రాయలసీమ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 116: పంక్తి 116:
* ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,తిరుపతి.
* ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,తిరుపతి.
* ఇండియన్ కలినరీ ఇన్ట్సిట్యూట్, తిరుపతి.
* ఇండియన్ కలినరీ ఇన్ట్సిట్యూట్, తిరుపతి.
* ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ సైంసెడుకేషన్ అండ్ రిసెర్చ్, తిరుపతి.
* ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ సైన్సు ఏడుకేషన్ అండ్ రిసెర్చ్, తిరుపతి.
* జి. పుల్లా రెడ్డి (GPR) ఇంజినీరింగ్ కళాశాల, కర్నూలు
* జి. పుల్లా రెడ్డి (GPR) ఇంజినీరింగ్ కళాశాల, కర్నూలు
* [[కర్నూలు వైద్య కళాశాల]], కర్నూలు
* [[కర్నూలు వైద్య కళాశాల]], కర్నూలు

18:44, 14 అక్టోబరు 2015 నాటి కూర్పు

ఆంధ్ర ప్రదేశ్ లో రాయలసీమ ప్రాంతం (జూన్ 2 నుండి అధికారికముగా)
ఆంధ్ర ప్రదేశ్ లో రాయలసీమ ప్రాంతం ప్రస్తుతం(ఆకుపచ్చ రంగుతో సూచించబడినది)
తిరుమల వీధులలో గజ వాహనసేవలో వెంకటేశ్వర స్వామి
అహోబిళం లోని ఒక గుడిలో నున్న స్థంభము
లేపాక్షిలో ఉన్న బసవన్న విగ్రహము
కాణిపాకం లో గుడి
యాగంటి లోని పుష్కరిణి
గండికోటలోని మాధవరాయ గుడి
కపిలతీర్థం లోని జలపాతాలు

రాయలసీమ అనునది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ముఖ్యప్రాంతాల్లో ఒకటి . ఆంధ్ర ప్రదేశ్ లోని దక్షిణ భాగం లో ఉండే నాలుగు జిల్లాలు ( కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు) రాయలసీమ ప్రాంతంలోకి వస్తాయి.

రాయలసీమ విజయనగర సామ్రాజ్యం లో భాగాంగా శ్రీ కృష్ణదేవ రాయలచే పరిపాలించబడినది. అది వరకూ తూర్పు చాళుక్యుల పరిపాలనా కేంద్రంగా హిరణ్యక రాష్ట్రంగా ఈ ప్రాంతం విలసిల్లినది. తర్వాత రాయలసీమ పై చోళుల ప్రభావం పెరిగినది. బ్రిటీషు వారి సహకారాన్ని పలు యుద్ధాలలో పొందిన హైదరాబాదుకి చెందిన నిజాం సుల్తానులు 1802 లో ఈ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేయటంతో దీనికి దత్త మండలం అని పేరు వచ్చినది. 1808 లో దత్త మండలం ను విభజించి బళ్ళారి మరియు కడప జిల్లాలని ఏర్పరచారు. 1882 లో అనంతపురాన్ని బళ్ళారి నుండి వేరు చేశారు. ఈ ప్రాంతానికి 1928లో చిలుకూరి నారాయణరావు "రాయలసీమ" అని పేరుపెట్టాడు. అప్పటి నుండి ఆ పేరే స్థిరపడినది.

ప్రాథమికంగా తెలుగు మాట్లాడే ఈ జిల్లాలు 1953 వరకూ మద్రాసు ప్రెసిడెన్సీ లో భాగంగా ఉన్నవి. బళ్ళారి కూడా రాయలసీమలో ప్రాంతంగానే ఉండేది. కోస్తా, రాయలసీమ నాయకులు జరిపిన అనేక సంవత్సరాల ఉద్యమం ఫలితంగా 1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు ఈ నాలుగు జిల్లాలను ఆంధ్ర రాష్ట్రం లో, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దృష్ట్యా బళ్ళారిని కర్ణాటక లో కలిపి వేశారు. కన్నడ, తెలుగు మాట్లాడేవారు సమానంగా ఉన్న బళ్ళారి నగరాన్ని పలు చర్చలు, వివాదాల తర్వాత మైసూరు లో చేర్చారు. 1956 లో ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణాలో కలపటంతో అప్పటి నుండి ఇవి ఆంధ్ర ప్రదేశ్ లో భాగంగా ఉంటున్నవి.

తెలుగు మాట్లాడు ఇతర ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమ వైశాల్యంలో చిన్నదైననూ తెలుగు,తమిళం, కన్నడ మరియు ఉర్దూ కళల్లో, సంస్కృతుల్లో, సాహిత్యంలో ఈ ప్రాంతం యొక్క ప్రభావం బహు అధికం.

కోస్తా ప్రాంతంతో పోలిస్తే రాయలసీమ అభివృద్ధి పరంగా వెనుకబడి ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినపుడు రాయలసీమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలోని కర్నూలును కొత్త రాష్ట్ర రాజధానిగా నిర్ణయించారు. అయితే మరో మూడేళ్ళలోనే విశాల ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడడంతో రాజధాని హైదరాబాదు కు మారింది.

వ్యుత్పత్తి

పలు యుద్ధాలలో బ్రిటీషు వారు నిజాం పాలకులకి సహకరించినందుకు కృతజ్ఞత గా ఈ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేయటంతో దత్త మండలాలు లేదా దత్త సీమ పదాలు వ్యావహారికంలోకి వచ్చాయి. 20వ శతాబ్దపు ప్రారంభం నాటికి ఇక్కడి మేధావులు ఈ పేర్లు అవమాన కారకాలుగా అనుభూతి చెందారు. 1928 నవంబరు 17-18 తారీఖులలో నంద్యాల పట్టణంలో జరిగిన ఆంధ్ర మహాసభ లో పాల్గొన్న నాయకుల మధ్య జరిగిన తీవ్రమైన చర్చలలో చిలుకూరి నారాయణ రావు విజయనగర సామ్రాజ్యమునకు చెందిన రాయల వంశము ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కావున, వారి సుపరిపాలనలోనే ఇక్కడి సంస్కృతి మరియు వారసత్వ సంపదలు ఒక వెలుగు వెలిగాయి కావున, దీనికి రాయలసీమ అని పేరు పెట్టాలని ప్రతిపాదించారు. (ఇది వరకు ఈ పేరు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు ప్రతిపాదించారు అనే ఆలోచన వ్యాప్తిలో ఉండేది. కానీ పరిశోధనల్లో ఈ ఘనత చిలుకూరి వారిదే అని తేలినది.) రాయలసీమ అన్న పేరు అన్ని వర్గాల మేధావులని/సామాన్య ప్రజానీకాన్ని ఆకర్షించటంతో ఆ పేరే ఈ ప్రాంతానికి స్థిరపడిపోయినది. కోస్తా ఆంధ్ర నాయకులు మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని వేర్పరచాలని ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరుపుతున్న సమయంలో ఈ ప్రాంతం నాయకులు ఆంధ్ర ప్రాంతంతో కలిస్తే రాయలసీమ అభివృద్ధి చెందదేమో అని సంశయించి, మొదట వారికి సహకరించలేదు. రాయలసీమ ప్రజల అనుమానాలు తీర్చటానికే 16 నవంబరు 1937 లో శ్రీబాగ్ ఒడంబడిక రూపొందించబడినది.

రాయలసీమ సంస్కృతి

తత్వము

తత్వము సంస్కృతిలో ఒక భాగం. రాయలసీమలో ఎందరో తత్వవేత్తలు జన్మించారు.

సాహిత్యం

విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి అయిన శ్రీ కృష్ణదేవ రాయలు హయాంలో ఈ ప్రాంతపు సంస్కృతి చాలా ఉన్నతి చెందినది. అష్టదిగ్గజాలలో ఐదు మంది (అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, కందుకూరి రుద్రకవి (మాదయ్యగారి మల్లన), అయ్యలరాజు రామభధ్రుడు) ఈ ప్రాంతం వారే.

కడప జిల్లా కి చెందిన యోగి వేమన, బ్రహ్మం గారు తమ రచనల ద్వారా సామాన్య ప్రజానీకాన్ని విద్యావంతులని చేయటానికి ఎంతో కృషి చేశారు. శ్రీమద్భాగవతముని రచించిన పోతనామాత్యుడు కూడా ఒంటిమిట్ట లోనే జన్మించాడన్న అభిప్రాయం కలదు.

బళ్ళారి రాఘవ, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి రంగస్థల ప్రముఖులను అందించిన బళ్ళారిప్రదేశానికి గొప్ప చరిత్ర గలదు. బళ్ళారి లోని రాఘవ కళా మందిర్ బళ్ళారి రాఘవ పేరు పై స్థాపించినదే.

తత్త్వవేత్త, ఆధ్యాత్మిక గురువు అయిన జిడ్డు కృష్ణమూర్తి, కట్టమంచి రామలింగారెడ్డి చిత్తూరుకి చెందినవారు.

చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన పలు ఉర్దూ రచయితలు ఉర్దూ సాహ్యిత్యానికి సేవ చేశారు.

భాష

రాయలసీమలో శుద్ధమైన తెలుగు భాష మాట్లాడే సంస్క్రతి వున్నది. రాజభాష తెలుగైనా రెండవ అధికార భాషగా ఉర్దూ భాష వున్నది. చిత్తూరు జిల్లాలోని పడమట మరియు దక్షిణ ప్రాంతాలలో తమిళ భాష మాట్లాడేవారు ఎక్కువ. తిరుపతి, చిత్తూరు, పుత్తూరు ప్రాంతాలలో తమిళ ప్రభావం ఎక్కువ. కుప్పంలో ద్రావిడ విశ్వవిద్యాలయం కలదు. మూడు రాష్ట్రాలు, ఆంధ్ర, కర్నాటక మరియు తమిళనాడు రాష్ట్రాలు కలిసే చోట ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడినది.

సంగీతం

బ్రాహ్మణ కులంలో కేవలం రాయలసీమ ప్రాంతానికి మాత్రం పరిమితమైన ఉపకులం ములకనాడు బ్రాహ్మణం. ఈ కులానికి చెందిన త్యాగరాజు కాకర్ల (అర్ధవీడు)కి చెందినవాడు. ప్రస్తుతం ఇది ప్రకాశం జిల్లా ఉన్ననూ ఒకానొక గానంలో ఈయన పూర్వీకులు రాయలసీమకి చెందినవారని తానే స్వయంగా చెప్పుకొన్నారు.

వాగ్గేయకారుడైన అన్నమయ్య కడప జిల్లాకి చెందిన తాళ్ళపాకకి చెందినవాడు.

తరిగొండ నరసింహ స్వామి పై మరియు వెంకటేశ్వర స్వామి పై అనేక గీతాలని రచించిన వెంగమాంబ తిరుపతి వద్దనున్న తరిగొండకి చెందినది.

ప్రముఖ సంగీతకారుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ అనంతపురానికి చెందినవాడు.

ప్రముఖ సంగీతకారుడు (మరియు వైద్యుడు) అయిన శ్రీపాద పినాకపాణి జన్మత: శ్రీకాకుళం జిల్లాకి చెందినవారైననూ, కర్నూలులో స్థిర పడ్డారు.

చలన చిత్ర రంగం

పుణ్యక్షేత్రాలు

శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం

పర్యాటక ప్రదేశాలు

ఆధ్యాత్మిక గురువులు

ఆర్థిక పరిస్థితి

తక్కిన రాష్ట్రం వలెనే రాయలసీమ కూడా వ్యవసాయాధారితమైనది. రాయలసీమలో వర్షపాతం రాష్ట్ర సగటు వర్షపాతం కంటే తక్కువ. అనంతపురం జిల్లా దేశం మొత్తం మీద అతి తక్కువ వర్షపాతం గల జిల్లాల్లో రాజస్థాను లోని జైసల్మీరు తరువాత రెండో స్థానంలో ఉంది. వ్యవసాయాధార ఆర్థికపరిస్థితి గల ఈ ప్రాంత అభివృద్ధిలో ఇది అతిపెద్ద అవరోధం. రాయలసీమకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు రచించాయి. బ్రిటిషు వారు నిర్మించిన కర్నూలు కడప కాలువ తోపాటు, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ, తెలుగుగంగ, హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి మొదలైన ప్రాజెక్టులు వీటిలో కొన్ని. అయితే పథకాలు ఎన్నున్నా వాటి అమలు విషయంలో జరుగుతున్న జాప్యం, వర్షాభావ పరిస్థితుల కారణంగా పథకాల అంచనాల మేరకు సాగునీరందని పరిస్థితి నెలకొంది.

భౌగోళిక మార్పులు

స్వతంత్రానంతరం గుంటూరు జిల్లానుండి కొంత భాగాన్ని, కర్నూలు జిల్లా నుండి కొంత భాగాన్ని వేరు చేసి ప్రకాశం జిల్లాను ఏర్పరచినారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా మొత్తం కోస్తా ప్రాంతంలోనే చూపించబడుతున్నది.

పరిశ్రమలు

పంటలు

విద్యా సంస్థలు

  • జవహర్ నవోదయ విద్యాలయాలు, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం.
  • రిషి వ్యాలీ పాఠశాల.
  • ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,తిరుపతి.
  • ఇండియన్ కలినరీ ఇన్ట్సిట్యూట్, తిరుపతి.
  • ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ సైన్సు ఏడుకేషన్ అండ్ రిసెర్చ్, తిరుపతి.
  • జి. పుల్లా రెడ్డి (GPR) ఇంజినీరింగ్ కళాశాల, కర్నూలు
  • కర్నూలు వైద్య కళాశాల, కర్నూలు
  • పుష్పగిరి విద్యా సంస్థలు, కడప, 1887.
  • కేశవ రెడ్డి విద్యాసంస్థలు, కర్నూలు
  • శాంతి రాముడు వైద్య కళాశాల, నంద్యాల
  • కందుల శ్రీనివాస రెడ్డి మెమోరియల్(KSRM) ఇంజినీరింగ్ కళాశాల, పులివెందుల రోడ్, కడప
  • యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప (పూర్వం SVU PG Center)
  • శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం
  • శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం, పుట్తపర్తి.
  • శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి
  • శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి
  • ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం
  • జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, అనంతపురం,JNTUA, అనంతపురం
  • శ్రీ వెంకటేశ్వర వైద్యకళాశాల,తిరుపతి.
  • శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, తిరుపతి.
  • ప్రభుత్వ వైద్య కళాశాల, అనంతపురం.
  • రాజీవ్ గాంధీ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సు,కడప.
  • శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల, తిరుపతి.
  • శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల,తిరుపతి.
  • ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇడుపులపాయ.
  • ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కర్నూలు.
  • దామోదరం సంజీవయ్య లా విశ్వవిద్యాలయం, కడప కేంద్రం.
  • రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి.
  • శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప సంస్థ కళాశాల, తిరుపతి.
  • రాయలసీమ విశ్వవిద్యాలయం, కర్నూలు.
  • జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(JNTUA) ఇంజనీరింగ్ కళాశాల, పులివెందుల.
  • శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి.
  • శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల, ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తిరుపతి.
  • వేద పాఠశాల,ధర్మగిరి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, తిరుమల.
  • శ్రీ విద్యానికేతన్ ఏడుకేషనల్ ట్రస్టు, తిరుపతి.
  • సైనిక పాఠశాల, కలికిరి.
  • ఆంధ్ర ప్రదేశ్ రెసిడెంషియల్ విద్యా సంస్థల సొసైటీ, పాఠశాల నుండి డిగ్రీ కళాశాల వరకు, అనంతపురం జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లా, కర్నూలు జిల్లా.

ఇవి కూడా చూడండి

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=రాయలసీమ&oldid=1753442" నుండి వెలికితీశారు