విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:విశాఖపట్నం జిల్లా చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 3: పంక్తి 3:


[[వర్గం:ఉద్యమాలు]]
[[వర్గం:ఉద్యమాలు]]
[[వర్గం:విశాఖపట్నం జిల్లా]]

13:30, 6 మే 2016 నాటి కూర్పు

విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు ఉద్యమం విశాఖపట్టణంలో ఉక్కు పరిశ్రమ కోసం జరిగిన ఉద్యమం. ఈ ఉద్యమాన్ని అప్పటి నాయకుడు తెన్నేటి విశ్వనాథం[1] ముందుండి నడిపించాడు. ఈ ఉద్యమంలో భాగంగా 23మంది ప్రాణాలర్పించారు. 1971లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసింది. 26వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ కర్మాగారం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి 10వేలకోట్ల రూపాయలతో 20 ఎకరాల భూమినిచ్చి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సహకరించింది. కానీ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురుకావడం, ప్రభుత్వాలు మారడం వలన ఇది పూర్తవడానికి 20 ఏళ్లు పట్టింది. 1992 ఆగస్టు 8న అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని జాతికి అంకితం చేశాడు. మొదట్లో ఉక్కు ఉత్పత్తిలో దేశంలోనే మొదటగా నిలిచింది. కానీ కర్మాగారం నిర్మాణం కోసం నిధులు లేకపోవడంతో ఇతర సంస్థలపై ఆధారపడటంతో 1998-2000 సంవత్సరంలో ఖాయిలా పరిశ్రమగా మిగిలింది. ఈ సందర్భంగా ఉక్కుకార్మిక సంఘాలు అనేక ఉద్యమాలు చేపట్టడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఉక్కువడ్డీలను ఈక్విటీగా మార్చడం జరిగింది. ఆ తర్వాత ఉక్కు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంటూ ప్రపంచశ్రేణి ఉక్కు కర్మాగారంగా నిలబడింది. త్వరలోనే ఈ కర్మాగారం మినిరత్న నుంచి నవరత్న స్థాయికి చేరుకుంది. [2]

మూలాలు

  1. కె.ఆర్, దీపక్ (నవంబరు 10, 2004). "హిందూ". కస్తూరి అండ్ సన్స్. హిందూ బిజినెస్ లైన్. Retrieved 5 May 2016.
  2. Andhra, Voice. "andhravoice". Andhravoice. Andhravoice. Retrieved 5 May 2016.