Coordinates: 13°39′N 79°25′E / 13.65°N 79.42°E / 13.65; 79.42

తిరుపతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 19: పంక్తి 19:
|area_telephone = 0877
|area_telephone = 0877
|postal_codes = 5175xx (01 -29)
|postal_codes = 5175xx (01 -29)
|vehicle_code_range = AP-03
|vehicle_code_range = AP-03,AP 103
|footnotes =
|footnotes =
}}
}}

12:03, 10 అక్టోబరు 2015 నాటి కూర్పు

  ?తిరుపతి
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
View of తిరుపతి, India
View of తిరుపతి, India
అక్షాంశరేఖాంశాలు: 13°39′N 79°25′E / 13.65°N 79.42°E / 13.65; 79.42
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
నగరం
ఎత్తు

• 750 కి.మీ² (290 చ.మై)
• 161 మీ (528 అడుగులు)
ప్రాంతం రాయలసీమ
జిల్లా (లు) చిత్తూరు
జనాభా 2,87,035

population_total_cite =[1] (2011 నాటికి)

కోడులు
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• +0877
• AP-03,AP 103

తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఏకైక నగరము మరియు ఆంధ్ర ప్రదేశ్ లో 4 వ అతిపెద్ధ నగరం .తిరుపతి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. తిరుపతి నగరానికి విమాన, రైలు, రహదారి సౌకర్యాలు కలవు. ఈ నగరం విజయవాడకు 349 కి.మీ, హైదరాబాదుకు 550 కి.మీ, బెంగళూరుకు 256 కి.మీ., చెన్నై 140 కి.మీ దూరంలో ఉంది.

చరిత్ర

రామానుజాచార్యులు కొండ కింద గోవిందరాజస్వామి ఆలయాన్ని ఏర్పాటుచేయడంతో తిరుమల చరిత్రకు బీజం పడింది. తన శిష్యుడైన యాదవరాజును రామానుజులు ప్రోత్సహించి అప్పటికే ఉన్న చెరువు పక్కన ఆలయ నిర్మాణం ప్రారంభించేలా చేశారు. యాదవరాజు దేవాలయాన్ని నిర్మించడం పూర్తయ్యాకా క్రమంగా చుట్టూ అగ్రహారాన్ని నిర్మించి దానికి తన గురువు పేరిట రామానుజపురం అని నామకరణం చేశారు. రామానుజపురమే కాక యాదవరాజు చాలా గృహాలు నిర్మించారు. శ్రీశైలపూర్ణుడు, అనంతాచార్యులు వంటి భక్తులకు నివాసాలు ఏర్పాటుచేశారు. దేవాలయానికి తూర్పున ధాన్యాగారం, వాయువ్యదిశలో అంగడి వీథి నిర్మించి నేటి తిరుపతి నగరానికి ఆనాడు పునాదివేశారు.[2]

శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం

శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ప్రాచీనతకు చాలా సాహిత్యపరమైన ఆధారాలు, శాసనాధారాలు ఉన్నాయి. విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు తిరుపతి వేంకటేశ్వరస్వామిని చాలా మార్లు దర్శించుకొని కానుకలు సమర్పించాడు. చంద్రగిరి కోట నుంచి తిరుమల గిరుల పైకి చేరుకోవటానికి అతి సమీప కాలి మార్గమైన శ్రీ వారి మెట్టు ద్వారా శ్రీ కృష్ణదేవ రాయలు తరచూ స్వామి దర్శనమునకు డోలీపై వెళ్ళేవాడు. 9వ శతాబ్దంలో కాంచీపురాన్ని పరిపాలించిన పల్లవులు, ఆ తరువాతి శతాబ్దపు తంజావూరు చోళులు, మదురైని పరిపాలించిన పాండ్యులు, విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు, సామంతులు ఈ వేంకటేశ్వరస్వామి భక్తులై కొలిచారు. ఒకరిని మించి మరొకరు పోటీపడి ఆలయనిర్వహణకు, సేవలకు దానధర్మాలు చేశారు. విజయనగర సామ్రాజ్య పరిపాలనలో ఆలయానికి చాలా సంపద చేకూరింది. శ్రీ కృష్ణదేవరాయలు తన ఇద్దరు భార్యల విగ్రహాలను, తన విగ్రహాన్ని, ఆలయ మండపం పై ప్రతిష్టింపజేశాడు. ప్రధాన ఆలయంలో వేంకటపతి రాయల విగ్రహం కూడా ఉంది. విజయనగర సామ్రాజ్య పతనం తరువాత, దేశం నలుమూలల ఉన్న చాలామంది చిన్న నాయకులు, ధనవంతులు దేవాలయాన్ని పోషించి కానుకలు బహూకరించడం కొనసాగించారు. మరాఠీ సేనాని, రాఘోజీ భోంస్లే ఆలయాన్ని సందర్శించి గుడిలో నిత్య పూజా నిర్వహణకై శాశ్వత దాన పథకాన్ని స్థాపించాడు. ఈయన వేంకటేశ్వర స్వామికి ఒక పెద్ద మరకతాన్ని, విలువైన వజ్రవైఢూర్యాలను బహూకరించాడు. ఆ మరకతం ఇప్పటికీ రాఘోజీ పేరుతో ఉన్న ఒక పెట్టెలో భద్రంగా ఉంది. ఆ తరువాతి కాలంలో పెద్ద పెద్ద దానాలు చేసిన వారిలో మైసూరు మరియు గద్వాల పాలకులు చెప్పుకోదగినవారు. హిందూ సామ్రాజ్యాల తరువాత, పాలన కర్ణాటక ముస్లిం పాలకుల చేతిలోకి, ఆ తరువాత బ్రిటీషు వారికి వెళ్లింది. తిరుపతి గుడి కూడా వారి పర్యవేక్షణ కిందికి వచ్చింది.

వేదపాఠశాల

1830నాటికే తిరుపతి భారీ ఊరిగా విస్తరించింది, నగరం అని భావించేందుకు వీలుందని యాత్రికుడు ఏనుగుల వీరాస్వామయ్య రాశారు. త్రిమతస్థుల ఇళ్ళు (వైష్ణవులు, శైవులు, స్మార్తులు) దాదాపుగా 200 వరకూ ఉండేది. హైదరాబాద్ దివాన్ చందులాలా మొదలైనవారు గోసాయిలు, బ్రాహ్మణులు, సాధువులకు సదావృత్తి ఇచ్చేవారు. మునియప్పిళ్ళై 16మంది విద్యార్థులు చదువుకునేందుకు భోజనం, వసతి కల్పించి చదివించే వేదపాఠశాలను ఏర్పరిచారు. మూడు రామానుజకూటములుండేవి. ఆనాటికే పట్టణంలో అన్నిరకాల సరుకులు దొరికి, అందరు పనివాళ్ళూ లభించే ప్రాంతంగా ఉండేది. పట్టణం మొత్తానికి నరసింహ తీర్థ జలమే త్రాగేందుకు తగ్గనీరుండే జలాశయంగా ఉండేది.[3].

తిరుమల తిరుపతి దేవస్థానములు

1843 లో ఈస్టిండియా కంపెనీ క్రైస్తవేతర, స్థానికుల ప్రార్ధనా స్థలాల యాజమాన్యాన్ని విడిచిపెట్టింది. వేంకటేశ్వరస్వామి ఆలయం, జాగీర్ల నిర్వహణ తిరుమలలోని హాథీరాంజీ మఠానికి చెందిన సేవదాస్‌జీకి అప్పగించారు. 1933 వరకు ఒక శతాబ్దం పాటు ఆలయ నిర్వహణ మహంతుల చేతిలో ఉంది.

తిరుపతిలో హాథీరాంజీ మఠం
తిరుపతి రైల్వే స్టేషను

1933 లో, మద్రాసు శాసన సభ ఆలయనిర్వహణ, నియంత్రణ బాధ్యతలను "తిరుమల తిరుపతి దేవస్థానములు" (టి.టి.డి) అనే సంస్థకి అప్పగిస్తూ ఒక ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ సంస్థ అధ్యక్షుడిని మద్రాసు ప్రభుత్వం నియమించేది. 1951లో ఈ చట్టాన్ని మార్చి టి.టి.డి నిర్వహణను ఒక ధర్మకర్తల సంఘానికి అప్పగించి, నిర్వహణాధికారిని ప్రభుత్వం నియమించేలా ఇంకొక చట్టం చేసింది.

గంగమ్మ జాతర

ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతర్లలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు సమ్మక్కసారక్క జాతర్ల లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది.ఒకనాటి తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలనూ వారి జీవన విధానాలనూ అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది.

అన్ని గ్రామాలకూ ఉన్నట్టే తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మకు ఎనిమిది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు.

తిరుపతి దేవాలయములు

గోవిందరాజ స్వామి కోనేరు
తిరుపతి రైల్వే స్టేషను
  • గోవిందరాజ స్వామి దేవాలయం: తిరుపతిలో మేఘాలను తాకేంత పెద్దదా అనిపించే అద్భుత రాజగోపురంతో తిరుపతికే ప్రత్యేక శోభను కలుగజేస్తున్న గోవిందరాజస్వామి ఆలయం ఉంది. క్రీ.శ. 1130లో రామానుజాచార్యులు ఈ ఆలయాన్ని భక్తజనాంకితం చేశారు. ఈ రాజగోపురాన్ని 1624లో స్వామిభక్తుడు మట్లి అనంతరాజు నిర్మించారు. గోవిందరాజస్వామి ఆలయం ఆవరణలో అనేకానేక ఆలయాలు ఉన్నాయి. గతంలో ఇది శ్రీకృష్ణ ఆలయం అయినా, నాటి మూలవిరాట్‌ అయిన శ్రీకృష్ణుని మీద తురుష్కుల విధ్వంస చర్యలవల్ల ఆ విగ్రహం పూజార్హత కోల్పోవటంతో, ఆలయం క్రమంగా గోవిందరాజస్వామి పరమయిందని అంటారు. తిరుమలలోని వేంకటేశ్వరుని పెద్దన్నగా భక్తులు కొలిచే గోవిందరాజస్వామి వారి ఆలయంలో కొన్ని పూజలూ పునస్కారాలూ తిరుమల ఆలయ పూజలతో ముడిపడి ఉంటాయి. ఈ ఆలయంలో స్వామివారి తలకింద ఒక పెద్ద కుంచం ఉంటుంది. వేంకటేశ్వరుడు తన వివాహ సమయంలో, కుబేరుడి వద్ద తీసుకున్న రుణాన్ని సకాలంలో, సరిగ్గా తీర్చే బాధ్యతలో నిమగ్నమయిన గోవిందరాజస్వామి, ఆ ధనాన్ని కొలిచి కొలిచి అలసిసొలసి, రవ్వంత విశ్రమిస్తున్నట్లుగా ఉంటుంది ఈ ఆలయంలోని విగ్రహం!
  • కోదండ రామాలయం:ఆలయంలోని ప్రత్యేకత ఏమిటంటే, సీతమ్మతల్లి రాములవారికి కుడివైపున ఉండటం! ఇది వైఖానసశాస్త్ర సంప్రదాయం. భద్రాచల రాముడి విగ్రహాన్ని మనం ఒకసారి స్ఫురణకు తెచ్చుకొంటే, అక్కడ సీతమ్మతల్లి, రాములవారి ఎడమవైపు తొడమీద కూర్చున్నట్లున్న దృశ్యం గుర్తొస్తుంది!
  • కపిలతీర్థం:కపిల మహాముని యొక్క తపోఫలితానికి మెచ్చి ఈశ్వరుడు ఆవిర్భవించిన క్షేత్రం. టిటిడి యొక్క పర్యవేక్షణలో ఉన్న ఆలయాలలో ఈ ఆలయం కూడ చెప్పుకోదగినది. తిరుమల గిరులకు ఆనుకొని ఉన్న ఈ ఆలయం మరియు ఇక్కడి జలపాతాలు మనస్సుకి ఆహ్లాదాన్ని ఇస్తాయి. తిరుపతిలో దర్శించదగిన ఆలయాలలో ఇది చెప్పుకోతగినది.
  • వరదరాజ స్వామి దేవాలయం:ఇది కపిల తీర్థం రోడ్డు లేదా కే టీ రోడ్డు లో ఉన్నది.
  • 'జీవకోన:జీవకోన కపిల తీర్తానికి కొంచెం దూరంలో వున్న తిరుపతి రూరల్ మండలం. ఇక్కడ ప్రకృతి సహజసిద్దంగ ఏర్పడ్డ శివలింగం చూడవచ్చు. కొండపక్కన అటవీ ప్రాంతంలో జాలువారేజలపాతం మద్య ఈశ్వరుని దర్శనం అద్బుతం.

  • ఇస్కాన్ దేవాలయం: ప్రేమకు ప్రతిరూపాలైన రాధాకృష్ణుల ( అష్టసఖి సమేత) దేవాలయం ఇది. భక్తుల నాట్యవిన్యాసాలతో నిత్యం కలకలాడుతు ఉంటుంది. భక్తులు చేసే నాట్యమునకు భూమి స్పందించినట్లు ఉంటుంది.
అలిపిరి వద్ద శ్రీవారి పాదాల మండపము

తిరుపతి చుట్టుపక్కల దేవాలయలు

  • శ్రీనివాస మంగాపురం: తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీనివాస మంగాపురం. ఇది ఆ శ్రీనివాసుడు విశ్రమించిన చోటు. నారాయణవనంలో పద్మావతీదేవిని వివాహమాడిన వేంకటేశ్వరుడు, తిరుమలకు వెళ్తూ మార్గమధ్యంలో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్లు చెప్తారు. ఇక్కడ కళ్యాణ వేంకటేశ్వరుడు నిలువెత్తుగా, బహు సుందరమూర్తిగా దర్శనం ఇస్తాడు.
  • అలివేలు మంగాపురం లేదా తిరుచానూరు : తిరుమల వెళ్ళి స్వామిని దర్శించుకొన్న భక్తులు- కొండ దిగి ముందుగా చేయాల్సిన పని తిరుచానూర్‌(దీన్నే అలివేలుమంగాపురం అంటారు)లోని పద్మావతీ అమ్మవారిని దర్శించుకోవటమే! అయితే స్వామివారికన్నాముందే, అమ్మవారిని దర్శించాలని చాలామంది అంటారు. తిరుచానూర్‌, తిరుపతికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కార్తీకమాసంలో తిరుచానూర్‌ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలూ బహువైభవంగా జరుగుతాయి. స్వామికిలాగే, అమ్మవారికీ నిత్య కళ్యాణమే.
  • ముక్కోటి: ఈ అలయము తిరుపతి.... చంద్రగిరి రహదారిలో తిరుపతికి నాలుగు కిలోమీటర్ల దూరంలో స్వర్ణముఖి నది ఒడ్డున వున్నది.ప్రసిద్ధి గాంచినది, మరియు కచ్చితంగా చూడవలసిన మహిమాన్విత శివాలయము.చంద్రగిరి మండలంలో వెలసిన పవిత్ర స్థలం, ఈ శివాలయం.
తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఎదురుగా వున్న స్వేత భవనము. ఇది ఒక గ్రంధాలయం

తిరుపతి చుట్టుపక్కల చూడదగిన విశేషాలు

తిరుపతి రైల్వే స్టేషను ముఖద్వారం
అలిపిరి వద్ద మెట్లదారి పైనున్న సాష్టాంగ ముద్ర శిల్పం
కపిలతీర్థం
అలిపిరి

అలపిరి దగ్గరున్న మెట్ల దారిలో వున్న తల తాకుడు గుండు:---దీన్నె తలయేరు గుండు అని కూడ అంటారు.- గతంలో అంటరాని వారు కొండ పైకి వెళ్ళే వారు కాదు. వారు ఈ గుండుకు తమ తలను తాకించి ఇక్కడి నుండే వారు తిరిగి వెనక్కి వెళ్ళే వారు. ఏడు కొండలపై తమ పాదాలను సైతం ఉంచ రాదు అని అనుకునె వారు. అందు చేత ఈగుండుకు రంద్రాలున్నాయి. ఇంకో కథనం ప్రకారం ఈ తలయేరు గుండు నుండి మెట్ల దారి అతి కష్టం వుంటుండి. దీనిని మోకాళ్ల మెట్ల దారి అంటారు. తమ మోకాళ్ల నెప్పులు తగ్గాలంటే ఈ గుండుకు తమ మోకాళ్లను తాకించి నడిస్తే మోకాళ్లు నెప్పులు వుండవని భక్తుల నమ్మిక. కారణం ఏదైతేనేమి తల తాకించినా, మోకాలు తాకించినా ఆ గుండుకు అనేక గుంటలు పడి వున్నాయి. గత కాలానికి దర్పణంగా ఈగుండును ఇప్పటికి చూడవచ్చు

తిరుపతిలో ఒక గుడిముందున్న శిల్పము

ఇక్కడే శ్రీ వారి పాదాల మండపం వున్నది. ఇక్కడ శ్రీవారి పాదుకలు, వెండివి వున్నాయి. వాటిని భక్తులు కొంత రుసుం చెల్లించి తమ నెత్తిన పెట్టుకొని ఇస్తుంటారు. అదే విధంగా ఇక్కడ శ్రీక్రిష్టదేవ రాయలచే నిర్మితం అయిన పెద్ద గోపురం కలదు.

  • చంద్రగిరి కోట: తిరుపతికీ చంద్రగిరి పాలకులకూ అవినాభావ సంబంధం ఉండేది. తిరుమల ఆలయంలో నైవేద్య ఘంటికా రావాన్ని విన్న తర్వాతనే చంద్రగిరి పాలకులు ఏ ఆహారాన్ని అయినా ముట్టేవారట. అలనాటి చంద్రగిరి వైభవాన్ని కనులారా చూడాలంటే... అక్కడ ప్రతిరోజూ జరిగే లైట్‌ అండ్‌ సౌండ్‌ షోకు వెళ్ళాల్సిందే.
  • హార్స్‌లీహిల్స్‌: తిరుపతికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1265 మీటర్ల ఎత్తులో హార్స్‌లీహిల్స్‌ ఉంది. అంత ఎత్తున విడిదిగృహాన్ని కట్టించుకున్న అప్పటి కడపజిల్లా కలెక్టర్‌ డబ్ల్యు.డి.హార్స్‌లీ పేరు మీద ఆ కొండల ప్రాంతాన్ని ఈవిధంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఆంధ్రా ఊటీగా పేరుపొందింది.
  • తలకోన: పచ్చటి అటవీ అందాలకు ఆలవాలం తిరుమల గిరులకు ముఖద్వారం తలకోన. 270 అడుగుల ఎత్తు నుంచి దుమికే అక్కడి జలపాత సౌందర్యాన్ని చూసితీరాల్సిందే కానీ వర్ణించడానికి పదాలు చాలవు. తిరుపతి నుంచి ఇక్కడికి 40కిలోమీటర్ల దూరం.
  • కళ్యాణీ డ్యాం :
  • కాణిపాకం : తిరుపతికి సుమారు 90 కిలోమీటర్లు దూరంలో ఉన్నది
  • 'శ్రీకాళహస్తీ తిరుపతికి సుమారు నలబై కిలోమీటర్ల దూరంలో వున్నది.
  • తిరుచానూరు తిరుపతికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో వున్నది.
  • అప్పలాయ గుంట ప్రసన్న వేంకటేస్వరాలయం. చిత్తూరు జిల్లా.

అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయం ముందున్న, ఆలయ వివరాలు తెలిపే బోర్డు అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరాలయం ప్రధాన గోపురం అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన శ్రీ వేంకటేశ్వరాలయాలలో అప్పలాయ గుంట లో వెలసిన శ్రీ వేంకటేశ్వారాలయం ఒకటి. ఒక చిన్న పల్లెలో పంట పొలాలమధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన అందమైన చిన్న ఆలయం ఇది.

పరిపాలన

తిరుపతి నగర పరిపాలన తిరుపతి నగర పాలక సంస్థ ఆద్వర్యంలో ఉంటుంది. తిరుపతి నుండి ఒక శాసనసభ సభ్యుడు, ఒక పార్లమెంట్ సభ్యుడు ఉంటారు. రాష్ర్టవిభజన సందర్భంగా తిరుపతిని మెగా సిటీ గా రూపొందుటకు కేంద్ర మరియు రాష్ర్ట ప్రభుత్వాలు పూనుకొన్నాయి. తిరుపతి పరిసర ప్రాంతాల పంచాయతీలను నగర పాలక సంస్ధ నందు విలీనం చేయటం ప్రారంభించారు. తిరుపతి అర్బన్ డెవెలెప్మెంట్ అథారిటీ( తుడా) నగర ప్రణాళికా సంఘంగా వ్యవహరిస్తుంది.

తిరుపతి పట్టణ ప్రదేశాలు

తిరుపతిలో ఎం.ఎస్.సుబ్బలక్ష్మి విగ్రహము
  • కపిల తీర్థం రోడ్ (కె టి రోడ్డు)
  • ఎన్ జీ ఓస్ కాలనీ
  • యశోద నగర్
  • టి.టి.డి క్వార్టర్స్ (తి.తి.దే క్వార్టర్స్)
  • తీర్థకట్ట వీధి
  • గాంధీ రోడ్
  • నెహ్రునగర్
  • బాలాజి కాలని
  • పెద్ద కాపు లేఅవుట్ (పి.కె.లేఅవుట్)
  • అలిపిరి
  • అన్నమయ్య సర్కిల్
  • ప్రకాశం రోడ్డు
  • ఖాధీ కాలని
  • బైరాగి పట్టెడ
  • మాస్కు రోడ్డు
  • రాయల నగర్
  • కర్ణాల వీధి(నేతాజి రోడ్డు)
  • భవాని నగర్
  • కరకంబాడి రోడ్డు
  • రేణగుంట రోడ్డు
  • కుమ్మరితోపు
  • మంగళం
  • వైకుంట పురం
  • రామానుజ సర్కిల్
  • ముత్యాల రెడ్డి పల్లె
  • అవిలాల
  • కొర్లగుంట
  • చెర్లో పల్లె
  • రెడ్డి అండ్ రెడ్డి కాలని
  • తిలక్ రోడ్డు
  • కేశవాయన గుంట
  • నవాబు పేట
  • పుదిపట్ల
ఒక గేటుపై చెక్కబడిన సుదర్శన చక్రము

తిరుపతి పట్టణంలోని సినిమా థియేటర్లు

  • వి.వి. మహల్
  • శ్రీనివాస
  • జయశ్యాం
  • ప్రతాప్
  • మిని ప్రతాప్
  • సి.వి.యస్
  • డి.ఆర్.మహల్
  • లీల మహల్
  • దేవేంద్ర
  • ఐ.యస్.మహల్
  • పళ్లణి
  • సంధ్య
  • పి.జి.ఆర్
  • తేజ
  • కృష్ణ తేజ
  • వేల్రమ్
  • జగత్
  • విఖ్యాత్

ఇవి కూడా చూడండి

ఫాదర్ ఆఫ్ తిరుపతి శిల్పం.

బయటి లింకులు

వనరులు

  1. http://www.census2011.co.in/census/city/427-tirupati.html
  2. తిరుమల చరితామృతం:పి.వి.ఆర్.కె.ప్రసాద్:ఎమెస్కో బుక్స్:2013:పేజీ 57
  3. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.

మూసలు, వర్గాలు

"https://te.wikipedia.org/w/index.php?title=తిరుపతి&oldid=1744548" నుండి వెలికితీశారు