పులిమ్రుగ్గు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8: పంక్తి 8:
ఈ నవలామాలికలోని నవలలు మొత్తం 12. ఆ నవలలు ఇవి:<br />
ఈ నవలామాలికలోని నవలలు మొత్తం 12. ఆ నవలలు ఇవి:<br />
# [[భగవంతుని మీది పగ]]
# [[భగవంతుని మీది పగ]]
# [[నాస్తికధూమము]]
# [[నాస్తికథూమము]]
# [[ధూమరేఖ]]
# [[ధూమరేఖ]]
# [[నందోరాజా భవిష్యతి]]
# [[నందోరాజా భవిష్యతి]]
పంక్తి 19: పంక్తి 19:
# [[వేదవతి (నవల)|వేదవతి]]
# [[వేదవతి (నవల)|వేదవతి]]
# [[నివేదిత]]
# [[నివేదిత]]

=== చారిత్రికాంశాలు ===
=== చారిత్రికాంశాలు ===



17:10, 7 నవంబరు 2015 నాటి కూర్పు

పులిమ్రుగ్గు నవలను జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించారు.

రచన నేపథ్యం

పులిమ్రుగ్గు అనే నవలను జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసమ్ర్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 1960లో రచించారు. ఈ నవలను విశ్వనాథ వారు ఆశువుగా చెప్తూ ఉండగా, జువ్వాడి గౌతమరావు లిపిబద్ధం చేశారు. వేదవతి నవల ప్రథమ ముద్రణ 1960లో జరిగింది. 2006లో చతుర్థ ముద్రణ, 2013లో పంచమ ముద్రణ చేశారు.

పురాణవైర గ్రంథమాల

పురాణవైర గ్రంథమాల శీర్షికన విశ్వనాథ సత్యనారాయణ రాసిన నవలల్లో భగవంతుని మీది పగ మొదటిది. ప్రధానంగా భారతీయులకు చరిత్ర రచనా దృష్టి లేదని, పూర్వరాజుల పరంపర అడిగితే పుక్కిటి పురాణాలు చెప్తారని ఆంగ్లవిద్య ప్రారంభమయిన తరువాత భారత చరిత్రను రచన చేసిన పలువురు అభిప్రాయపడ్డారు. సుమారు వెయ్యేళ్ల క్రితమే, అల్ బీరూనీ (Abu al-Biruni) వంటి పండితుడే, “దురదృష్టవశాత్తు భారతీయులు చారిత్రక గతిక్రమాన్ని పట్టించుకోరు. వారి రాజుల వంశపరంపరలు నమోదు చేసుకోవడంలో వారికి ఒకరకమైన నిర్లక్ష్యభావం ఉంది. ఖచ్చితమైన సమాచారం కోసం నిలదీస్తే ఏం చెప్పాలో తెలియక కథలు కల్పించి చెప్తారు” అన్నాడు. ఇదేమాట, ఏ మార్పులు లేకుండా, వలసపాలన నాటి రచయితలు కూడా పదే పదే ఉటంకించడం మూలాన ఈనాటికీ ఒక సత్యంగా స్థిరపడిపోయింది.[1]
ఈ నేపథ్యంలో పురాణాల చారిత్రికతను తిరస్కరించిన చరిత్ర రచనా ధోరణిని విశ్వనాథ వారు పురాణవైరంగా పేర్కొన్నారు. భగవంతుని మీది పగ ఉపోద్ఘాతంలో ఈ నవలామాలిక లక్ష్యాలను పేర్కొంటూ ఆ లెక్క(పాశ్చాత్య చరిత్ర కారుల లెక్క) ప్రకారము కలి ప్రవేశము మొదలు- సంయుక్తా పృథ్వీరాజుల కథ దనుక, పాశ్చాత్యులు తారుమారు చేసిరి. ఆ కాలము, అనగా సుమారు మూడువేల యేండ్ల కాలము, మహమ్మదు గోరీ వచ్చువరకు మన చరిత్రలో పాశ్చాత్యులు చేసిన అవక తవకలు కాదని నవలల రూపమున నిరూపించుటకు చేసెడి ప్రయత్న మిది. అందుచేత దీనికి పురాణవైరము అని శీర్షిక ఏర్పరుపబడినది. అన్నారు విశ్వనాథ సత్యనారాయణ.[2] ఈ నవలామాలికలోని నవలలు మొత్తం 12. ఆ నవలలు ఇవి:

  1. భగవంతుని మీది పగ
  2. నాస్తికధూమము
  3. ధూమరేఖ
  4. నందోరాజా భవిష్యతి
  5. చంద్రగుప్తుని స్వప్నము
  6. అశ్వమేధము
  7. అమృతవల్లి
  8. పులిమ్రుగ్గు
  9. నాగసేనుడు
  10. హెలీనా
  11. వేదవతి
  12. నివేదిత

చారిత్రికాంశాలు

ఇవి కూడా చూడండి



మూలాలు

  1. http://eemaata.com/em/issues/201301/2040.html
  2. భగవంతుని మీది పగ నవలకు విశ్వనాథ సత్యనారాయణ రాసిన ఉపోద్ఘాతము