ఏడిద నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 35: | పంక్తి 35: | ||
== రంగస్థల ప్రస్థానం == |
== రంగస్థల ప్రస్థానం == |
||
కాకినాడ మెటలారిన్ హైస్కూల్ లో ఫిఫ్త్ ఫారమ్ చదువుతుండగా స్కూల్ వార్షికోత్సవంలో లోభి నాటకంలో తొలిసారిగా ఏడిద అమ్మాయి వేషం వేశారు. దానికి సిల్వర్ మెడల్ను కూడా అందుకున్నారు. ఆ నటనకు రజతపతకం సాధించిన ఉత్సాహంతో ‘విశ్వభారతి, ‘పరివర్తన’, ‘ఓటు నీకే’వంటి నాటకాల్లో నటించి మరిన్ని బహుమతులు పొందారు. ఆ తర్వాత విజయనగరంలో ఇంటర్మీడియట్ చదువుతుండగా ‘కవిరాజు మెమోరియల్ క్లబ్’లో కొన్ని నాటకాలు ఆడారు. |
కాకినాడ మెటలారిన్ హైస్కూల్ లో ఫిఫ్త్ ఫారమ్ చదువుతుండగా స్కూల్ వార్షికోత్సవంలో లోభి నాటకంలో తొలిసారిగా ఏడిద అమ్మాయి వేషం వేశారు. దానికి సిల్వర్ మెడల్ను కూడా అందుకున్నారు. ఆ నటనకు రజతపతకం సాధించిన ఉత్సాహంతో ‘విశ్వభారతి, ‘పరివర్తన’, ‘ఓటు నీకే’వంటి నాటకాల్లో నటించి మరిన్ని బహుమతులు పొందారు. ఆ తర్వాత విజయనగరంలో ఇంటర్మీడియట్ చదువుతుండగా ‘కవిరాజు మెమోరియల్ క్లబ్’లో కొన్ని నాటకాలు ఆడారు. పిఠాపురం రాజాస్ కాలేజీలో బి.ఎ. ఎకనామిక్స్లో చేరిన నాగేశ్వరరావుకు అక్కడే ప్రముఖ దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ పరిచయమయ్యారు. [[వి.బి.రాజేంద్రప్రసాద్]], నటులు [[హరనాథ్]], [[మాడా]], కె.కె.శర్మ, వడ్డాది సూర్యనారాయణమూర్తిల తో కలిసి కళాప్రపూర్ణ రాఘవ కళాసమితి నాటక సంస్థని ప్రారంభించిపలు నాటకాలు ప్రదర్శించి నటించారు. |
||
==కుటుంబం== |
==కుటుంబం== |
08:15, 9 అక్టోబరు 2015 నాటి కూర్పు
ఏడిద నాగేశ్వరరావు | |
---|---|
జననం | ఏడిద నాగేశ్వరరావు 1934 ఏప్రిల్ 24 తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట |
మరణం | 2015 అక్టోబరు 4 హైదరాబాదు, తెలంగాణ |
మరణ కారణం | అనారోగ్యం, వృద్ధాప్యం |
వృత్తి | నిర్మాత |
తండ్రి | సత్తిరాజు నాయుడు |
తల్లి | పాపలక్ష్మి |
ఏడిద నాగేశ్వరరావు (ఏప్రిల్ 24, 1934 - అక్టోబరు 4, 2015) ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ (Poornodaya Movie Creations) అనే సంస్థ ద్వారా కొన్ని ఉన్నత ఆశయాలు గల తెలుగు సినిమాలను నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు భారత ప్రభుత్వాల నుండి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు.
బాల్యం
తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేటలో సత్తిరాజునాయుడు, పాపలక్ష్మి దంపతులకు 1934, ఏప్రిల్ 24 న జన్మించాడు.[1]
రంగస్థల ప్రస్థానం
కాకినాడ మెటలారిన్ హైస్కూల్ లో ఫిఫ్త్ ఫారమ్ చదువుతుండగా స్కూల్ వార్షికోత్సవంలో లోభి నాటకంలో తొలిసారిగా ఏడిద అమ్మాయి వేషం వేశారు. దానికి సిల్వర్ మెడల్ను కూడా అందుకున్నారు. ఆ నటనకు రజతపతకం సాధించిన ఉత్సాహంతో ‘విశ్వభారతి, ‘పరివర్తన’, ‘ఓటు నీకే’వంటి నాటకాల్లో నటించి మరిన్ని బహుమతులు పొందారు. ఆ తర్వాత విజయనగరంలో ఇంటర్మీడియట్ చదువుతుండగా ‘కవిరాజు మెమోరియల్ క్లబ్’లో కొన్ని నాటకాలు ఆడారు. పిఠాపురం రాజాస్ కాలేజీలో బి.ఎ. ఎకనామిక్స్లో చేరిన నాగేశ్వరరావుకు అక్కడే ప్రముఖ దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ పరిచయమయ్యారు. వి.బి.రాజేంద్రప్రసాద్, నటులు హరనాథ్, మాడా, కె.కె.శర్మ, వడ్డాది సూర్యనారాయణమూర్తిల తో కలిసి కళాప్రపూర్ణ రాఘవ కళాసమితి నాటక సంస్థని ప్రారంభించిపలు నాటకాలు ప్రదర్శించి నటించారు.
కుటుంబం
డిగ్రీ ఫైనల్ ఇయర్లో మేనమామ కూతురైన జయలక్ష్మితో 1954 ఏప్రిల్ 24న వివాహం జరిగింది. కూతురు ప్రమీల, కుమారులు విశ్వమోహన్, శ్రీరామ్, రాజా వున్నారు. ముగ్గురు కుమారుల్లో విశ్వమోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా స్థిరపడగా, చిన్న కుమారులు ఏడిద శ్రీరామ్ నిర్మాత, నటుడిగా, ఏడిద రాజా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కొనసాగుతున్నారు.
సినీరంగ ప్రస్థానం
తన స్నేహితుడు, నిర్మాత వి.బి.రాజేందప్రసాద్ నుంచి ‘అన్నపూర్ణ’ లో నటించాలని పిలుపు రావడంతో మద్రాస్ వెళ్లాడు. కాని, ఆ వేషం దక్కలేదు. డబ్బింగ్ కళాకారుడిగా ప్రయత్నాలు ప్రారంభించారు. ‘పార్వతీ కళ్యాణం’ లోని శివుడి పాత్రకి డబ్బింగ్ చెప్పి తొలి సంపాదనగా రూ.500 పొందారు. ఆ తర్వాత నటుడిగా కూడా అవకాశాలు సొంతం చేసుకొన్నారు.
1962 నుంచి 1974 మధ్య కాలంలో సుమారు 30 సినిమాల్లో నటించారు. వంద చిత్రాలకి పైగా డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత కాకినాడకి చెందిన భాస్కరరెడ్డి, రామకృష్ణారెడ్డి, లచ్చిరెడ్డి, వీర్రాజులతో కలిసి ‘వెంకటేశ్వర కల్యాణం’అనే చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. ఆ సినిమాకి లాభాలు రావడంతో ఆ నలుగురూ కలిసి గీతాకృష్ణ కంబైన్స్ అనే సంస్థని ప్రారంభించి నిర్మాణ సారథ్య బాధ్యతల్ని ఏడిద నాగేశ్వరరావుకి అప్పగించారు.
‘నేరము శిక్ష’ లో నటించడంతో ఆ చిత్ర దర్శకుడు కె. విశ్వనాథ్ తో పరిచయం ఏర్పడింది. ఆయనతో సిరి సిరి మువ్వ సినిమాని నిర్మించారు. అది విజయం సాధించింది. తర్వాత తన బంధువులతో కలిసి పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ స్థాపించారు. తొలి ప్రయత్నంగా కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వంలో తాయారమ్మ బంగారయ్య ను నిర్మించారు. అందులో చిరంజీవి ప్రతినాయక ఛాయలున్న ఓ చిన్న పాత్రని పోషించారు. ఆ సినిమా విజయం సాధించడంతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ రీమేక్ అయ్యింది. నిర్మాణ సారథిగా ఒక విజయాన్ని, నిర్మాతగా మరో విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. మూడో సినిమా కోసం మళ్లీ కె.విశ్వనాథ్ని సంప్రదించి శంకరాభరణం నిర్మించారు. ఇక ఆ చిత్రం తర్వాత వెనుదిరిగి చూసుకొనే అవకాశం రాలేదు. సీతాకోక చిలుక, స్వాతిముత్యం, సితార చిత్రాలకి వివిధ విభాగాల్లో జాతీయ పురస్కారాలు లభించాయి. ‘స్వాతిముత్యం’ తెలుగు నుంచి ఆస్కార్ నామినేషన్లకు ఎంపికైంది. చాలా సినిమాలకు వివిధ విభాగాల్లో నంది పురస్కారాలు వరించాయి. చివరిగా ‘ఆపద్బాంధవుడు’చిత్రాన్ని నిర్మించారు ఏడిద నాగేశ్వరరావు.
వృత్తి
నాటకరంగం నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టాడు. నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, నిర్మాతగా ఎదిగాడు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శిగా సేవలందించాడు. నంది పురస్కారాల కమిటీ అధ్యక్షుడిగా, జాతీయ పురస్కారాల కమిటీలో సభ్యుడిగా పని చేశాడు.
మరణం
గత కొతంకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదు లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబరు 4, 2015 ఆదివారం సాయంత్రం 5 గంటలకు కన్ను మూశారు.
విశేషాలు
- ఆయన నిర్మించిన చిత్రాలన్నీ జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకున్నాయి.
- పలు చిత్రాలు రష్యన్ భాషలో విడుదలయ్యాయి.
- ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన 9 సినిమాల్లో అత్యధిక చిత్రాలు కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కడం విశేషం.
నిర్మించిన చిత్రాలు
- ఆపద్బాంధవుడు (1992)
- స్వరకల్పన (1989)
- స్వయంకృషి (1987)
- సిరివెన్నెల (1986)
- స్వాతిముత్యం (1985)
- సాగర సంగమం (1983)
- సితార (1983)
- సీతాకోకచిలుక (1981)
- తాయారమ్మ బంగారయ్య (1979)
- శంకరాభరణం (1979)
- సిరిసిరిమువ్వ (1978)
బయటి లింకులు
ఐ.ఎమ్.బి.డి.లో ఏడిద నాగేశ్వరరావు పేజీ.
మూలాలు
- ↑ ఈనాడు దినపత్రిక అక్టోబరు 5, 2015