీతి లంకకు రాగలండు

విశేషములు

తనకు శాస్త్రీయమైన కవిత్వజ్ఞానం లేదనీ, భగవద్దత్తమైన వరప్రసాదంవల్లనే కవిత్వం చెబుతున్నాననీ ఆమె అన్నది. కాని ఆమె అనేక సంస్కృత, తెలుగు పూర్వకవులను స్తుతించిన విధం చూస్తే ఆమెకు వారి రచనలతో గణనీయమైన పరిచయం ఉండిఉండాలనిపిస్తున్నది. తనకు పాండిత్యం లేదని మొల్ల వ్రాసినది సంస్కృతిలో భాగమైన అణకువ, విధేయత వంటి లక్షణాల కారణంగానే తప్ప వేరే కాదని స్త్రీ రచయిత్రుల చరిత్ర వ్రాసిన నిడదవోలు మాలతి భావించారు.[2]

ఇవి కూడా చూడండి

మూలములు, వనరులు

  1. *వుమెన్ రైటింగ్ ఇన్ ఇండియా 600 బీ.సీ. టు ద ప్రెజెంట్ - సూసీ థారూ, కే.లలిత వాల్యూం 1 పేజీ 94-97 (ఆంగ్లములో) [1]
  2. నిడదవోలు, మాలతి (2013). Telugu Women Writers, 1950-1975 (PDF). Retrieved 24 May 2015.
  • మొల్ల (తెలుగు వైతాళికులు సిరీస్ లో) - రచన: సి. వేదవతి - ప్రచురణ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (2006)

బయటి లింకులు